Supreme Court: ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంలో ఎదురుదెబ్బ.. శివసేనపై ఈసీదే తుది నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court On shivsena party issue: మహారాష్ట్రలో శివసేన సంక్షోభం కొనసాగుతోంది. అసలైన శివసేన ఎవరిదనే ప్రశ్నకు ఇక కేంద్ర ఎన్నికల సంఘమే సమాధానం ఇవ్వనుంది. తాజాగా సుప్రీంకోర్టులో మాజీ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురుదెబ్బ తాకింది. శివసేన పార్టీపై ఇటు ఏక్ నాథ్ షిండే వర్గం, అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే తాజాగా మంగళవారం రోజు ఈ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఉద్దవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాల్లో ఎవరిది అసలైన శివసేన అని గుర్తించే అవకాశం ఎన్నికల సంఘానికే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విల్లు, బాణం గుర్తు ఎవరికి చెందుతుందో తేల్చేది ఇక ఎన్నికల సంఘమే అని సుప్రీంకోర్టు తెలిపింది. నిజమైన శివసేన గుర్తింపు కోసం షిండే వర్గం వేసిన పిటిషన్ పై ఎన్నికల సంఘం విచారణను నిలిపి వేయాలని ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టు ఆశ్రయించింది. అయితే దీనికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఉద్దవ్ ఠాక్రే వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎన్నికల సంఘం విచాణకు స్టే ఇవ్వాలని కోరుతూ ఉద్దవ్ ఠాక్రే వర్గం పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.
Also Read
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
Read Also: EAM Jaishankar: సిక్కు మహిళ కిడ్నాప్, మతమార్పిడి.. పాకిస్తాన్కు ఇండియా స్ట్రాంగ్ మెసేజ్
ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు ఏక్ నాథ్ షిండేకు గొప్ప ఊరటగా పేర్కొనవచ్చు. ఏక్ నాథ్ షిండే వర్గానికి పెద్ద విజయంగా భావిస్తున్నారు. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది. మెజారిటీ శివసేన ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఏక్ నాథ్ షిండేకు మద్దతుగా ఉన్నారు. లోక్ సభలో మెజారిటీ ఎంపీలు కూడా ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వైపే ఉన్నారు. దీంతో శివసేనపై ఏక్ నాథ్ షిండే ఆధిపత్యమే అధికంగా ఉంది. దీంతో అసలైన శివసేన ఎవరిదనే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం విచారించనుంది.
శివసేనలో కీలక నేతగా ఉన్న మంత్రి ఏక్ నాథ్ షిండే.. మెజారిటీ శివసేన ఎమ్మెల్యేలతో సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేశారు. గౌహతిలో క్యాంప్ రాజకీయాలు చేశారు. దీంతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల మహావికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోయింది. శివసేన వర్గంతో కలిసి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా ఏక్ నాథ్ షిండే బాధ్యతలు తీసుకోగా.. దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
-
Rajnikanth : రజనీ అనేవాడు అలంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పడు చేయను
-
Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..