Ganesh Chaturthi: రాజస్థాన్ కోటా జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ వాట్సాప్ గ్రూపులో వచ్చిన ‘‘గణేష్ చతుర్థి శుభాకాంక్షలు’’ అనే పలు పోస్టులను డిలీట్ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాటూరిలోని ప్రభుత్వం హయ్యర్ సెకండరీ స్కూల్ కమిటీకి చెందిన వాట్సాప్ గ్రూపులో ఆ గ్రామస్తులు కూడా ఉన్నారు.
Rajasthan: రాజస్థాన్ కోటాలో 70 ఏళ్ల రైతుకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. సదరు వ్యక్తి పిత్తాశయం(గాల్బ్లాడర్)లో ఏకంగా 6110 రాళ్లను విజయవంతంగా తొలగించారు. బాధతుడు చాలా ఏళ్లుగా కడుపునొప్పి, వాంతులు, ఇతర సమస్యలతో బాధపడుతున్నాడని తెలిసింది. ఆరోగ్య సమస్యలపై ఆస్పత్రికి వెళ్లడంతో అసలు విషయం తెలిసింది. స్కానింగ్ రిపోర్టులో గాల్బ్లాడర్లో రాళ్లు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేయాల్సిందిగా సిఫారసు చేశారు.
Baby Born In Bus: రాజస్థాన్ రాష్ట్రంలోని భివాడిలో అల్వార్ – భివాడి హైవేపై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో ఒక మహిళా మగ బిడ్డకి జన్మనిచ్చింది. అల్వార్ చేరుకోకముందే ఆ మహిళకు ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపేశాడు. బస్సులో కూర్చున్న ప్రయాణికులు 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. ఈ సమయంలో అంబులెన్స్ రాకముందే మహిళ బస్సులోనే ప్రసవించింది. ఇక ప్రసవం తర్వాత ఆ తల్లి, బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు.…
జైపూర్లో డ్యామ్ తెగిపోవడంతో శ్మశానవాటిక మునిగిపోయింది. అందులో నుంచి బయటకు వచ్చాయి. అవి నీటిలో కొట్టుకుపోయాయి. చాలా మృతదేహాలు సమాధి నుంచి బయటకు వచ్చాయని స్థానికులు తెలిపారు.
Crime: మహిళలు, బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. దేశంలో ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మహారాష్ట్ర థానే జిల్లాలో 13 ఏళ్ల మైనర్ బాలికపై 28 ఏళ్ల నిందితుడు పదే పదే అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. భివాండిలోని న్యూ ఆజాద్ నగర్ ప్రాంతానికి చెందిన నిందితుడి పొరుగింటిలోనే బాలిక ఉండేది.
భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లా బార్మర్ సరిహద్దు ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తిని బీఎస్ఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. అనుమానాస్పద వ్యక్తిని బీఎస్ఎఫ్, పోలీసులు విచారిస్తున్నారు. కాగా.. అరెస్టయిన వ్యక్తి పాకిస్తానీ పౌరుడని తెలుస్తోంది.
Jewellery Shop Robbery: రాజస్థాన్ లోని ఖైర్తాల్ తిజారా జిల్లాలోని భివాడి సెంట్రల్ మార్కెట్ లో ఉన్న కమలేష్ జ్యువెలర్స్ దుకాణంపై కారులో వచ్చిన ఐదుగురు దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు అక్కడ ఉన్న ఉద్యోగులను, యజమానిని కొట్టారు. ఈ సందర్భంగా దుండగులు తుపాకీతో దాడి చేసి షాపులోని ఉద్యోగులను గాయపరిచారు. షాపులో ఉంచిన ఆభరణాలను కూడా బ్యాగులో వేసుకుని పారిపోయారు. బయటకు పరుగెత్తుతుండగా., దుండగులు కాల్పులు జరపడంతో గార్డు, జ్యువెలర్స్…
రాజస్థాన్లో ఓ పెద్ద నాగుపాము వాషింగ్ మిషన్లోకి దూరింది. లోపలికి దూరి హాయ్గా విశ్రాంతి తీసుకుంటుంది. సడన్గా కుటుంబ సభ్యుడు.. వాషింగ్ మిషన్ డోర్ ఓపెన్ చేసి చూడగా పాము ప్రత్యక్షమైంది. దీంతో అతడు షాక్కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rajasthan: ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ రాజస్థాన్ ఉదయ్పూర్లో మత ఘర్షణలకు కారణమైంది. ప్రభుత్వ పాఠశాలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు దేవరాజ్ అనే బాలుడిపై మైనారిటీ వర్గానికి చెందిన మరో బాలుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన తర్వాత నగర వ్యాప్తంగా మతపరమైన హింస చోటు చేసుకుంది. గాయపడిన బాలుడు నాలుగు రోజుల చికిత్స తర్వాత ఈ రోజు మరణించాడు.
Child Rape: కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై దారుణమైన అత్యాచారం హత్య ఘటన ఇంకా మరవక ముందే, రాజస్థాన్ లోని జోధ్పూర్ జిల్లా నుండి ఒక బాలికపై లైంగిక వేధింపుల భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చెత్త ఏరుకుని జీవించే వారి మూడేళ్ల కుమార్తెపై అత్యాచారం జరిగింది. అయితే, ఉదయం ఓ గుర్తుతెలియని వ్యక్తి పాపను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 3 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఆలయం…