తెలంగాణ రాజకీయాలు హీట్ మీద ఉన్నాయి. ఎన్నికలకు గడువు చాలా ఉన్నా.. పార్టీలు మాత్రం ఎవరి వ్యూహానికి వాళ్లు పదును పెడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు ఒక స్ట్రాటజీని అందజేశారట పార్టీ వ్యూహకర్త సునీల్. ఆ వ్యూహంలో భాగంగా పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్లు రహస్యంగా భేటీ అయ్యారట. ఈ సమావేశం గురించి అటు కాంగ్రెస్ నాయకులకు.. ఇటు TJS ప్రతినిధులకు కూడా తెలియదట. దాంతో రేవంత్, ప్రొఫెసర్ ఇద్దరూ ఎందుకు రహస్యంగా…
జగ్గారెడ్డి అరెస్ట్పై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. అరెస్టైన వారిని పరామర్శించడానికి పోతే.. అరెస్టులు చేస్తారా అంటూ.. కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ టీపీసీసీ ప్రెసిడెండ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ కి రాహుల్ గాంధీ తప్పకుండా వెళ్తారని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమంలో విద్యార్ధుల పాత్ర కీలకమని, ఉస్మానియా యూనివర్సిటీ కేసీఆర్ నా జాగీరు అనుకుంటున్నారని ఆయన అగ్రహం వ్యక్తం…
ఓయూ ముట్టడి ఘటనలో అరెస్టైన ఎన్ఎస్యూఐ విద్యార్థులను పరామర్శిచేందుకు వెళ్లిన జగ్గారెడ్డిని సైతం పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. జగ్గారెడ్డిని కలిసేందుకు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఈ నేపథ్యంలో గీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ యూనివ్సిటీకి వస్తే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ నీ సీఎం చేసిందే విద్యార్దులు అని, విద్యార్ధుల దగ్గరకు…
ఓయూలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ను ముట్టడించేందుకు వెళ్లిన ఎన్ఎస్యూఐ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే అరెస్టైన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో జగ్గారెడ్డి అరెస్ట్పై జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ స్పందించారు. ప్రశ్నించే గొంతుకలు విశ్వవిద్యాలయాలని ఆయన అన్నారు. ఓయూ కు రాహుల్ వచ్చేలా అనుమతి ఇవ్వాలని విద్యార్థులు నిరసన తెలపడానికి వెళ్లితే వారిని అరెస్ట్ చేసి పోలీస్…
ఉస్మానియూ యూనివర్సీటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ను ఎన్ఎస్యూఐ విద్యార్థులు ముట్టడించారు. ఏఐసీసీ నేత రాహుల్గాంధీ సభకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ.. బిల్డింగ్ గేట్లు ఎక్కి లోపలికి విద్యార్థులు దూసుకెళ్లారు. అంతేకాకుండా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అద్దాలను విద్యార్థులు ధ్వంసం చేశారు. దీంతో 17 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా పోలీసుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ.. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ సహా విద్యార్థులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. వారిని రిమాండ్కు…
నేను అప్పుడు ఇప్పుడు సమైక్యవాదినే అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కేసీఆర్ని బట్టలు ఇప్పి కొడుతానన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మీ టీఆర్ఎస్ ప్రభుత్వ క్యాబినెట్ లో మంత్రే కదా.. ఉద్యమంలో కేసీఆర్ ఊరికించి కొడుతానన్న ఎర్రబెల్లి దయాకర రావు ఇప్పుడు మీ ప్రభుత్వ క్యాబినెట్ లొనే ఉన్నాడు కదా.. మంత్రి పువ్వడా అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు నికర్సైనా స్వమైక్యవాదులే కదా.. ఉద్యమ సమయంలో టీఆరెస్…
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరాలో 69.52 కొట్ల వ్యయంతో నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్దాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీది ఐరన్ లెగ్.. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం అవుతుందని ఆయన విమర్శలు గుప్పించారు. 96 శాతం ఓటమిలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, స్థానికంగా సఖ్యత లేని కాంగ్రెస్లో రాహుల్ గాంధీ వచ్చి ఏంచేస్తాడని ఆయన ప్రశ్నించారు…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్గొండలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, సాయుధ పోరాట పటిమ గల నాయకత్వం ఈ జిల్లాలో ఉందన్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ కాంగ్రెస్ కట్టామని సగర్వంగా చెప్పుకుంటామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పూర్తయ్యాయన్నారు. మేము మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేని దద్దమ్మలు మీరు.. అని ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నెల్లికల్లు లిఫ్ట్…
రాష్ట్రంలో రాహుల్గాంధీ పర్యటన తర్వాత.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో కీలక మార్పులకు PCC కార్యాచరణ సిద్ధం చేస్తుందని టాక్. అందులో ముఖ్యమైంది జిల్లాలకు కొత్త కాంగ్రెస్ సారథుల నియామకం. పార్టీలో సీనియర్ నేతలు.. మాజీ ఎమ్మెల్యేలను డీసీసీలుగా చేస్తారని చర్చ జరుగుతోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకంలో ఇదే చేసింది. ఆ ఫార్ములానే కాంగ్రెస్ కూడా ఫాలో అవుతుందనేది టాక్. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ విప్…
మరోసారి టీఆర్ఎస్ నేతలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ విమర్శలు గుప్పించారు. వచ్చే నెలలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వరంగల్లో పర్యటన, సభ సందర్భంగా కాంగ్రెస్ నేతల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మధు యాష్కీ మాట్లాడుతూ.. అగం అవుతున్న తెలంగాణను ఆదుకోవడం కోసమే రాహుల్ సభ అని ఆయన వెల్లడించారు. కేసీఆర్ ఏ వర్గంని మోసం చేశారో.. ఆ వర్గాలను ఏకం చేస్తామన్నారు. ఈ టీఆర్ఎస్ హౌలే…