Lakshmi Parvathi: చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ నేత లక్ష్మీపార్వతికి ఎదురుదెబ్బ తగిలింది. ఒకరి ఆస్తుల గురించి తెలుసుకోవడానికి మీరెవరు అంటూ సుప్రీంకోర్టు ఆమెను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై తెలుగు అకాడమీ ఛైర్పర్సన్, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పందించారు. తన కేసులో ఒకరి ఆస్తుల గురించి ప్రశ్నించడానికి తానెవరు అని అత్యున్నత నాయస్థానం ప్రశ్నించిందని.. అయితే జగన్ ఆస్తుల కేసులో శంకర్రావు ఎవరు అని…
Supreme Court To Hear Plea on marital rape: వివాహ అనంతరం భార్య అనుమతి లేకుండా బలవంతంగా శృంగారం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఇంతకుముందు ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు పరస్పరం విరుద్ధమైన తీర్పులు ఇవ్వడంతో సమస్య ఏర్పడింది. దీంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. కాగా ఈ కేసును సెప్టెంబర్ 16న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
Supreme Court set to hear pleas challenging Citizenship Amendment Act (CAA) on September 12: పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ)-2019కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది. సెప్టెంబర్ 12న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ తో కూడిన ధర్మాసనం ఈ అంశానికి వ్యతిరేకంగా నమోదైన 200కి పైగా పిటిషన్లను విచారించనుంది. 2019లో ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీతో పాటు కొన్ని చోట్ల…
Supreme Court denies to entertain plea seeking Nupur Sharma's arrest: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధిని అరెస్ట్ చేయాలంటూ అందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను శుక్రవారం తోసిపుచ్చింది. ఈ పిటిషన్ ఉపసంహరించుకోవాలని సూచించింది. దీంతో పిటిషనర్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. గత నెలలో నుపుర్ శర్మపై ఎలాంటి బలవంతపు…
Supreme Court grants bail to Kerala journalist Siddique Kappan: కేరళకు చెందిన జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2020 నుంచి జైలులోనే ఉన్నాడు సిద్ధిఖీ కప్పన్. ఇంతకు ముందు అలహాబాద్ హైకోర్టులో బెయిల్ కోసం అప్లై చేయగా.. కోర్టు తిరస్కరించింది. ఆ తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు సిద్ధిఖీ కప్పన్. తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఇచ్చే సమయంలో ప్రతీ వ్యక్తికి భావప్రకటన స్వేచ్చ…
Supreme Court on Hijab Controversy: కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. పాఠశాలల్లో హిజాబ్ నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ పలువురు కర్ణాటక హైకోర్టుకు వెళ్లగా.. హైకోర్టు కూడా విద్యాసంస్థల్లో తప్పకుండా యూనిఫామ్ ధరించాల్సిందే అని స్పష్టం చేసింది. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది.
Polavaram Project: ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరం వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు నెలకొందని తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తులు, సంస్థలు పిటిషన్లు దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను స్వీకరించి విచారణ చేపట్టింది. పర్యావరణ అనుమతులను ఉల్లంఘించి పోలవరం నిర్మాణం చేపట్టినట్లు పిటిషనర్లు ఆరోపించారు. పర్యావరణ అనుమతులకు, ప్రాజెక్టు నిర్మాణానికి పొంతన లేదని కోర్టుకు వివరించారు. ఈ అంశంపై…
ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని నిలిపివేయాలని, రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను ఉపయోగించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.