Balmukund Acharya: రోడ్డుపక్కన ఉన్న నాన్ వెజ్ స్టాళ్లన్నింటినీ మూసేయండి.. బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న వెల్లడైన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందింది. 115 సీట్లు గెలుచుకుని అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో.. జైపూర్లోని హవా మహల్ సీటును గెలుచుకున్న బీజేపీ ఎమ్మెల్యే బల్ముకుంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆ ప్రాంతంలోని వీధుల్లోని అన్ని నాన్ వెజ్ ఫుడ్ స్టాల్స్ను మూసివేయాలని ఆదేశించారు. ఫలితాలు ప్రకటించిన 24 గంటల తర్వాత.. బాల్ముకుంద్ ప్రభుత్వ అధికారిని పిలిచి, సాయంత్రంలోగా అన్ని నాన్-వెజ్ ఫుడ్ స్టాల్స్ను మూసివేయాలని ఆదేశించారు. వీధులు శుభ్రంగా ఉండాలని తెలిపారు. అయితే.. ఎమ్మెల్యే బాల్ముకుంద్ ఓ ప్రభుత్వ అధికారికి ఆదేశాలు జారీ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Supreetha: నేనేం అన్యాయం చేశా.. నన్నెందుకు వేధిస్తున్నారు.. సురేఖావాణి కూతురు పోస్ట్ వైరల్
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రజలతో మమేకమయ్యేందుకు బల్ముకుంద్ బయల్దేరాడు. ఈ క్రమంలో.. రోడ్డుపై నుంచి వెళ్తుండగా ఓ అధికారిని పిలిచి నాన్వెజ్ను బహిరంగంగా అమ్మవచ్చా అని అడిగాడు. అవును లేదా కాదు అని సమాధానం ఇవ్వండి. మీరు దానిని సమర్ధిస్తారా? అని ప్రశ్నించారు. రోడ్డుపై బహిరంగంగా నాన్వెజ్ విక్రయాలు సాగించే వారు కనిపించడం లేదన్నారు. సాయంత్రంలోగా నివేదిక అందించాలని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే బల్ముకుంద్ ఆచార్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో.. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఈ వ్యాఖ్యలపై స్పందించి విమర్శించారు. అలా మాట్లాడటం సరికాదని.. నాన్వెజ్ ఫుడ్ స్టాల్ మూసేయమనడం దౌర్జన్యమన్నారు. ఇలా తీసేయమంటే ఎలా? అని ప్రశ్నించారు. కాగా.. బాల్ముకుంద్ హవా మహల్ అసెంబ్లీ స్థానం నుంచి 600 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ఆర్ తివారీని ఓడించారు.
Satyendar Jain: సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ పొడిగించిన సుప్రీం కోర్టు..
ఇదిలా ఉంటే.. రాజస్థాన్ లో బీజేపీ విజయం సాధించిన తర్వాత సీఎం అభ్యర్థి ఎవరనేది చర్చనీయాంశమైంది. రాజస్థాన్లో పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. అందులో.. వసుంధర రాజే, అర్జున్ రామ్ మేఘ్వాల్, దియాకుమారి, ఓం బిర్లాతో సహా ముఖ్యమంత్రి పదవికి పోటీదారులలో చాలా మంది పేర్లు చర్చలో ఉన్నాయి. అయితే అధిష్టానం ఎవరని ముఖ్యమంత్రిని చేస్తుందో……..
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!