వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. కాగా బ్రిక్స్ సదస్సుకు సంబంధించి రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రిక్స్ దేశాలు వచ్చే నెలలో జరిగే తమ శిఖరాగ్ర సమావేశంలో సీమాంతర వాణిజ్యం కోసం దీర్ఘకాలిక చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై చర్చిస్తాయని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
రష్యాపై యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ క్లస్టర్ ఆయుధాలను వాడుతోంది. అమెరికా ఉక్రెయిన్కు పంపిన క్లస్టర్ ఆయుధాలు రష్యాపై జరుగుతున్న యుద్ధంలో ఉపయోగిస్తుంది
రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో తయారైన యాపిల్ ఐఫోన్లను ప్రభుత్వ అధికారులు ఉపయోగించకుండా నిషేధించినట్లు వెల్లడించింది. ఐఫోన్లు, ఐప్యాడ్ల వంటి ఇతర యాపిల్ ఉత్పత్తులను వినియోగించడం మానేయాలని రష్యా యొక్క ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ వేలాది మంది అధికారులకు చెప్పిన్నట్లు తెలుస్తోంది.
ప్రిగోజిన్పై అమెరికా అధ్యక్షులు జొ బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనపై విష ప్రయోగం జరిగే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాగ్నర్ బాస్ ప్రిగోజిన్ ఇటీవల.. రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
రెండు రోజుల్లో ముగుస్తుందనుకున్న రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం500 రోజులుగా కొనసాగుతుంది. 2022ను యుద్ధనామసంవత్సరంగా మారింది.. 2022, ఫిబ్రవరి 24న రష్యా- ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం ప్రారంభమయినప్పుడు ఇన్ని రోజుల పాటు కొనసాగుతుందని ఎవరు అనుకోలేదు. నాలుగైదు రోజుల్లో యుద్ధం ముగిసిపోతుందని అందరు అనుకున్నారు. అసలు యుద్ధం లక్ష్యమేంటో తెలియనప్పటికీ నెలరోజులలోపు ఉక్రెయిన్ను రష్యా స్వాధీనం చేసుకుంటుందని అందరు అంచనా వేశారు. కానీ పరిస్థితులు తలకిందులయ్యాయి.
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 500 రోజుల మార్క్ ను చేరుకుంది. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది.
Russia: రష్యా రాజధాని మాస్కోపై మంగళవారం డ్రోన్ అటాక్ జరిగింది. రాజధాని సమీపంలో ఐదు డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. అయితే ఈ చర్యకు అమెరికా, నాటోనే కారణం అని.. వీటి సాయం లేకుండా రష్యా భూభాగంపై డ్రోన్ దాడులు సాధ్యం కాదని రష్యా ఆరోపించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని అభినందించారు. ఆయన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం భారత ఆర్థిక వ్యవస్థపై నిజంగా ఆకట్టుకునే ప్రభావాన్ని చూపిందని అన్నారు.
తూర్పు ఉక్రెయిన్ నగరమైన క్రామాటోర్స్క్ను మంగళవారం రెండు రష్యా క్షిపణులు ఢీకొనడంతో ఒక చిన్నారితో సహా కనీసం నలుగురు మరణించారు, మరో 42 మంది గాయపడ్డారు. మొదటి క్షిపణి రెస్టారెంట్ను తాకింది, గణనీయమైన నష్టాన్ని కలిగించింది.