Assembly election results 2023: 4 రాష్ట్రాల్లో సీఎంలు అయ్యే అవకాశం వీరికే ఉంది..
Assembly election results 2023: 2024 లోక్సభ ఎన్నికల ముందు దేశం మొత్తం కూడా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాయి. ఈ రోజు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపొందితే.. మిగిలిన మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో సీఎంలుగా ఎవరుంటారనే చర్చ జరుగుతోంది. పాతవాళ్లనే కొనసాగిస్తారా..? లేక కొత్త ముఖాలు అధికారాన్ని చేపడుతాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Also Read
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
తెలంగాణ:
తెలంగాణలో చూస్తే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా రేసులో ఉన్నారని వారి అనుచరులు చెబుతున్నారు. అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపుతుందో చూడాలి.
మధ్యప్రదేశ్:
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2006 నుంచి బీజేపీ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ తిరుగులేని నేతగా ఉన్నారు. అవినీతి లేకపోవడం ఆయనకు క్లీన్ ఇమేజ్ ఇస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన నేతృత్వంలోనే బీజేపీ గెలుపొందింది. 2006 నుంచి ఆయన బుధ్నీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ గెలుపొందుతున్నారు.
రాజస్థాన్:
రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ నేత, మాజీ సీఎం వసుంధర రాజేకి చెక్ పెట్టాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ బీజేపీ నుంచి సీఎం అభ్యర్థి రేసులో ఈమె ముందు ఉంది.
ఇక రాజస్థాన్ ఎన్నికల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు బాబా మహంత్ బాలక్ నాథ్. అందరి కన్నా ముందు సీఎం రేసులో ఉన్నారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ లాగే బాలక్ నాథ్ ఓ యోగి. ఆయన ప్రస్తుతం అల్వార్ నుంచి ఎంపీగా ఉన్నారు. బాలక్ నాథ్ తిజారా అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ విజయం సాధించారు. అవినీతి, మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, నేరాలు కాంగ్రెస్ పార్టీ పరాజయానికి కారణమయ్యాయి.
ఛత్తీస్గఢ్:
ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్కే బీజేపీ తరుపున సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన మూడు సార్లు రాష్ట్రానికి సీఎంగా కొనసాగారు.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!