ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక దంపతులు బలవర్మణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. సంగారెడ్డిలోని నారంరెడ్డి కాలనీకి చెందిన త్రినాథ్రెడ్డి(35), ఆయన భార్య మల్లిక (33) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. త్రినాథ్రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా.. మల్లిక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. వారికి 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల బాబు కూడా ఉన్నాడు. పెళ్లి అయిన కొన్ని ఏళ్ల వరకు సాఫీగా సాగిన వారి ప్రయాణంలో గత కొంతకాలంగా ఆర్థిక…
వరి ధాన్యాన్ని తన కల్లంలోనే కొనుగోలు చేయాలని విధుల్లో ఉన్న ప్రాథమిక పీఏసీఎస్ సీఈఓపై ఓ రైతు పెట్రోల్ పోశాడు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. CEO కథనం ప్రకారం గ్రామానికి చెందిన గజ్జెల విఠల్ తన పొలంలో పండిన రైస్ గ్రైయిన్ ని కల్లంలోనే కుప్పగా పోశాడు. దగ్గరలోనే కొనుగోలు కేంద్రం ఉన్నప్పటికీ ధాన్యాన్ని అక్కడికి తీసుకు వెళ్ళకుండా కల్లంలోనే కొనుగోలు చేయాలని కల్హేర్ పీఏసీఎస్ సీఈఓ భాస్కర్ మీద కొద్దిరోజులుగా…
బంగాళాఖాతంలో రుతుపవనాలు విస్తరించి ఉన్న ప్రాంతం నుంచి తమిళనాడు వరకు గాలులతో 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ పలు ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. రానున్న ఐదు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే ఐదు…
నగరంలోని శంషాబాద్ లోని సంగారెడ్డి మండల రిటైర్డ్ పంచాయితీ అధికారి సురేందర్ రెడ్డి ఇంట్లో గురువారం నాడు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 2కోట్ల 31 లక్షల 63వేల 600 అక్రమ ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. అక్రమాస్తుల కేసులో సంగారెడ్డి మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) సురేందర్రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు (ఏసీబీ) అరెస్టు చేశారు. గురువారం ఉదయం శంషాబాద్ లోని సంగారెడ్డి మండలలోని సురేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా…
తెలంగాణలో మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరుగుతున్నా కాంగ్రెస్, బీజేపీ నేతలకు కళ్ళు కనిపిస్తాలేదన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో అభయహస్తం ఫండ్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. నెలకు రెండు వేల పెన్షన్ ఇస్తున్నాం… అభయహస్తం ద్వారా మహిళల గ్రూప్ లకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా బ్యాంక్ లింకేజ్ లో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు రూ.672 కోట్లు ఇచ్చామన్నారు. రాష్టంలో టీఆర్స్ ప్రభుత్వం వచ్చాక…
సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి స్టయిలే వేరు. రాజకీయంగా ఎంత బిజీగా వున్నా తన పర్యటనలు మాత్రం కొనసాగిస్తూనే వుంటారు. తాజాగా ఆయన హైదరాబాద్ లోని కంది ఐఐటీ డైరెక్టర్ తో సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు నిర్మల జగ్గారెడ్డి ,కుమార్తె జయరెడ్డి ,కుమారుడు భరత్ సాయి రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఐఐటీ చుట్టూ పక్కల గ్రామాలలో ఉన్న యువతతో పాటు నియోజకవర్గంలోని యువతకు ,నిరుద్యోగులకు ఉద్యోగాల పై ఐఐటీ డైరెక్టర్ తో సమావేశంలో…
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఐఐటీ హైదరాబాద్ లో మెడికల్ ఎక్విప్ మెంట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. ఈ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి, జిల్లా కలెక్టర్,ఎస్పీ పాల్గొన్నారు. ఐఐటి హైదరాబాద్ లో జీవన్ లైట్ స్మార్ట్ మెడికల్ ఐసీయూ వెంటిలేటర్ ను ప్రారంభించారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఐఐటి హైదరాబాద్ లో తయారు చేసిన జీవన్ లైట్ స్మార్ట్ మెడికల్ ఐసియు వెంటిలేటర్ ప్రారంభించడం సంతోషంగా ఉంది.…
పిల్లలు ఉత్సాహంగా ఆడుకుంటుండగా జరిగిన ఓ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో ఎయిర్ గన్ పేలి బాలిక మృతిచెందింది.. పిల్లల ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.. వెంటనే బాలికను ఉస్మానియా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసిన అప్పటికే మృతిచెందినట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం బాలిక శాండ్వి మృతిదేహం ఉస్మానియా ఆస్పత్రిలో…
వివిధ ప్రాచీన కళలు కనుమరుగవుతున్నాయి. గతంలో ఏ చిన్న కార్యక్రమం వున్నా డప్పు ద్వారా అందరికీ తెలియచేసేవారు. విద్యార్థుల్లో ఉన్న సామాజిక చైతన్య స్పృహని ,వాళ్లలో ఉన్న కళని పైకి తెచ్చి ఉపాధి అవకాశాలను మెరుగు పరిచే విధంగా చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. మరుగున పడిన డప్పు కళను ఈతరం సమాజానికి పరిచయం చేద్దామని సంగారెడ్డి పట్టణం తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డప్పు సర్టిఫికెట్ కోర్సు ఏర్పాటు చేశారు ప్రిన్సిపాల్ ప్రవీణ. ఈ సర్టిఫికెట్ కోర్స్…
దేశంలోనే రోల్ మోడల్ గా తెలంగాణ మారిపోతోందన్న అక్కసుతోనే ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. సంగారెడ్డిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బీజేపీ నేతలపై మండిపడ్డారు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేయడానికి దారి తీసిన కారణాల్లో సంగారెడ్డి జిల్లాలోని పరిస్థితులు ఒకటన్నారు. రూ 4400కోట్లతో 4.5లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సంగారెడ్డికి వచ్చిన కేసీఆర్ మెడికల్ కాలేజీ…