Lack of PhD: ఉన్నత విద్యాసంస్థల్లో పీహెచ్డీల కొరత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lack of PhD: విద్యలేని వాడు వింత పశువు అంటారు. అంటే చదువు లేకపోతే జంతువుతో సమానమని దాని అర్థం. ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు. అయితే వారి చదివి ఎంత వరకు సాగుతుందనేది సెకండరీ. కొందరు ప్రైమరీ వరకు చదివితే .. కొందరు హైస్కూల్ వరకు చదువుతారు.. మరికొందరు ఉన్నత విద్యను కొనసాగిస్తారు. చదువులో ఉన్నతమైంది పీహెచ్డీ పట్టా. అంటే తను చదవాలనుకున్న దాంట్లో డాక్టర్ ఆఫ్ ఫిలాసపీ(పీహెచ్డీ) సాధించడం. అయితే పీహెచ్డీ పట్టా పొందడం అంతా సులువైన విషయం కాదు. ఎంతో కష్టపడాలి.. దాంతోపాటు తాను చేయాలనుకున్న అంశంపై అవగాహన ఉండాలి.. పట్టు సాధించాలి. అయితే దేశంలో పీహెచ్డీ చేసి విద్యా బోధనలో ఉండే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. పీహెచ్డీ చేసి బోధనా వృత్తిలో ఉండే వారు .. అదీ ఉన్నత విద్యా సంస్థల్లో బోధన చేసే వారు చాలా తక్కువగా ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
Read also: Save Income Tax: ప్రతి నెలా పేరెంట్స్ కు రెంట్ ఇవ్వండి.. రూ. 99000 ఆదా చేస్కోండి
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో పీహెచ్డీల కొరత ఎక్కువగా ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం .. ఈ సంస్థ ర్యాంకింగ్స్లో ఉన్న తొలి 100 కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల్లో సగటున 61.6 శాతం మందికి మాత్రమే పీహెచ్డీ డిగ్రీలు ఉన్నాయి. ఇతర విద్యా సంస్థల్లో 44. 63 శాతమే ఉంది. కానీ దేశంలోని మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో బోధించే వారిలో అత్యధికంగా 91.60 శాతం మందికి డాక్టరేట్ డిగ్రీ పట్టా ఉంది. ఇతర కళాశాలల్లో ఇది కేవలం 61 శాతం మాత్రమే ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో మొదటి 100 స్థానాల్లో ఉన్న ఉన్నత విద్యా సంస్థల్లోనే డాక్టరేట్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇతర సంస్థలు పోస్ట్ గ్రాడ్యుయేట్(పీజీ) డిగ్రీలున్న వారితోనే బోధనను నెట్టుకొస్తున్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉన్న మొదటి 100 కళాశాలలు పరిశోధనలకు పెద్దపీట వేస్తున్నాయని, అందుకే ఆ సంస్థల్లో దాదాపు అందరు అధ్యాపకులకూ పీహెచ్డీ డిగ్రీలు ఉన్నాయని యూజీసీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం.జగదీష్ కుమార్ చెప్పారు.
Read also: Naseem Shah: నా టార్గెట్ విరాట్ కోహ్లీ.. పాక్ యువ బౌలర్ హాట్ కామెంట్స్..
కొన్ని సబ్జెక్టుల్లో పీహెచ్డీ చేసే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. వాటిల్లో ప్రధానంగా వాణిజ్య శాస్త్రం, న్యాయశాస్త్రం, వాస్తు శాస్త్రం, విదేశీ భాషల్లో పీహెచ్డీ చేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ఆయా కోర్సులు బోధిస్తున్న కళాశాలలు పీహెచ్డీ అధ్యాపకుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ పొందిన టాప్ 100 కళాశాలల్లో ఇంజినీరింగ్ కాలేజీలో ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లో 81.20 శాతం మంది పీహెచ్డీ పట్టాలున్న వారు ఉన్నారు. మిగిలిన ఇంజినీరింగ్ కాలేజీల్లో వీరి సంఖ్య కేవలం 34.94 శాతం మాత్రమే ఉంది. ఇక ఉత్తమ యూనివర్సిటీల విషయానికి వస్తే టాప్ 100 విశ్వవిద్యాలయాలలో పీహెచ్డీ చేసిన అధ్యాపకులు 73.60 శాతం ఉన్నారు. ఫార్మసీ విద్యా సంస్థల్లో పీహెచ్డీ చేసిన వారు చాలా తక్కువగా ఉన్నట్టు ఎన్ఐఆర్ఎఫ్ ప్రకటించింది.
తాజావార్తలు
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..