Harish Rao: కాంగ్రెస్, బీజేపీలకు కళ్ళు కనిపిస్తాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరుగుతున్నా కాంగ్రెస్, బీజేపీ నేతలకు కళ్ళు కనిపిస్తాలేదన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో అభయహస్తం ఫండ్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. నెలకు రెండు వేల పెన్షన్ ఇస్తున్నాం… అభయహస్తం ద్వారా మహిళల గ్రూప్ లకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా బ్యాంక్ లింకేజ్ లో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు రూ.672 కోట్లు ఇచ్చామన్నారు.
రాష్టంలో టీఆర్స్ ప్రభుత్వం వచ్చాక మహిళల ఆత్మ గౌరవం పెరిగింది. పేదింటి ఆడపిల్లల పెళ్లికి కళ్యాణ లక్ష్మీ ద్వారా రూ లక్షా 117 రూపాయలు ఇస్తున్నాం.పెద్ద ఆపరేషన్ కాకుండా ప్రైవేట్ హోస్పిల్ కు వెళ్ళకుండ కేసీఆర్ కిట్టుతోపాటు ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కళ్ళు కనిపిస్లాలేదు. నీళ్లకు,కర్రెంట్ కు ఇబ్బంది లేకుండా చేశాం.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
రాష్టంలో ఒకడు పాదయాత్ర, మరొకడు మోకాళ్ళ యాత్ర చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం 24 గంటల కరెంట్ ఇవ్వలేదు. 60 ఏళ్ళలో ఏం జరగలేదు 6 ఏళ్లలో చేసి చూపించింది టీఆర్ఎస్ పార్టీ. ఎవరి కోసం పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలి. మీరు అధికారంలో వున్న కర్ణాటకలో రెండు వేల పింఛన్ ఇచ్చాక పాదయాత్ర చేయాలన్నారు. ప్రజలను మోసం చేయాలని మాట్లాడుతున్నారు.
బీజేపీ పాలిస్తున్న రాష్టాల్లో తెలంగాణ రాష్టంలో ఇస్తున్న పథకాలు ఉన్నాయా? ప్రభుత్వ పథకాలు పైరవీలు, లంచాలు లేకుండా డైరెక్టు గా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ లో పడుతున్నాయి. బీజేపీ అంటే భారతీయ జూట పార్టీ.100 అబద్దాలు ఆడైన అధికారం లోకి రావాలని చూస్తోందన్నారు. బీజేపీ పార్టీ అధికారంలో ఉండగా ఇప్పుడు 400 గ్యాస్ ధర కాస్తా 1000 దాటింది. మళ్ళీ కట్టెలు పొయ్యిలు వస్తున్నాయి. గ్యాస్ సబ్సిడీ అమౌంట్ 400 నుండి 40 రూపాయలకు చేరింది. సబ్సిడీ అమౌంటు వేయడంలేదు. ఈ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు పెద్ద పీట వేస్తుంది.
Read Also: Revanth Reddy: కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్రెడ్డి స్వీట్ వార్నింగ్..! శాశ్వత బహిష్కరణే..!
11 వేల కోట్లు మాయం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పంచుతుంటే బీజేపీ ప్రభుత్వం పెంచుతూ పోతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపితే పేద ప్రజలకు సిలిండర్ ధరల భారం తగ్గుతుందన్నారు మంత్రి హరీష్ రావు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!