Supreme Court: తల్లి, భార్య, కుమార్తెను హత్య చేసిన నిందితుడు.. 12 ఏళ్ల శిక్ష తర్వాత నిర్దోషిగా ప్రకటన?
- తల్లి.. భార్య.. కుమార్తెను హత్య చేసిన నిందితుడు
- 12 ఏళ్ల శిక్ష తర్వాత నిర్దోషిగా ప్రకటించిన సుప్రీంకోర్టు
- అనుమానం బలంగా ఉన్నా సాక్ష్యం కావాలన్న కోర్టు
- బాంబే హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉరిశిక్ష పడిన వ్యక్తిని 12 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన అనంతరం సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతను తన భార్య, తల్లి, రెండేళ్ల బాలికను హత్య చేశాడని ఆరోపించారు. 12 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. ఈ 12 సంవత్సరాలలో.. అతను 8 సంవత్సరాలు కఠిన కారాగారశిక్షను ఎదుర్కొన్నాడు. 2012లో పూణేలో జరిగిన ఈ ట్రిపుల్ మర్డర్ కేసులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో సుప్రీంకోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదలకు ఆదేశించింది. అతని నేరాన్ని రుజువు చేయడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవని కోర్టు నిర్ధారించింది.
సుప్రీంకోర్టు సంచలన తీర్పు…
న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, ప్రశాంత్ కుమార్ మిశ్రా, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం దిగువ కోర్టు, బాంబే హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది. గతంతో ఆ కోర్టు నిందితుడికి మరణ శిక్ష విధించింది. కానీ సాక్ష్యాధారాలను పరిశీలించిన అత్యున్నతన్యాయస్థానం అతడిని దోషిగా నిర్ధారించడానికి ఈ ఆధారాలు సరిపోవని తేల్చింది. కేవలం అనుమానాల ఆధారంగా ఎవరినీ దోషులుగా తేల్చలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
Also Read
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
- Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
తీర్పులో కోర్టు ఏం చెప్పింది?
అనుమానం ఎంత బలంగా ఉన్నా సాక్ష్యం స్థానంలో ఉండకూడదనేది స్థిరమైన చట్టమని జస్టిస్ గవాయ్ తీర్పులో పేర్కొన్నారు. ఒక నిందితుడు దోషిగా రుజువైయ్యే వరకు అతడు నిర్దోషిగానే పరిగణించబడతాడని స్పష్టం చేశారు. పొరుగువారి వాంగ్మూలం ఆధారంగా ట్రయల్ కోర్టు, బాంబే హైకోర్టు అతన్ని దోషిగా నిర్ధారించాయి. అయితే, ఈ ప్రకటన చాలా వైరుధ్యాలతో కూడుకున్నదని, సందర్భోచిత సాక్ష్యాలు కూడా అతనికి వ్యతిరేకంగా ఎటువంటి ఖచ్చితమైన నిర్ధారణకు రాలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
ప్రాథమిక సూత్రాన్ని గుర్తు చేసిన న్యాయమూర్తి..
న్యాయమూర్తి గవాయ్ మాట్లాడుతూ.. “ప్రాసిక్యూషన్ నేరాన్ని అంచనా వేయడానికి అన్ని పరిస్థితులను పూర్తిగా నిర్ధారించడం అవసరం. నిందితుడిని దోషిగా నిర్ధారించే ముందు అతడు దోషి అని రుజువు చేసుకోవాలన్నది ప్రాథమిక సూత్రం. ” అని పేర్కొన్నారు. ‘నిరూపించబడవచ్చు’ మరియు ‘తప్పక నిరూపించబడాలి’ అనే వాటి మధ్య వ్యాకరణం మాత్రమే కాదు.. చట్టబద్ధమైన తేడా కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
- ఈ నిర్ణయంతో ఇతర కేసులు కూడా ప్రభావితం..
న్యాయ ప్రక్రియలో సాక్ష్యం ఎంత ముఖ్యమైనదో ఈ కేసు తెలియజేస్తుంది. కేవలం అనుమానాల ఆధారంగా ఎవరినీ శిక్షించలేమని సుప్రీంకోర్టు తన నిర్ణయం ద్వారా స్పష్టం చేసింది. ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లేకుండా జైల్లో ఉన్న వారందరికీ ఈ నిర్ణయం ఆశాకిరణం.
తాజావార్తలు
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!