మహారాష్ట్రలో తీవ్ర సంచలనం సృష్టించిన బీజేపీ ఎమ్మెల్సీ యోగేష్ తిలేకర్ మామ సతీష్ వాఘ్ హత్య కేసు మిస్టరీ వీడింది. డిసెంబర్ 9న మర్డర్కు గురైన సతీష్ వాఘ్ కేసును పోలీసులు సీరియస్గా తీసుకుని ఛేదించారు.
Today Gold and Silver Rates: గత కొద్దీ కాలంగా పెరుగుతూ షాకిచ్చిన బంగారం ధరలు వరుసగా రెండు రోజులు భారీగా తగ్గి ఆ తర్వాత రెండు రోజులు స్థిరంగా కొనసాగింది. అయితే , నేడు (మంగళవారం) దేశ వ్యాప్తంగా స్వల్ప పెరుగుదల కనిపించింది. నేడు హైదరాబాద్ మార్కెట్లో సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,000గా ఉంది. తాజాగా బంగారం ధరలలో ఒక తులం పై…
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పూణె పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో రూ.138 కోట్ల విలువైన బంగారాన్ని గుర్తించారు. టెంపోలో ఈ బంగారం దొరికింది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున జిల్లాల సరిహద్దుల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఉరిశిక్ష పడిన వ్యక్తిని 12 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన అనంతరం సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతను తన భార్య, తల్లి, రెండేళ్ల బాలికను హత్య చేశాడని ఆరోపించారు.
ఆపిల్ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పింది. ప్రపంచ దిగ్గజ సంస్థ భారత్లో తన సేవలను విస్తరించేందుకు యోచిస్తోంది. ఇందులో భాగంగా భారతదేశంలో మరో నాలుగు కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని ఆపిల్ యోచిస్తోందని తెలుస్తోంది. బెంగుళూరు, పూణె, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలో నాలుగు కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని ఆపిల్ ఆలోచన చేస్తోంది.
ప్రధాని మోడీ భక్తుడు, బీజేపీ వీర విధేయుడు మయూర్ ముండే మనస్తాపం చెందాడు. మోడీపై ఉన్న అభిమానంతో రూ.1.5లక్షలు వెచ్చించి ఆలయాన్ని నిర్మించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే స్థానిక బీజేపీ నేతల తీరుతో ఇబ్బంది పడుతున్నట్లు వాపోయాడు. దీంతో మయూర్ ముండే కమలం పార్టీకి గుడ్బై చెప్పాడు.
మహారాష్ట్రలోని పుణె జిల్లాలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటన పైలట్, ఇద్దరు ఇంజనీర్లు మృతి చెందారు. పుణె జిల్లాలో బుధవారం ఉదయం హెలికాప్టర్ కూలిపోయి మంటలు చెలరేగడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు వెల్లడింటారు.
మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్కు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. అరెస్ట్ నుంచి ఆమెకు రక్షణను అక్టోబర్ 4 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఐఏఎస్ ఉద్యోగం సంపాదించేందుకు ఆమె అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో ఆమెపై యూపీఎస్సీ వేటు వేసింది.
మహారాష్ట్రలోని పూణెలో వింతైన సంఘటన చోటుచేసుకుంది. పూణె నగరంలోని బుద్వార్ పేత్ ప్రాంతంలోని సిటీ పోస్టాఫీసు ఆవరణలో ఒక డ్రైనేజీ ట్యాంకర్ ఉంది. ట్రక్కు పూణె మునిసిపల్ కార్పొరేషన్కి చెందినది. డ్రైనేజీ క్లీనింగ్ పని కోసం అక్కడ ఆగి ఉంది.
Quarrel with wife: తన భార్యతో గొడవ పడిన 45 ఏళ్ల వ్యక్తి పూణేలోని పవన నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, అనూహ్యంగా అతను 8 గంటల తర్వాత ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. పోలీసులు, అగ్నిమాపక దళాలు గంటల పాటు రెస్య్కూ ఆపరేషన్ నిర్వహించిన అతడి ఆచూకీ లభించలేదు, చివరకు నదిలోని పొదలల్లో వేలాడుతున్న స్థితిలో కనిపించాడు.