ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజ టీంలు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
Today Business Headlines 05-04-23: ముగ్గురూ.. ముగ్గురే..: క్రీడా రంగంలో.. ముఖ్యంగా క్రికెట్లో.. కోహ్లి, ధోని, రోహిత్ శర్మ.. ఈ ముగ్గురూ వాణిజ్య ప్రకటనలతో దూసుకెళుతున్నారు. ఒక్కొక్కరూ కనీసం 30 బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నారు. మొత్తం 505 సంస్థలు సెలెబ్రిటీలతో ఈ మేరకు ఒప్పందాలు చేసుకోగా.. అందులో ఏకంగా 381 ఒప్పందాలను క్రికెటర్లతోనే కుదుర్చుకోవటం విశేషం. మొత్తం డీల్స్ వ్యాల్యూ 749 కోట్ల రూపాయలు.
ఐపీఎల్-16 ఓపెనింగ్ కు ముందు అహ్మదాబాద్ వేదికగా నిర్వహించే కెప్టెన్సీ మీట్ లో 9 జట్ల సారథులు మాత్రమే పాల్గొన్నారు. కానీ రోహిత్ శర్మ రాకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.
మరో 24 గంటల్లో ( రేపటి ) నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ కు తెరలేవనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్ లో నాలుగు సార్లు టైటిల్ విన్నర్ సీఎస్కే, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
టీమిండియా క్రికెటర్లు ఆమిర్ ఖాన్ ను ఫన్నీగా ట్రోల్ చేశారు. రోహిత్ శర్మ స్పందిస్తూ.. సినిమాలో క్రికెట్ ఆడినంత మాత్రానా క్రికెటర్ అయిపోడు.. ఒక హిట్ సినిమాకు రెండేళ్లు తీసుకుంటే హిట్ మ్యాన్ లు అయిపోలేరు.. అంటూ ట్రోల్ చేశాడు.
బీసీసీఐలో ఉన్న చాలామందిక కూడా జస్ప్రిత్ బుమ్రా గాయం స్టేటస్ గురించి తెలీదు. కేవలం ఎస్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం బుమ్రాని స్పెషల్ గా పర్యవేక్షిస్తున్నాడు.