Balmukund Acharya: రోడ్డుపక్కన ఉన్న నాన్ వెజ్ స్టాళ్లన్నింటినీ మూసేయండి.. బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న వెల్లడైన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందింది. 115 సీట్లు గెలుచుకుని అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో.. జైపూర్లోని హవా మహల్ సీటును గెలుచుకున్న బీజేపీ ఎమ్మెల్యే బల్ముకుంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆ ప్రాంతంలోని వీధుల్లోని అన్ని నాన్ వెజ్ ఫుడ్ స్టాల్స్ను మూసివేయాలని ఆదేశించారు. ఫలితాలు ప్రకటించిన 24 గంటల తర్వాత.. బాల్ముకుంద్ ప్రభుత్వ అధికారిని పిలిచి, సాయంత్రంలోగా అన్ని నాన్-వెజ్ ఫుడ్ స్టాల్స్ను మూసివేయాలని ఆదేశించారు. వీధులు శుభ్రంగా ఉండాలని తెలిపారు. అయితే.. ఎమ్మెల్యే బాల్ముకుంద్ ఓ ప్రభుత్వ అధికారికి ఆదేశాలు జారీ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Supreetha: నేనేం అన్యాయం చేశా.. నన్నెందుకు వేధిస్తున్నారు.. సురేఖావాణి కూతురు పోస్ట్ వైరల్
Also Read
- Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ 'మావిగన్ వర్సెస్ అమరావతి'.. వైఎస్ జగన్ సవాల్..
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
- YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రజలతో మమేకమయ్యేందుకు బల్ముకుంద్ బయల్దేరాడు. ఈ క్రమంలో.. రోడ్డుపై నుంచి వెళ్తుండగా ఓ అధికారిని పిలిచి నాన్వెజ్ను బహిరంగంగా అమ్మవచ్చా అని అడిగాడు. అవును లేదా కాదు అని సమాధానం ఇవ్వండి. మీరు దానిని సమర్ధిస్తారా? అని ప్రశ్నించారు. రోడ్డుపై బహిరంగంగా నాన్వెజ్ విక్రయాలు సాగించే వారు కనిపించడం లేదన్నారు. సాయంత్రంలోగా నివేదిక అందించాలని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే బల్ముకుంద్ ఆచార్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో.. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఈ వ్యాఖ్యలపై స్పందించి విమర్శించారు. అలా మాట్లాడటం సరికాదని.. నాన్వెజ్ ఫుడ్ స్టాల్ మూసేయమనడం దౌర్జన్యమన్నారు. ఇలా తీసేయమంటే ఎలా? అని ప్రశ్నించారు. కాగా.. బాల్ముకుంద్ హవా మహల్ అసెంబ్లీ స్థానం నుంచి 600 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ఆర్ తివారీని ఓడించారు.
Satyendar Jain: సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ పొడిగించిన సుప్రీం కోర్టు..
ఇదిలా ఉంటే.. రాజస్థాన్ లో బీజేపీ విజయం సాధించిన తర్వాత సీఎం అభ్యర్థి ఎవరనేది చర్చనీయాంశమైంది. రాజస్థాన్లో పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. అందులో.. వసుంధర రాజే, అర్జున్ రామ్ మేఘ్వాల్, దియాకుమారి, ఓం బిర్లాతో సహా ముఖ్యమంత్రి పదవికి పోటీదారులలో చాలా మంది పేర్లు చర్చలో ఉన్నాయి. అయితే అధిష్టానం ఎవరని ముఖ్యమంత్రిని చేస్తుందో……..
తాజావార్తలు
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..