సైనిక సంఘర్షణతో సమస్యకు పరిష్కారం దొరకదని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో ఫిన్నిష్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు.
Alexei Navalny: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను తీవ్రంగా విమర్శించే వ్యక్తిగా, రష్యా ప్రతిపక్ష నేతగా పేరున్న ‘‘అలెక్సీ నావల్నీ’’ హత్యకు రష్యా ప్రభుత్వమే బాధ్యత వహించాలని యూకే, ఫ్రాన్స్, జర్మనీ సహా ఐదు యూరోపియన్ దేశాలు డిమాండ్ చేశాయి. నావల్నీని విష ప్రయోగంతో చంపేవారని ఆరోపించాయి.
Russia: భారత్, ఇతర దేశాలు రష్యా చమురు కొనుగోలు చేయకుండా నిరోధించడానికి అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా తీవ్రంగా విమర్శిస్తోంది. ఆర్థిక ఆధిపత్యాన్ని సాధించడానికి సుంకాలు, ఆంక్షలు, నిషేధాల వంటి బలవంతపు చర్యలను ట్రంప్ ప్రయోగిస్తున్నాడని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి దిశగా అడుగులు పడుతున్నాయి. గత నాలుగేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా చర్చలు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 4-5 తేదీల్లో అబుదాబిలో రష్యా-ఉక్రెయిన్-అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశాలు జరుగుతాయన్నారు
భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరుగుతున్న వేళ అగ్ర రాజ్యం అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యూరప్ తనకు వ్యతిరేకంగా యుద్ధానికి నిధులు సమకూర్చుతోందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఆరోపించారు.
వెనిజులా అధ్యక్ష భవనంపై అమెరికా దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్యను కిడ్నాప్ చేసుకుని వెళ్లిపోయారు. నిమిషాల వ్యవధిలోనే అమెరికా ఆపరేషన్ ముగించేసింది. ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య మరోసారి శాంతి చర్చలు జరగబోతున్నాయి. అయితే ఈసారి రష్యా-అమెరికా-ఉక్రెయిన్ త్రైపాక్షిక సమావేశం జరగనుంది. ఇందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదిక కానుంది.
దావోస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన కొనసాగుతోంది. ఇక ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రసంగిస్తూ పుతిన్, జిన్పింగ్లను ప్రశంసించారు. వారిద్దరితో మంచి సంబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఏప్రిల్లో చైనాలో పర్యటించనున్నట్లు తెలిపారు.
గ్రీన్లాండ్ వివాదం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. గ్రీన్లాండ్ను కొనుగోలు చేయడానికి అమెరికాకు అనుమతి లభించేంత వరకు యూరోపియన్ దేశాలపై సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ వార్నింగ్ను మిత్ర దేశాలు తీవ్రంగా ఖండించాయి.
ఇరాన్లో పరిస్థితులు పూర్తిగా చేదాటిపోయాయి. నగరాలు రక్తసిక్తంగా మారాయి. వందలాది మంది నిరసనకారులు శవాలు రోడ్లపై పడి ఉన్నాయి. దాదాపు వందలాది మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.