Sangareddy: అధికారులపై పెట్రోల్ పోసిన రైతు..? తరువాత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరి ధాన్యాన్ని తన కల్లంలోనే కొనుగోలు చేయాలని విధుల్లో ఉన్న ప్రాథమిక పీఏసీఎస్ సీఈఓపై ఓ రైతు పెట్రోల్ పోశాడు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. CEO కథనం ప్రకారం గ్రామానికి చెందిన గజ్జెల విఠల్ తన పొలంలో పండిన రైస్ గ్రైయిన్ ని కల్లంలోనే కుప్పగా పోశాడు. దగ్గరలోనే కొనుగోలు కేంద్రం ఉన్నప్పటికీ ధాన్యాన్ని అక్కడికి తీసుకు వెళ్ళకుండా కల్లంలోనే కొనుగోలు చేయాలని కల్హేర్ పీఏసీఎస్ సీఈఓ భాస్కర్ మీద కొద్దిరోజులుగా ఒత్తిడి తెస్తున్నాడని ఆరోపించారు.
కేంద్రంలో ఇతర రైతుల ధాన్యం కుప్పలు వరుసక్రమంలో ఉన్నాయని, వాటిని ఆ ప్రకారమే కొంటున్నామని ఆయన సమాధానం చెప్పాడు. వెంటనే తన ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని సదరు రైతు ఓ రాజకీయ నాయకుడితోనూ సీఈవో కు చెప్పించాడని పేర్కొన్నారు. అయినా కొనుగోలు చేయడం లేదనే కోపంతో గోదాం వద్ద ఉన్న సీఈఓపై రైతు విఠల్ ఒక్కసారిగా సీసాలో తెచ్చిన పెట్రోల్ పోశాడని, ఈ ఘటనతో కంగుతిన్న భాస్కర్ వెంటనే తేరుకొని పెట్రోల్ తో తడిసిన దుస్తులు విప్పేసి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశానని తెలిపారు. విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని ఎక్సై ప్రశాంత్ తెలిపారు.
Also Read
- Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
- Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
అయితే పెట్రోల్ పోసిన రైతు విఠల్ మీడియాతో మాట్లాడుతూ.. నేను ధాన్యం తెచ్చి నెల రోజులయ్యిందని వాపోయాడు. భాస్కర్ అనే అధికారి కావాలనే నా వడ్లు కొనడం లేదని ఆరోపించాడు. నాకంటే వెనుక తీసుకు వచ్చిన ధాన్యాన్ని కొన్నాడు.. కానీ, నావి మాత్రం కొనలేదని కన్నీరుమున్నీరయ్యాడు. ఉద్దేశపూర్వకంగానే భాస్కర్ వడ్లు కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పు తెచ్చి పంట పండించాను.. అప్పు ఇచ్చిన వాళ్ళు డబ్బులు అడుగుతున్నారని కన్నీటిపర్వంతమయ్యాడు. పెట్రోలు తో భాస్కర్ ని తగలబెట్టి నేను కూడా పెట్రోల్ పోసుకుని చనిపోదాం అనుకున్ననని వాపోయాడు. ఇంకో రెండు రోజుల్లో వడ్లు కొనకుంటే నేనె చనిపోతా అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా, రైతుల వద్ద నుంచి ధాన్యం తామే కొనుగోలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతనెలలో ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు అధికారులు. బయటి రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వరి రారుండా చర్యలు చేపట్టారు. ప్రధానంగా మహారాష్ట్ర నుంచి వరి ధాన్యం రాకుండా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో నాలుగు రాస్ట్రాల సరిహద్దుల్లో 51 చోట్ల పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రం దగ్గర నోడల్ ఆఫీసర్, మిల్లుల దగ్గర స్పెషల్ ఆఫీసర్లు విధులు నిర్వర్తిస్తారు. వరి కొనుగోళ్ల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ వరికి రూ.1960 ధర ప్రకటించింది.
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!