Rajasthan: హిందూవుల ఊరేగింపుపై రాళ్ల దాడి.. తీవ్ర ఉద్రిక్తత!
- హిందూవుల ఊరేగింపుపై రాళ్ల దాడి
- రాజస్థాన్లోని షాపురా జిల్లా జహాజ్పూర్ సబ్డివిజన్ హెడ్క్వార్టర్స్లో ఘటన
- భారీగా పోలీసుల మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం రాజస్థాన్లోని షాపురా జిల్లా జహాజ్పూర్ సబ్డివిజన్ హెడ్క్వార్టర్స్లో జల్ఝులనీ ఏకాదశి సందర్భంగా పీతాంబర్ రాయ్ మహారాజ్ (బేవాన్) ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తత నెలకొంది. రాళ్లదాడిలో ఓ మహిళతో పాటు పలువురు యువకులు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం ఊరేగింపులో పాల్గొన్న ప్రజలు రాళ్లురువ్విన వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న జహజ్పూర్కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గోపీచంద్ మీనా.. సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాళ్లదాడి చేసిన నిందితులను గుర్తించి అరెస్టు చేసే వరకు ధర్నా కొనసాగిస్తానన్నారు. ఈ ఘటనతో జహజ్పూర్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని మార్కెట్లు మూతపడ్డాయి. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.
READ MORE: Breaking News: కోల్కతా అత్యాచారం కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపాల్, పోలీస్ అధికారి అరెస్ట్
Also Read
- Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
- Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం… జహజ్పూర్ పట్టణంలోని కోటతో సహా అన్ని దేవాలయాల దేవతల విగ్రహాలను ఏకాదశి రోజున భన్వర్ కాలా చెరువులో స్నానానికి తీసుకువెళ్లారు. అర్ధరాత్రికి వారి వారి ఆలయాలకు తిరిగి వస్తున్నారు. అదే క్రమంలో.. కోట నుంచి లార్డ్ పీతాంబర్ రాయ్ మహారాజ్ మతపరమైన ఊరేగింపు.. మరో మతపరమైన స్థలం గుండా వెళ్తోంది. ఈ సందర్భంలో హిందుమతేతరులు ఈ ఊరేగింపుపై రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజిత్ సింగ్ మేఘవంశీ, పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రామ్ బనాతో సహా భారీ పోలీసు బలగాలను సంఘటనా స్థలంలో మోహరించారు. అలాగే, అజ్మీర్ రేంజ్ డిఐజి ఓం ప్రకాష్ మాట్లాడుతూ.. షాపురా నుంచి పోలీసు సూపరింటెండెంట్ పోలీసు బలగాలతో జహజ్పూర్ చేరుకుంటున్నారని చెప్పారు. పరిస్థితి అదుపులోనే ఉందని, నిందితుల ఆచూకీ కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయన్నారు.
తాజావార్తలు
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
-
TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!