తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటన ముగిసింది. ఈ నేపథ్యంలో.. మాజీ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎన్టీవీ ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రెండు రోజుల రాహుల్ టూర్ తెలంగాణ కాంగ్రెస్లో కొత్త జోష్ నింపిందని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబం మీద మాట్లాడే అంతా గొప్పొడా కేటీఆర్ అంటూ మండిపడ్డారు ఉత్తమ్.. పని చేసే వారికే ఈ సారి అదిష్టానం టికెట్లను…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ థీమ్ ఒక్కటే.. దేశ సంపదను దోచుకోవడం అంటూ ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండగా 12 లక్షల కోట్లను లూటీ చేశారని, రాహుల్ గాంధీ పొలిటికల్ టూరిస్ట్ అంటూ మండిపడ్డారు. దేశ సంపదను దోచిన పార్టీ ఇంకా ఖతమవ్వలేదు.. ఆ పార్టీ ఇంకా కొనసాగుతోందని, రైతుల కష్టాలపై ఎలాంటి చింత…
తెలంగాణ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అట్టహాసంగా నిర్వహించిన రైతు సంఘర్షణలో సభలో తాము ఏ ఒక్కరితోనూ పొత్తు పెట్టుకోమని రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే! ఈ విషయంపై వరంగల్ పర్యటనలో ఉన్న కేటీఆర్ స్పందించారు. అసలు కాలం చెల్లిన కాంగ్రెస్తో ఎవరు పొత్తు పెట్టుకోవాలని అనుకుంటారంటూ ఛలోక్తులు పేల్చారు. దేశంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే వారు ఎవరూ లేదరని, అసలు ఆ పార్టీతో పొత్తు కావాలని ఎవరైనా అడిగారా? అంటూ సెటైర్ వేశారు.…
తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఏ పదవిలో తెలంగాణకు వచ్చారో నాకు తెలియదన్నారు. తెలంగాణలో రిమోట్ జరగడం లేదని.. మీ కాంగ్రెస్ది రిమోట్ పాలన అని కేటీఆర్ మండిపడ్డారు. మీరు చెప్పినవన్నీ నమ్మేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా లేరని, ఇక్కడి…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీ.. శనివారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ నేతలెవరూ హైదరాబాద్లో ఉండొద్దని, ఢిల్లీకి అసలే రావొద్దని చెప్పిన ఆయన.. ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు. వరంగల్ డిక్లరేషన్ గురించి రాష్ట్రంలోని ప్రజలకు వివరించాలని, ప్రతి ఒక్కరూ ప్రజల మధ్యే తిరగాలని సూచించారు. కేవలం ప్రెస్మీట్లు పెట్టి మాటలతో సరిపెట్టుకుండా.. నేతలందరూ…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు తెలంగాణ పర్యటనలో భాగంగా రెండో రోజు హైదరాబాద్లోని గాంధీభవన్లో సభ్యత్వ సమన్వయ కర్తలతో రాహుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్కు ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేసిన రాహుల్.. కేసీఆర్ వద్ద ధనం, అధికార బలం, పోలీసులు ఉన్నారు, కానీ జన బలం లేదని విమర్శించారు. ప్రజల…
నిన్న అట్టహాసంగా వరంగల్లో కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభపై టీఆర్ఎస్ మంత్రలు వరుస పంచ్లు వేస్తున్నారు. తాజాగా ట్విటర్ మాధ్యమంగా మంత్రి హరీశ్ రావు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ‘‘రాహుల్ గాంధీగారూ, వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నింది. పంజాబ్ రైతులు నమ్మని మీ రైతు డిక్లరేషన్ – చైతన్యవంతులైన తెలంగాణ రైతులు నమ్ముతారా? ఇది రాహుల్ సంఘర్షణ సభ – రైతు సంఘర్షణ సభ కాదని తెలంగాణ ప్రజానీకం…
రాహుల్ గాంధీ.. తెలంగాణ టూర్ పై బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ స్పందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చెయ్యని పనులు ఇప్పుడు చేస్తామంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని అన్నారు. కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు.. రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైందని సెటైర్ వేశారు. అధికారం ఉన్నచోట కోల్పోతున్న కాంగ్రెస్, ప్రజలను మభ్య పెడుతోందని డా.లక్ష్మణ్ పేర్కొన్నారు. డబుల్ ఇంజన్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని పప్పు అంటూ ఎద్దేవా చేశారు తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి. శనివారం మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండల పరిధిలోని ఉద్ధమర్రి, కేషవరం గ్రామాల్లో ధాన్యంకొనుగోలు కేంద్రాన్నిమంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. రైతు పండించిన ప్రతి గింజ కూడా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. Read Also: Alluri Sitarama Raju: ఏడాది పాటు అల్లూరి జయంతి ఉత్సవాలు.. రైతు సంఘర్షణ్ అంటూ వచ్చిన పప్పు రాహుల్ ముందు…
రాహుల్ గాంధీ పర్యటనతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. వరంగల్ సభతో రాహుల్ గాంధీ అద్భుతంగా ప్రసంగించారని.. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. ఐతే రాహుల్ పర్యటన నేపథ్యంలో ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిన్న వరంగల్ సభ సందర్భంగా.. రాహుల్ గాంధీ చేతికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క కాశీ తాడును కట్టారు. ఆ సమయలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చేతిని పట్టుకోగా..…