Hyderabad: ఆన్లైన్ గేమ్లో బాలికను ట్రాప్.. ఆపై అత్యాచారం
- ఆన్లైన్ గేమ్లో బాలికను ట్రాప్ చేసిన యువకుడు
- ప్రేమ పేరుతో బాలికను నమ్మించి పూణె యువకుడు మోసం
- స్నాప్చాట్లో న్యూడ్ ఫొటోలు, వీడియోలు పంపిన బాలిక
- బాలికను బ్లాక్మెయిల్ చేసిన యువకుడు ఖష్దేవ్.
పిల్లలు, యువత ఫోన్లు పట్టారంటే ఆన్లైన్లో గేమ్స్ ఆడటం ఎక్కువైపోయింది. ఆన్లైన్లో గేమ్స్కు బాగా అలవాటు పడిన యువత.. ఆ ఆటలకు సంబంధించి ఆన్లైన్లో తెలియని వేరే వారితో పరిచయం చేసుకుని గేమ్స్ ఆడుతున్నారు. అయితే.. ఇలా ఆన్లైన్లో గేమ్స్ ఆడుతున్న ఓ బాలిక పాలిట శాపంగా మారింది. ఆన్లైన్లో గేమ్స్ ద్వారా పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి మాయమాటలతో మోసపోయింది. ఆ బాలికను లొంగదీసుకుని ఆన్లైన్లో చాటింగ్లో స్వీట్ మెస్సేజ్లతో ఆమెను ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా.. ఆమె ఫోటోలను తనకు షేర్ చేయాలని కోరాడు. దీంతో ఆ బాలిక తన ఫోటోలను ఆ వ్యక్తికి పంపించింది. ఆమె పంపించిన స్నాప్చాట్లో న్యూడ్ ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. దీంతో.. తల్లిదండ్రులతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బాలికను బ్లాక్మెయిల్ చేశాడు యువకుడు ఖష్దేవ్. దీంతో.. అతను పూణే నుంచి హైదరాబాద్ వచ్చి తన వాంఛను తీర్చుకుని వెళ్లేవాడు.
TGSRTC : ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని షేక్పేట్ ప్రాంతానికి చెందిన బాలిక.. 2021లో ఏడో తరగతి చదివే సమయంలో ప్రతిరోజూ సాయంత్రం ఆన్లైన్ గేమ్ ఆడుతుండేది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. మొదట్లో స్నేహితుల్లా ఉండేవారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా చాట్ చేసుకున్న వారిద్దరూ.. చాట్ చేసే క్రమంలో బాలిక ఫోటోలు షేర్ చేయాల్సిందిగా యువకుడు కోరాడు. దీంతో.. బాలిక నిరాకరించింది. ఆ తర్వాత యువకుడు బాలికను బలవంతం చేయడంతో తన ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. వాటిల్లో కొన్ని న్యూడ్ ఫోటోలు ఉన్నాయి.
Karnataka : తమ్ముడిని చంపి తప్పించుకుందాం అనుకున్నాడు.. కుంభమేళాక పోయివచ్చి దొరికిపోయాడు
దీంతో.. అప్పటి నుంచి ఆ ఫొటోలను ఆమె తల్లిదండ్రులు, బంధువులకు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు యువకుడు. తనను కలవాలని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో గత ఏడాది అక్టోబర్ 6న టోలిచౌకీలోని ఓ పార్కులో కలిసింది. అప్పటి నుంచి ప్రతిరోజూ తనను కలవాల్సిందిగా డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 24న బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా, యువకుడు ఖుష్డేవ్ అక్కడికి వచ్చి నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో కలుసుకున్నారు. అంతటితో ఆగకుండా.. మరుసటి రోజు అర్ధరాత్రి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఈ విషయం బాలిక తన తల్లిదండ్రులకు చెప్పేందుకు భయపడింది. ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది.. దీంతో ఆమె టీచర్ దృష్టికి తీసుకెళ్లింది. టీచర్ ద్వారా ప్రిన్సిపాల్కు, ఆమె ద్వారా తల్లిదండ్రులకు విషయం తెలియడంతో.. ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు నిందితుడు ఖుష్డేవ్పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
-
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!