Rajya Sabha Nominations: రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి నామినేషన్ దాఖలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajya Sabha Nominations: తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు. ఏఐసీసీ ముఖ్య ప్రతినిధి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డి తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల అధికారి ఉపేందర్రెడ్డికి వీరు నామినేషన్ సెట్లను అందజేశారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Team India Players: టీమిండియా ఆటగాళ్లలో మొదలైన భయం.. మా వంతు రాదని గ్యారెంటీ ఏంటి అంటూ..
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ శ్రేణుల కోలాహలంతో అసెంబ్లీ ప్రాంగణం సందడిగా మారింది. నామినేషన్ అనంతరం అభ్యర్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. తెలంగాణ తరఫున రెండోసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు కేసీ వేణుగోపాల్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Ustaad Bhagat Singh:‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్..
అలాగే వేం నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన పార్టీ అధిష్ఠానానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మొదటి స్థానానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్న అభిషేక్ మను సింఘ్వీ పేరును అధిష్ఠానం ముందే ఖరారు చేయగా, రెండో స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బుధవారం రాత్రి వరకు జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం వేం నరేందర్రెడ్డి పేరు ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టడం, పార్టీలో అందరితో సానుకూల సంబంధాలు ఉండటంతో నరేందర్రెడ్డి వైపు అధిష్ఠానం మొగ్గు చూపింది. వేం నరేందర్రెడ్డికి MIM పార్టీ మద్దతు ఇచ్చింది.
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!