Bride flee: “కొనుక్కున్న” నవ వధువు.. అత్తమామలకు మత్తుమందు ఇచ్చి పారిపోయింది..
- అత్తామామలకు మత్తు మందిచ్చి పారిపోయిన నవ వధువు..
- ‘‘నాట-ప్రథ’’ పద్ధతిలో వధువు కొనుగోలు..
- పెళ్లయిన నెల లోపే బైకుతో ఉడాయింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bride flee: కొనుకున్న కొత్త కోడలు అత్తామామలకు మత్తు మందు కలిపి ఇచ్చి పరారైంది. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది. బుండీ జిల్లాలో ఓ నవ వధువుల తన అత్తామామలకు ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చి, వారు మత్తులోకి జారుకున్న తర్వాత ఇంటి నుంచి పారిపోయిందని పోలీసులు శుక్రవారం తెలిపారు. మంజూబాయి(24)అనే యువతి అత్తమామలతో పాటు ఆరేళ్ల చిన్నారి అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత బైక్ తీసుకుని పారిపోయింది. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని బంధువులు గుర్తించి ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారు.
Read Also: Duleep Trophy: సన్ గ్లాసెస్ ధరించి బ్యాటింగ్.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
దుర్గా శంకర్ గుర్జర్(24) అనే వ్యక్తి ఆగస్టు 23న మంజుబాయిని ‘‘నాట-ప్రథ’’ పద్ధతిలో వివాహం చేసుకున్నాడని డబ్లానా ఏఎస్ఐ మహేంద్ర యాదవ్ తెలిపారు. నాట-ప్రథ అనేది రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ పరిసర ప్రాంతాల్లోని కొన్ని కమ్యూనిటీల్లో అమ్మాయిలను స్టాంప్ పేపర్పై కొనుక్కోవడం లేదా వివాహం పేరుతో అమ్మకం చేసే పద్దతి. ఇంటి ముందు పార్క్ చేసిన బైకులో ఆమె పారిపోయిందని, ఇంట్లో నుంచి నగలు, నగదు తీసుకెళ్లిందా..? అనేదానిపై స్పష్టత లేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నామని, మంజూబాయి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!