Students Passport: పంజాబ్ విద్యార్థుల పాస్పోర్టు సమస్య.. కేంద్రానికి రాష్ట్ర మంత్రి వినతి
Panjab Students Passport: ఈ మధ్య కాలంలో విదేశాల్లో ఉన్నత విద్యను చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు పాస్పోర్టు సమస్యలు వస్తున్నాయి. భారతీయ విద్యార్థులకు కొన్ని దేశాలు పాస్పోర్టును ఇవ్వడానికి సవాలక్ష షరతులు విధిస్తున్నాయి. ఇప్పటికే ఆష్ట్రేలియా భారత్లోని కొన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు పాస్ పోర్టు ఇవ్వడానికి షరతులు విధించింది. అలాగే జపాన్ దేశం కూడా కొన్ని షరతులతో పాస్పోర్టులను జారీ చేస్తోంది. ఇపుడు పంజాబ్ విద్యార్థులకు కెనడాలో ఇటువంటి సమస్యనే ఎదురైంది. ఈ నేపథ్యంలో కెనడాలో పంజాబ్ విద్యార్థులు ఎదుర్కొంటున్న పాస్పోర్టు సమస్యలను పరిష్కరించాలని ఆ రాష్ట్ర మంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
Read also: Irrigation Day: తెలంగాణలో సాగునీటి దినోత్సవ వేడుకలు.. జిల్లాల వారిగా ఇలా..!
Also Read
కెనడాలో ఇమ్మిగ్రేషన్ మోసాల్లో ఇరుక్కుని, బహిష్కరణ కేసులను ఎదుర్కొంటున్న 700 మంది భారతీయ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని పంజాబ్ ఎన్నారై వ్యవహారాల మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 700 మంది విద్యార్థుల్లో ఎక్కువ మంది పంజాబ్కు చెందిన వారని వారని.. వారి సమస్యను పరిష్కరించాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్కు రాసిన లేఖలో ధాలివాల్ కోరారు. విద్యార్థులను బహిష్కరించరాదని .. వారి వీసాలను పరిగణనలోకి తీసుకుని వర్క్ పర్మిట్లు ఇవ్వాలని కోరారు.
Read also: Petrol-Diesel rates: భారత్ లో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు.. లీటరు ఎంతో తెలుసా..?
విద్యార్థులను మోసం చేసిన ట్రావెల్ ఏజెంట్లను శిక్షించేందుకు పంజాబ్ ప్రభుత్వానికి సహకరించాలని కోరుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ధాలివాల్ అభ్యర్థించారు. తాను EAMని కలవడానికి సమయం కూడా కోరానని.. తద్వారా మొత్తం విషయాన్ని వ్యక్తిగతంగా GOI దృష్టికి తీసుకురావచ్చని లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో మానవ అక్రమ రవాణా ఘటనలు జరగకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు. విదేశాలకు వెళ్లే ముందు లేదా తమ పిల్లలను చదువుల కోసం విదేశాలకు పంపే ముందు.. ఆయా కళాశాలల వివరాలను మరియు విద్యార్థులను తీసుకెళ్లే ట్రావెల్ ఏజెంట్ రికార్డును తప్పనిసరిగా తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇండోనేషియాలో మరణశిక్ష విధించబడిన ఇద్దరు పంజాబీ అబ్బాయిల కేసు జూన్ 26 నుండి మళ్లీ ప్రారంభమవుతుందని.. ఈ కేసులో ఇద్దరూ నిర్దోషులుగా విడుదల చేయబడతారని ధాలివాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
-
Abhishek-Travis Head: అభిషేక్ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..
-
Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
-
Rajnath Singh: “సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం”.. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!