Supreme Court: ఉచితాలు ఇంకెంత కాలం?.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
- కేంద్ర ప్రభుత్వ ఉచిత రేషన్ పథకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- ఉచిత రేషన్ను ప్రజలకు ఎప్పటి వరకు పంపిణీ చేస్తారని ప్రశ్నించిన న్యాయస్థానం
- ఉచిత రేషన్కు బదులుగా ప్రభుత్వం ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించడం లేదని నిలదీత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: కేంద్ర ప్రభుత్వ ఉచిత రేషన్ పథకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత రేషన్ను ప్రజలకు ఎప్పటి వరకు పంపిణీ చేస్తారని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఉచిత రేషన్కు బదులుగా ప్రభుత్వం ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించడం లేదని నిలదీసింది. జాతీయ ఆహార భద్రత చట్టం 2013 ప్రకారం 81 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. అయినప్పటికీ, దాదాపు 2 నుండి 3 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ పథకం నుండి మిగిలిపోయారని న్యాయస్థానానికి వివరించారు. ఈ లెక్కలను బట్టి చూస్తే పన్ను చెల్లింపుదారులు మాత్రమే ఈ స్కీమ్కు దూరంగా ఉన్నారని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి వలస కార్మికులకు ఉచిత రేషన్ లభిస్తోందని, దీనికి బదులుగా వారికి ఉపాధి అవకాశాలు, కల్పించం, వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Also Read
- RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
- Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
- UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
- India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్పై భారత్ చారిత్రక విజయం
ఇప్పటికే 81.35 కోట్ల మంది ఎన్ఎఫ్ఎస్ఏ కింద ప్రయోజనాలు పొందుతున్నారని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటియా తెలిపారు. దీనిపై ఎన్జీవో తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ, నిరుద్యోగం గణనీయంగా పెరిగినందున కరోనా మహమ్మారి కారణంగా పేద ప్రజల పరిస్థితి నిజంగా అధ్వాన్నంగా ఉందని అన్నారు. దీనిపై జస్టిస్ కాంత్ మౌఖికంగా వ్యాఖ్యానించారు, అప్పుడు ఉపాధి కల్పించడానికి ఏమి చేయాలో ఆలోచించాలన్నారు. 2020లో కరోనా కాలంలో మొదలైన వల కార్మికుల కష్టాలు నేటికీ కొనసాగుతున్నాయని పేర్కొంటూ ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్పై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ శ్రమ్ పోర్టల్లో నమోదైన వలస కార్మికులందరికీ ఉచిత రేషన్ సమకూర్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ క్రమంలో ధర్మాసనంపై స్పందిస్తూ.. ఇక ఎంతకాలం ఉచితాలు ఇవ్వాలని.. ఈ వలస కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించి నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు ఎందుకు పని చేయకూడదని ప్రశ్నించింది. అనంతరం కోర్టు తదుపరి విచారణను జనవరి 8, 2025కు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
-
RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
-
Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
-
Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!