Satish Wagh: వీడిన బీజేపీ ఎమ్మెల్సీ యోగేష్ మామ సతీష్ హత్య మిస్టరీ.. చంపించింది ఎవరంటే..!
- వీడిన బీజేపీ ఎమ్మెల్సీ యోగేష్ మామ సతీష్ హత్య మిస్టరీ
- మహారాష్ట్రలో తీవ్ర సంచలనం సృష్టించిన కేసు
- నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో తీవ్ర సంచలనం సృష్టించిన బీజేపీ ఎమ్మెల్సీ యోగేష్ తిలేకర్ మామ సతీష్ వాఘ్ హత్య కేసు మిస్టరీ వీడింది. డిసెంబర్ 9న మర్డర్కు గురైన సతీష్ వాఘ్ కేసును పోలీసులు సీరియస్గా తీసుకుని ఛేదించారు. విచారణలో సంచలన విషయాలను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. కలకాలం తోడుండాల్సిన అర్ధాంగే ఈ హత్యకు సూత్రధారి, పాత్రధారి అని పోలీసులు తేల్చి చెప్పారు. ప్రియుడితో సుఖానికి అడ్డొస్తున్నాడని.. మరణశాసనం రాసి.. అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీసింది దుర్మార్గురాలైన భార్య. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
సతీష్ వాఘ్(55).. మోహిని వాఘ్ (48) భార్యాభర్తలు. అయితే సతీష్ వాఘ్ ఇంట్లో అక్షయ్ జవాల్కర్ ( 29) అనే యువకుడు అద్దెకు ఉండేవాడు. ఆ సమయంలో అక్షయ్ జవాల్కర్తో మోహిని వాఘ్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. గుట్టుచప్పుడు కాకుండా ప్రియుడితో జల్సాలు చేస్తోంది. అయితే ఒకరోజు అక్షయ్ జవాల్కర్-మోహిని వాఘ్ బాగోతం.. సతీష్ వాఘ్ కంటిలో పడి మందలించాడు. అంతేకాకుండా మోహిని వాఘ్ను కొట్టడం కూడా చేశాడు. అయినా కూడా ఆమెలో ఏ మాత్రం మార్పు రాలేదు. అక్షయ్ జవాల్కర్.. వేరే ఇంటికి మారిపోయినా కూడా అతడితో మోహిని వాఘ్ శారీరక సంబంధం కొనసాగిస్తూనే ఉంది. నిత్యం ప్రియుడితో ఫోన్లో టచ్లోనే ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా సతీష్ వాఘ్ తీవ్రంగా హెచ్చరించాడు. దీంతో ప్రియుడితో తన సుఖానికి భర్త సతీష్ వాఘ్ అడ్డొస్తున్నాడని చంపేయాలని కుట్ర పన్నింది. అంతే తడువుగా ప్రియుడితో కలిసి కోటి రూపాయులకు కిరాయి హంతకులను పురమాయించింది. అడ్వాన్స్గా రూ.5 లక్షలు చెల్లించారు.
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
అయితే ఈ నెల 9న సతీష్ వాఘ్.. సాధారణంగా ఎప్పటిలాగానే వార్నింగ్ వాక్ వెళ్లారు. అయితే ఐదుగురు వ్యక్తులు అమాంతంగా దాడి చేసి కారులో తీసుకెళ్లిపోయారు. అనంతరం 72 సార్లు కత్తిపొడిచి చంపేశారు. పూణె-సోలాపూర్లోని షిందావనే ఘాట్లోని ఉరులి కంచన్ ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు.
ఇక రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. మోహిని వాఘ్ను తమదైన శైలిలో విచారించగా మిస్టరీ బయటకు వచ్చింది. ప్రధాన నిందితుడు అక్షయ్ జవాల్కర్ను అదుపులోకి తీసుకోగా.. మోహిని వాఘ్ చంపమంటేనే చంపినట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు. మోహిని వాఘ్, జవాల్కర్లతో పాటు పవన్ శ్యాంసుందర్ శర్మ (30), నవనాథ్ అర్జున్ గుర్సాలే (31), వికాస్ సీతారామ్ షిండే (28), అతిష్ జాదవ్లను పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. మొత్తానికి భార్య పన్నాగానికి భర్త బలైపోయాడు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
-
Blood Sugar Test Timing: తిన్న ఎంతసేపటి తర్వాత షుగర్ చెక్ చేయాలి? చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే!
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
ట్రెండింగ్
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!