Dommeti Sambayya: రాజ్యసభ అభ్యర్థి రేసులో దొమ్మాటి సాంబయ్య
- రాజ్యసభ రేసులో వేం నరేందర్ రెడ్డి పేరు దాదాపు ఖరారా?
- సామాజిక సమీకరణాల్లో దొమ్మాటి సాంబయ్యకు ప్రాధాన్యం
- ఏఐసీసీ జూమ్ మీటింగ్లో కీలక చర్చలు
- విధేయత, సమర్థతకే అధిష్టానం ప్రాధాన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. అభ్యర్థుల ఎంపికపై బుధవారం కాంగ్రెస్ అధిష్టానం కీలకమైన జూమ్ మీటింగ్ను నిర్వహించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు ఆశావహుల పేర్లు చర్చకు వచ్చినప్పటికీ, ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Smartphone Safety Tips: మీ స్మార్ట్ ఫోన్లోకి హోలీ రంగు, నీరు చేరిందా..? ఇలా కాపాడుకొండి..
Also Read
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
ఈసారి రాజ్యసభ రేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వేం నరేందర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొదటి నుండి రేవంత్ రెడ్డికి అండగా ఉంటూ, పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించిన నరేందర్ రెడ్డికి ఈసారి పెద్దల సభకు వెళ్లే అవకాశం దక్కేలా కనిపిస్తోంది.
నరేందర్ రెడ్డితో పాటు వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు దొమ్మాటి సాంబయ్య పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. సామాజిక సమీకరణాల దృష్ట్యా సాంబయ్య పేరును అధిష్టానం గంభీరంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న విధేయులకు ఈసారి ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పరిస్థితులు, సామాజిక సమీకరణాల దృష్ట్యా ముఖ్యమంత్రి , పీసీసీ చీఫ్ సూచించిన అభ్యర్థులనే ఎంపిక చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, పార్టీ విధేయత , సమర్థతనే ప్రాతిపదికగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
Sanju Samson: చారిత్రాత్మక ఇన్నింగ్స్.. సంజు శాంమ్సన్ కు ఐసిసి నుండి ప్రధాన బహుమతి
తాజావార్తలు
-
Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
-
Peddi Ticket Price Hike: తెలంగాణాలో ‘పెద్ది’ టికెట్ ధరలు పెరగనట్లేనా..? హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మూవీ టీమ్..!
-
Vaibhav Sooryavanshi: ఒకే వారంలో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ రికార్డులు బ్రేక్.. ఐపీఎల్లో వైభవ్ ఆల్టైమ్ హిస్టరీ..
-
Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
-
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్పై కెప్టెన్ గిల్ రియాక్షన్
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..