CM Revanth Reddy : వర్గీకరణ పోరాటంలో నేనే మీ బార్బరికుడిని.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
- మాదిగ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు
- ‘బార్బరికుడిలా మీ కోసం పోరాడుతాను’ అన్న ముఖ్యమంత్రి
- ప్రభుత్వ పథకాల అమల్లో ఉద్యోగుల కీలక పాత్ర
- వర్గీకరణతో న్యాయం చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాదిగ సామాజిక వర్గ హక్కుల సాధనలో తెలంగాణ ప్రభుత్వం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. శిల్పకళా వేదికలో నిర్వహించిన ‘మాదిగ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్’ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్గీకరణను అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం తనకు గర్వకారణమని చాటిచెప్పారు.
గత ఇరవై ఏళ్లుగా మాదిగ వర్గీకరణ పోరాటాన్ని తాను దగ్గరుండి చూస్తున్నానని సీఎం గుర్తు చేసుకున్నారు. “నాడు అసెంబ్లీలో వర్గీకరణ కోసం గళమెత్తితే, అప్పటి పాలకులు నన్ను, సంపత్ కుమార్, సండ్ర వెంకటవీరయ్యను సభ నుంచి బయటకు గెంటేశారు. కానీ నేను మిత్ర ధర్మాన్ని మరువలేదు” అని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. మహాభారతంలోని కర్ణుడు, బార్బరికుడి పాత్రలను ఉదాహరణగా చూపుతూ.. బలహీనుల పక్షాన నిలబడి పోరాడటమే తన నైజమని స్పష్టం చేశారు.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
ప్రభుత్వ ఉద్యోగులే ఈ పాలనకు కళ్లు , బ్రాండ్ అంబాసిడర్లు అని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలంటే అది ఉద్యోగుల చేతుల్లోనే ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల కోసం పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారని, వాటిని ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉందని గుర్తు చేశారు. రాబోయే 99 రోజులు ఒక దీక్షలా పనిచేస్తే ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని, ఒక్కరోజు పని చేయకున్నా సామాన్యులు ఇబ్బంది పడతారని సూచించారు.
వర్గీకరణతో అన్ని సమస్యలు పరిష్కారం కాలేదని అంగీకరిస్తూనే, భవిష్యత్తులో అన్ని అడ్డంకులను అధిగమిస్తామని భరోసా ఇచ్చారు. “ముందుండి నేను సమస్యలను పరిష్కరిస్తాను, వెనక నుండి జరిగే రాజకీయ దాడులను మీరు చూసుకోవాలి” అని ఉద్యోగ వర్గాలకు పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విషయంలో ఖజానా పరిస్థితిని వివరిస్తూనే, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్తో పాటు పలువురు మాదిగ ఎంపీలు, ఎమ్మెల్యేలు , ప్రజాప్రతినిధులు పాల్గొని మాదిగ సామాజిక వర్గ అభివృద్ధికి తమ మద్దతును ప్రకటించారు.
T20 WC 2026 Final: భారత్ నుంచి ఏకైక ఆటగాడిగా సంజూ రికార్డ్! ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్కు నామినేట్..
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!