Crime: స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్.. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష
- 17ఏళ్ల మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి
- స్నానం చేస్తుండగా ఫొటోలు.. వీడియోలు తీసి బ్లాక్మెయిల్
- నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని జుంజునులో 17ఏళ్ల మైనర్ బాలికపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. మైనర్ బాలిక స్నానం చేస్తుండగా నిందితుడు వీడియోలు, ఫొటోలు తీసిన తీశాడు. ఆ తర్వాత ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ అత్యాచారం చేశాడు. ఇప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.50,000 జరిమానా విధించింది. ఈ సంఘటన మూడున్నరేళ్ల క్రితం డిసెంబర్ 2020లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిందితుడు సాహిరామ్ మైనర్ బాలిక ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే నగ్నంగా స్నానం చేస్తున్న ఫొటోలు, వీడియోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. ఈ భయంతో బాలిక మౌనంగా ఉండడంతో నిందితుడు పలుమార్లు అత్యాచారం చేశాడు.
READ MORE: Jani Master Wife: నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు.. అంతా కుట్ర!
Also Read
- Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
ఈ కేసు జుంజునులోని గుధగౌడ్జి పోలీస్ స్టేషన్లో నమోదైంది. నిందితుడు సహిరామ్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై పోక్సో చట్టం, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓంప్రకాష్ సైనీ వివరణ ప్రకారం.. కుటుంబ సభ్యులు పెళ్లికి వెళ్లగా.. నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి 17 ఏళ్ల బాలికను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత నేను స్నానం చేస్తున్న ఫొటోలు, వీడియోలు తీశానని నిందితుడు బాలికతో చెప్పాడు. అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే.. ఈ వీడియోలను వైరల్ చేస్తానని బాలికను బెదిరించాడు. పలు మార్లు బాలికపై అత్యాచారం చేశాడు. ఈ మేరకుగుధగౌడ్జి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసునమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది.
READ MORE:Monkeypox Case: భారత్లో మరో మంకీపాక్స్ కేసు.. ఒకే రాష్ట్రంలో రెండు కేసులు
బాధితురాలి తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓంప్రకాష్ సైనీ హాజరయ్యారు. ప్రాసిక్యూటర్ 11 మంది సాక్షుల వాంగ్మూలాలు, 47 పత్రాలను కోర్టులో సమర్పించారు. సుమారు మూడు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు సాగిన విచారణ తర్వాత, పోక్సో కోర్టు నిందితుడు సహిరామ్కు పోక్సో చట్టం కింద 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 50,000 జరిమానా విధించింది. దీంతో పాటు ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 20 వేల జరిమానాతో పాటు ఏడాది జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా కూడా విధించారు.
తాజావార్తలు
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!