ఫార్ములా ఈ కార్ రేస్ లో నిందితుడుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ని తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇప్పటికే అరవింద్ కుమార్ ని ప్రాసికూట్ క్యూట్ చేయడానికి కేంద్రం అనుమతించింది. అరవింద్ కుమార్ పై ఈ కార్ రేస్ కు సంబంధించి అవినీతి ఆరోపణలు.. అధికార దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడంతో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. Also Read:Land Dispute: బాపట్ల ఎస్పీ ఫ్యామిలీ…
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో పాలనను మరింత పారదర్శకంగా, టెక్నాలజీ ఆధారితంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేశారు. అధికారులతో నిర్వహించిన తాజా సమీక్షా సమావేశంలో ఆయన నగర అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం , భద్రతపై విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా హోటళ్లలో ఫుడ్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ప్రతి హోటల్ కిచెన్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, వాటిని నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించాలని ఆదేశించారు. దీనివల్ల…
తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రూప్-1, గ్రూప్-2 నియామకాలను పూర్తి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కొత్తగా విధుల్లోకి చేరుతున్న అధికారులకు దిశానిర్దేశం చేశారు. “ఇక్కడి ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని సహించరు. సహనంగా ఉంటారు కానీ ఆధిపత్యాన్ని అస్సలు ఒప్పుకోరు” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాల నుంచి సమ్మక్క-సారలమ్మల తిరుగుబాటు వరకు అన్నీ…
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలతో మరోసారి సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం నుంచి హైదరాబాద్ మెట్రో స్వాధీనం వరకు పలు ప్రధాన అంశాలపై కీలక ఆమోదాలు లభించాయి. ప్రమాద బీమా, క్యాష్లెస్ హెల్త్ స్కీమ్, హెచ్ఎండిఎ విస్తరణ, రోడ్లు–నీటి ప్రాజెక్టులు వంటి నిర్ణయాలతో రాష్ట్ర పరిపాలనలో కొత్త దిశ కనిపిస్తోంది. 1. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం.. భద్రతకు రాష్ట్ర మంత్రి వర్గం కీలక…
TG Cabinet Decisions : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర పురోగతికి సంబంధించి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు వ్యవహారం, వైద్య విధాన పరిషత్లో మార్పులు , భూ కేటాయింపులపై కేబినెట్ ముద్ర వేసింది. ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించింది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ (L&T)…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జన గణన (Census 2027) ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం కీలక ఆమోదం తెలిపింది. ఈ భారీ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధమవుతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన తొలి విడత ఇండ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు ఈ…
CM Revanth at AI Summit:కృత్రిమ మేధ (AI) అనేది మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆవిష్కరణ అని, అది మనిషి మేధోశక్తిని సైతం దాటి ఆలోచించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొనియాడారు. ఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన, ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో మన జీవితాలను, ముఖ్యంగా వ్యవసాయం వంటి కీలక రంగాలను అనూహ్యంగా మార్చబోతోందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఏఐ వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి…
Delhi Meeting: ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన కీలక సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, దామోదర రాజనర్సింహా, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ…
Off The Record: చాలా రోజుల తర్వాత హస్తినకు తెలంగాణ కాంగ్రెస్ నేతలని అధిష్టానం పిలిచింది. సీఎం రేవంత్ రెడ్డి ..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…పాటుగా మంత్రులు… పిసిసి చీఫ్ మహేష్ గౌడ్.. ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను ఏఐసీసీ పిలిచింది. గతంలో ఎన్నికల సందర్భంగా అందరినీ ఏకం చేసేందుకు ఇలాంటి సమావేశాన్ని నిర్వహించారు. అలాంటి సమావేశం తిరిగి గురువారం జరగబోతోంది. ఢిల్లీలో జరిగే మీటింగ్ పై పార్టీలోలో… పొలిటికల్గా పెద్ద చర్చ జరుగుతుంది. ఇటీవల మంత్రుల మధ్య…
CM Revanth Reddy: 2006లో ఇండిపెండెంట్ జడ్పీ ఛైర్మన్గా నిలబడ్డప్పుడు వైఎస్ హవాలోనూ లంబాడా యువకులు తనను జడ్పీటీసీగా గెలిపించారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. నాలుగు నెలల్లో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నట్లు తెలిపారు.. నేడు సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. 20 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో లంబాడా యువకులు అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు.. ఇప్పటికీ కరెంట్ లేని తండాలు ఉన్నాయని.. మానవ జాతి…