Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించేసింది బీజేపీ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 199 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 115 సీట్లు గెలుచుకుంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో బీజేపీ తరుపున ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధర రాజేనే ముఖ్యమంత్రిగా చేస్తారా..? లేకపోతే కొత్తవారిని సీఎం సీటు వరిస్తుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
Rajyavardhan Rathore : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాని నాయకులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే పార్టీ నేతలు నేరస్తులను హెచ్చరిస్తున్నారు.
నిన్న వెల్లడైన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందింది. 115 సీట్లు గెలుచుకుని అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో.. జైపూర్లోని హవా మహల్ సీటును గెలుచుకున్న బీజేపీ ఎమ్మెల్యే బల్ముకుంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆ ప్రాంతంలోని వీధుల్లోని అన్ని నాన్ వెజ్ ఫుడ్ స్టాల్స్ను మూసివేయాలని ఆదేశించారు.
PM Modi: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. చలి నెమ్మదిగా వస్తుందని, అయితే రాజకీయ వేడి వేగంగా పెరుగుతోందని ప్రధాని అన్నారు.
మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన ఘనవిజయంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు వ్యాఖ్యానించారు. 2024లో 350 సీట్లకు పైగా గెలిచి మరలా మరోసారి ప్రధాని మోడీ అని మరోసారి రుజువు చేసిన ప్రజా తీర్పు అని ఎంపీ జీవీఎల్ అన్నారు. మోడీ ప్రభుత్వం విశ్వసనీయత, అవినీతి రహిత పాలన ఈ మూడు రాష్ట్రాల్లో ఘన విజయానికి కారణమన్నారు.
Ashok Gehlot: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో బీజేపీ అఖండ విజయం సాధించడంతో ఆయన తన రాజీనామాను గవర్నర్కి అందించారు. గవర్నర్ కల్రాజ్ మిశ్రా నివాసానికి వెళ్లి రాజీనామా సమర్పించారు. మొత్తం 199 స్థానాలకు గానూ ఎన్నికలు జరగగా.. బీజేపీ 115 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఏర్పడింది. కాంగ్రెస్ 70 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో కాంగ్రెస్ ఓటమి ఖాయం కావడంతో గెహ్లాట్ సర్కార్ గద్దెదిగబోతోంది.
Assembly election results 2023: 2024 లోక్సభ ఎన్నికల ముందు దేశం మొత్తం కూడా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాయి. ఈ రోజు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపొందితే.. మిగిలిన మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది.
ప్రజల ఆదేశాన్ని వినయంగా అంగీకరిస్తున్నట్లు, ఐడియాలజీ యుద్ధం కొనసాగుతుందని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుపై ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు చేస్తామన్న అన్ని హామీలను తప్పకుండా నెరవేరుస్తామమని చెప్పారు.
Rajasthan: ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే రాజస్థాన్లో బీజేపీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా మ్యాజిక్ ఫిగర్ దాటి 115 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. అయితే రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ విజయం మరో ‘యోగి’ ఎదుగుదలకు దారి తీసే అవకాశం ఏర్పడింది. రాజస్థాన్ యోగిగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మి నాయకుడు, అల్వార్ ఎంపీ బాబా బాలక్ నాథ్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో ఒకరుగా ఉన్నారు.
PM Narendra Modi: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఈ రోజు జరిగిన 4 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలో బీజేపీ బంపర్ విక్టరీ సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఆయా రాష్ట్రాల ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రజలు సుపరిపాలన, అభివృద్ధి రాజకీయాలను ఎంచుకున్నారని ఫలితాలు సూచిస్తున్నాయని అన్నారు.