Supreme Court: హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పు రిజర్వ్
Supreme Court: విద్యా సంస్థల్లో హిజాబ్పై నిషేధాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తన తీర్పును రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్లో ఉంచింది. 10 రోజుల పాటు కొనసాగిన ఈ వ్యాజ్యం విచారణలో పిటిషనర్ తరఫు 21 మంది న్యాయవాదులు పాల్గొనగా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్, కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాద్గీ ప్రతివాదుల తరఫున వాదించారు. విద్యా సంస్థల్లో యూనిఫామ్లను సూచించేలా విద్యా సంస్థలను ఆదేశించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పలు పిటిషన్లను కోర్టు విచారించింది.కోర్టును ఉద్దేశించి, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, తన రిజాయిండర్ సమర్పణలో, డ్రస్ కోడ్ను అమలు చేసిన కర్ణాటక ప్రభుత్వ సర్క్యులర్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా గురించి ఎటువంటి ప్రస్తావన లేదని అన్నారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దవే వాదించారు.
ప్రతివాది సమర్పణకు కౌంటర్ ఇస్తూ, పిటిషనర్ తరఫు న్యాయవాది సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ, ప్రతివాదుల వాదనలు ఫ్రాన్స్, టర్కీ ఉదాహరణలను పేర్కొన్నాయి. మత విశ్వాసాన్ని వ్యక్తపరిచే ఏదైనా ఒక శిలువతో సహా బహిరంగంగా ప్రదర్శించడానికి అనుమతించబడదని ఖుర్షీద్ అన్నారు. పాఠశాలలు, కళాశాలల యూనిఫాం నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించిన కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివిధ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
గతంలో విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై ఆ రాష్ట్ర సర్కారు విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితూరాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జెఎం ఖాజీలతో కూడిన ధర్మాసనం ఇస్లాం మతవిశ్వాసాల ప్రకారం ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని విశ్వసిస్తున్నామని పేర్కొంది. “విద్యాసంస్థల్లో యూనిఫాం ధరించాలని చెప్పడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం కాదు. అది సహేతుకమైన పరిమితి.యూనిఫాం ధరించడంపై జీవో జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. పాఠశాల యూనిఫాం ధరించడం అనేది విద్యాసంస్థల ప్రొటోకాల్. దీన్ని విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాలి” కర్ణాటక హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.
Congress President Poll : ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
ఈ ఏడాది జనవరిలో ఉడిపిలోని ప్రభుత్వ పీయూ కళాశాలలో హిజాబ్ ధరించిన ఆరుగురు బాలికలను లోనికి రానీయకుండా నిషేధించడంతో హిజాబ్ వివాదం చెలరేగింది. దీంతో కళాశాలలో ప్రవేశం నిరాకరించడంతో బాలికలు కళాశాల బయటే నిరసనకు దిగారు. దీని తర్వాత ఉడిపిలోని అనేక కళాశాలల అబ్బాయిలు కాషాయ కండువాలు ధరించి తరగతులకు హాజరు కావడం ప్రారంభించారు. ఈ నిరసన రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో భారీ ఆందోళనలకు దారితీసింది. ఫలితంగా, కర్ణాటక ప్రభుత్వం విద్యార్థులందరూ తప్పనిసరిగా యూనిఫాంకు కట్టుబడి ఉండాలని, నిపుణుల కమిటీ ఈ అంశంపై నిర్ణయం తీసుకునే వరకు హిజాబ్, కాషాయ కండువాలు రెండింటినీ నిషేధించింది. ఫిబ్రవరి 5న, ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్ బోర్డు ఒక సర్క్యులర్ను విడుదల చేసింది. విద్యార్థులు పాఠశాల అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిన యూనిఫాం మాత్రమే ధరించవచ్చు. ఇతర మతపరమైన దుస్తులను కాలేజీలలో అనుమతించబోమని పేర్కొంది.
తాజావార్తలు
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!