Russia: న్యూఢిల్లీ నిర్వహించిన జీ20 సమావేశం ‘మైలురాయి’గా మిగిలిపోతుందని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ అభివర్ణించారు. G20 అధ్యక్షుడిగా భారతదేశం తొలిసారిగా గ్లోబల్ సౌత్ స్థానాన్ని ఏకీకృతం చేసిందని ఆయన అన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎజెండా కాకుండా భారత్ వ్యవహరించిందని చెప్పారు. ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణపై ఆయన స్పందించారు.
జీ20 ఢిల్లీ డిక్లరేషన్ భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు బలప్రయోగం చేసే ముప్పు నుంచి దూరంగా ఉండాలని దేశాలను కోరింది. ఉక్రెయిన్లో సమగ్ర, న్యాయమైన, శాశ్వత శాంతిని నెలకొల్పాలని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్లో యుద్ధానికి సంబంధించి రష్యా గురించి నేరుగా ప్రస్తావించకుండా అణ్వాయుధాల ఉపయోగం లేదా ముప్పు ఆమోదయోగ్యం కాదని సభ్య దేశాలు కోరాయి.
Russia-Ukraine War: గత ఏడాదిన్నరగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే రష్యా, ఉక్రెయిన్ కు రెండిన తూర్పు ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో పట్టు నిలుపుకునేందుకు అక్కడ ఎన్నికలు నిర్వహింస్తోంది రష్యా. డోనెట్స్క్, లూహాన్స్క్, ఖేర్సన్, జపొరిజ్జియా ప్రాంతాల్లో రష్యా శుక్రవారం ఎన్నికలను ప్రారంభించింది. ఆదివారంతో ఇవి ముగియనున్నాయి. ఇదిలా ఉంటే రష్యా చర్యను వెస్ట్రన్ దేశాలు ఖండిస్తున్నాయి.
Russia: దీర్ఘకాలంగా జరుగుతున్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా మరన్ని ఆయుధాలను సమకూర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉంగ్ తో, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
NASA: దాదాపుగా 40 ఏళ్ల తరువాత రష్యా చంద్రుడిపైకి లూనా-25 అంతరిక్ష నౌకను పంపింది. అన్ని అనుకున్నట్లు జరిగిే చంద్రయాన్-3 కన్నా ముందే లూనా-25 చంద్రుడి దక్షిణ ధృవంపై దిగి చరిత్ర సృష్టించేది. అయితే చంద్రుడి కక్ష్యలోకి చేరిన తర్వాత లూనా-25 రష్యాతో సంబంధాలు కోల్పోయింది. చివరకు చంద్రుడిపై కుప్పకూలింది.
Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పోరు మొదలైంది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ జోరు పెరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, వివేక్ రామస్వామి,
Yevgeny Prigozhin: వాగ్నర్ కిరాయి సైన్యానికి చీఫ్గా ఉన్న యెవ్జెనీ ప్రిగోజిన్ కొన్ని రోజుల క్రితం ఓ విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అత్యంత సన్నిహితుడైన ప్రిగోజిన్
భారత్లో జీ20 సమ్మిట్ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోడీకి ఫోన్ చేసినట్లు తెలిసింది. న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు తాను భారత్కు రాలేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీకి తెలిపారు.
గస్టు 23న రష్యాలో ఓ ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయారు. ఈ సమయంలో వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ కూడా ఈ విమానంలో ఉన్నారని తెలిసింది. యెవ్జెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారని కూడా తెలిసింది.
రష్యా రాజధాని మాస్కోలో శనివారం డ్రోన్ దాడి జరిగింది. దీంతో రాజధాని మాస్కోలోని మూడు ప్రధాన విమానాశ్రయాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రష్యా అధికారిక మీడియా పేర్కొంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడగా.. గత కొన్ని వారాలుగా డ్రోన్ల ద్వారా రాజధాని మాస్కో , పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.