CM Revanth Reddy : వర్గీకరణ పోరాటంలో నేనే మీ బార్బరికుడిని.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
- మాదిగ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు
- ‘బార్బరికుడిలా మీ కోసం పోరాడుతాను’ అన్న ముఖ్యమంత్రి
- ప్రభుత్వ పథకాల అమల్లో ఉద్యోగుల కీలక పాత్ర
- వర్గీకరణతో న్యాయం చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాదిగ సామాజిక వర్గ హక్కుల సాధనలో తెలంగాణ ప్రభుత్వం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. శిల్పకళా వేదికలో నిర్వహించిన ‘మాదిగ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్’ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్గీకరణను అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం తనకు గర్వకారణమని చాటిచెప్పారు.
గత ఇరవై ఏళ్లుగా మాదిగ వర్గీకరణ పోరాటాన్ని తాను దగ్గరుండి చూస్తున్నానని సీఎం గుర్తు చేసుకున్నారు. “నాడు అసెంబ్లీలో వర్గీకరణ కోసం గళమెత్తితే, అప్పటి పాలకులు నన్ను, సంపత్ కుమార్, సండ్ర వెంకటవీరయ్యను సభ నుంచి బయటకు గెంటేశారు. కానీ నేను మిత్ర ధర్మాన్ని మరువలేదు” అని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. మహాభారతంలోని కర్ణుడు, బార్బరికుడి పాత్రలను ఉదాహరణగా చూపుతూ.. బలహీనుల పక్షాన నిలబడి పోరాడటమే తన నైజమని స్పష్టం చేశారు.
Also Read
- Telangana Govt: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. బకాయిల సొమ్ము రూ.6 వేల కొట్లు విడుదల..
- Metro Express: కరీంనగర్లో 'సిటీ మెట్రో ఎక్స్ప్రెస్' బస్సులు ప్రారంభం.. ఈ రూట్లల్లో అందుబాటులోకి..
- Drugs: డ్రగ్స్ సొమ్ముతో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు.. దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ..
- Anganwadi Recruitment: అంగన్వాడీ ఉద్యోగాల నియామకం.. ఆ జిల్లాలకు మంత్రి సీతక్క డెడ్లైన్..
ప్రభుత్వ ఉద్యోగులే ఈ పాలనకు కళ్లు , బ్రాండ్ అంబాసిడర్లు అని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలంటే అది ఉద్యోగుల చేతుల్లోనే ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల కోసం పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారని, వాటిని ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉందని గుర్తు చేశారు. రాబోయే 99 రోజులు ఒక దీక్షలా పనిచేస్తే ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని, ఒక్కరోజు పని చేయకున్నా సామాన్యులు ఇబ్బంది పడతారని సూచించారు.
వర్గీకరణతో అన్ని సమస్యలు పరిష్కారం కాలేదని అంగీకరిస్తూనే, భవిష్యత్తులో అన్ని అడ్డంకులను అధిగమిస్తామని భరోసా ఇచ్చారు. “ముందుండి నేను సమస్యలను పరిష్కరిస్తాను, వెనక నుండి జరిగే రాజకీయ దాడులను మీరు చూసుకోవాలి” అని ఉద్యోగ వర్గాలకు పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విషయంలో ఖజానా పరిస్థితిని వివరిస్తూనే, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్తో పాటు పలువురు మాదిగ ఎంపీలు, ఎమ్మెల్యేలు , ప్రజాప్రతినిధులు పాల్గొని మాదిగ సామాజిక వర్గ అభివృద్ధికి తమ మద్దతును ప్రకటించారు.
T20 WC 2026 Final: భారత్ నుంచి ఏకైక ఆటగాడిగా సంజూ రికార్డ్! ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్కు నామినేట్..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!