Students Passport: పంజాబ్ విద్యార్థుల పాస్పోర్టు సమస్య.. కేంద్రానికి రాష్ట్ర మంత్రి వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panjab Students Passport: ఈ మధ్య కాలంలో విదేశాల్లో ఉన్నత విద్యను చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు పాస్పోర్టు సమస్యలు వస్తున్నాయి. భారతీయ విద్యార్థులకు కొన్ని దేశాలు పాస్పోర్టును ఇవ్వడానికి సవాలక్ష షరతులు విధిస్తున్నాయి. ఇప్పటికే ఆష్ట్రేలియా భారత్లోని కొన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు పాస్ పోర్టు ఇవ్వడానికి షరతులు విధించింది. అలాగే జపాన్ దేశం కూడా కొన్ని షరతులతో పాస్పోర్టులను జారీ చేస్తోంది. ఇపుడు పంజాబ్ విద్యార్థులకు కెనడాలో ఇటువంటి సమస్యనే ఎదురైంది. ఈ నేపథ్యంలో కెనడాలో పంజాబ్ విద్యార్థులు ఎదుర్కొంటున్న పాస్పోర్టు సమస్యలను పరిష్కరించాలని ఆ రాష్ట్ర మంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
Read also: Irrigation Day: తెలంగాణలో సాగునీటి దినోత్సవ వేడుకలు.. జిల్లాల వారిగా ఇలా..!
Also Read
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
కెనడాలో ఇమ్మిగ్రేషన్ మోసాల్లో ఇరుక్కుని, బహిష్కరణ కేసులను ఎదుర్కొంటున్న 700 మంది భారతీయ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని పంజాబ్ ఎన్నారై వ్యవహారాల మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 700 మంది విద్యార్థుల్లో ఎక్కువ మంది పంజాబ్కు చెందిన వారని వారని.. వారి సమస్యను పరిష్కరించాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్కు రాసిన లేఖలో ధాలివాల్ కోరారు. విద్యార్థులను బహిష్కరించరాదని .. వారి వీసాలను పరిగణనలోకి తీసుకుని వర్క్ పర్మిట్లు ఇవ్వాలని కోరారు.
Read also: Petrol-Diesel rates: భారత్ లో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు.. లీటరు ఎంతో తెలుసా..?
విద్యార్థులను మోసం చేసిన ట్రావెల్ ఏజెంట్లను శిక్షించేందుకు పంజాబ్ ప్రభుత్వానికి సహకరించాలని కోరుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ధాలివాల్ అభ్యర్థించారు. తాను EAMని కలవడానికి సమయం కూడా కోరానని.. తద్వారా మొత్తం విషయాన్ని వ్యక్తిగతంగా GOI దృష్టికి తీసుకురావచ్చని లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో మానవ అక్రమ రవాణా ఘటనలు జరగకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు. విదేశాలకు వెళ్లే ముందు లేదా తమ పిల్లలను చదువుల కోసం విదేశాలకు పంపే ముందు.. ఆయా కళాశాలల వివరాలను మరియు విద్యార్థులను తీసుకెళ్లే ట్రావెల్ ఏజెంట్ రికార్డును తప్పనిసరిగా తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇండోనేషియాలో మరణశిక్ష విధించబడిన ఇద్దరు పంజాబీ అబ్బాయిల కేసు జూన్ 26 నుండి మళ్లీ ప్రారంభమవుతుందని.. ఈ కేసులో ఇద్దరూ నిర్దోషులుగా విడుదల చేయబడతారని ధాలివాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
-
Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
-
OTR: జాగ్రత్త.. మీరు, మీ భర్త జాగ్రత్తగా మెలగండి..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!