Rajasthan: రాజస్థాన్ సీఎంపై ఉత్కంఠ..60 మంది ఎమ్మెల్యేలకు వసుంధర రాజే ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించేసింది బీజేపీ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 199 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 115 సీట్లు గెలుచుకుంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో బీజేపీ తరుపున ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధర రాజేనే ముఖ్యమంత్రిగా చేస్తారా..? లేకపోతే కొత్తవారిని సీఎం సీటు వరిస్తుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
అయితే ఈ సారి వసుంధర రాజేకు బీజేపీ చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు అంతర్గత వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యూపీలో యోగి ఆదిత్యనాథ్ తరహాలో రాష్ట్రంలో కూడా యోగి బాబా బాలక్ నాథ్కి బీజేపీకి సీఎం పగ్గాలు అప్పగించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరొకొందరి పేర్లను బీజేపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
Read Also: Kamal Nath: “ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో 50 ఓట్లు రాలేదు”.. ఇది ఎలా సాధ్యం..
ఇదిలా ఉంటే వసుంధర రాజే సీఎం సీటు కోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం 68 మంది ఎమ్మెల్యేలకు వసుంధర రాజే ఫోన్ చేసి తనను కలవాలని చెప్పినట్లు తెలుస్తోంది. బలప్రదర్శనలో భాగంగా రాజేని ఇప్పటి వరకు 28 మంది ఎమ్మెల్యేలు కలిశారని, అయితే ఇందులో కొంతమంది స్వతంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేలు మాత్రం తాము మర్యాదపూర్వకంగా కలిశామని, పార్టీ నాయకత్వం రాజేని రాష్ట్రంలో సీఎం పదవికి ఎంచుకుంటే మద్దతు ఇస్తామని చెప్పారు.
వసుంధర రాజేతో పాటు ఝల్రాపటన్ స్థానం నుంచి గెలిచిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మెఘ్వాల్, బాబా బాలక్ నాథ్, వసుంధర రాజేలాగే రాజవంశీయురాలైన దియా కుమారి కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ అరుణ్ సింగ్, బీజేపీ చీఫ్ సీపీ జోషి పార్టీ హైకమాండ్ని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో వీరు భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు షెకావత్, బాలక్ నాథ్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. వసుంధర రాజే 2003 నుంచి 2008 వరకు, 2013-18 వరకు రెండు సార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!