Satish Wagh: వీడిన బీజేపీ ఎమ్మెల్సీ యోగేష్ మామ సతీష్ హత్య మిస్టరీ.. చంపించింది ఎవరంటే..!
- వీడిన బీజేపీ ఎమ్మెల్సీ యోగేష్ మామ సతీష్ హత్య మిస్టరీ
- మహారాష్ట్రలో తీవ్ర సంచలనం సృష్టించిన కేసు
- నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు
మహారాష్ట్రలో తీవ్ర సంచలనం సృష్టించిన బీజేపీ ఎమ్మెల్సీ యోగేష్ తిలేకర్ మామ సతీష్ వాఘ్ హత్య కేసు మిస్టరీ వీడింది. డిసెంబర్ 9న మర్డర్కు గురైన సతీష్ వాఘ్ కేసును పోలీసులు సీరియస్గా తీసుకుని ఛేదించారు. విచారణలో సంచలన విషయాలను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. కలకాలం తోడుండాల్సిన అర్ధాంగే ఈ హత్యకు సూత్రధారి, పాత్రధారి అని పోలీసులు తేల్చి చెప్పారు. ప్రియుడితో సుఖానికి అడ్డొస్తున్నాడని.. మరణశాసనం రాసి.. అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీసింది దుర్మార్గురాలైన భార్య. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
సతీష్ వాఘ్(55).. మోహిని వాఘ్ (48) భార్యాభర్తలు. అయితే సతీష్ వాఘ్ ఇంట్లో అక్షయ్ జవాల్కర్ ( 29) అనే యువకుడు అద్దెకు ఉండేవాడు. ఆ సమయంలో అక్షయ్ జవాల్కర్తో మోహిని వాఘ్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. గుట్టుచప్పుడు కాకుండా ప్రియుడితో జల్సాలు చేస్తోంది. అయితే ఒకరోజు అక్షయ్ జవాల్కర్-మోహిని వాఘ్ బాగోతం.. సతీష్ వాఘ్ కంటిలో పడి మందలించాడు. అంతేకాకుండా మోహిని వాఘ్ను కొట్టడం కూడా చేశాడు. అయినా కూడా ఆమెలో ఏ మాత్రం మార్పు రాలేదు. అక్షయ్ జవాల్కర్.. వేరే ఇంటికి మారిపోయినా కూడా అతడితో మోహిని వాఘ్ శారీరక సంబంధం కొనసాగిస్తూనే ఉంది. నిత్యం ప్రియుడితో ఫోన్లో టచ్లోనే ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా సతీష్ వాఘ్ తీవ్రంగా హెచ్చరించాడు. దీంతో ప్రియుడితో తన సుఖానికి భర్త సతీష్ వాఘ్ అడ్డొస్తున్నాడని చంపేయాలని కుట్ర పన్నింది. అంతే తడువుగా ప్రియుడితో కలిసి కోటి రూపాయులకు కిరాయి హంతకులను పురమాయించింది. అడ్వాన్స్గా రూ.5 లక్షలు చెల్లించారు.
Also Read
- Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
అయితే ఈ నెల 9న సతీష్ వాఘ్.. సాధారణంగా ఎప్పటిలాగానే వార్నింగ్ వాక్ వెళ్లారు. అయితే ఐదుగురు వ్యక్తులు అమాంతంగా దాడి చేసి కారులో తీసుకెళ్లిపోయారు. అనంతరం 72 సార్లు కత్తిపొడిచి చంపేశారు. పూణె-సోలాపూర్లోని షిందావనే ఘాట్లోని ఉరులి కంచన్ ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు.
ఇక రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. మోహిని వాఘ్ను తమదైన శైలిలో విచారించగా మిస్టరీ బయటకు వచ్చింది. ప్రధాన నిందితుడు అక్షయ్ జవాల్కర్ను అదుపులోకి తీసుకోగా.. మోహిని వాఘ్ చంపమంటేనే చంపినట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు. మోహిని వాఘ్, జవాల్కర్లతో పాటు పవన్ శ్యాంసుందర్ శర్మ (30), నవనాథ్ అర్జున్ గుర్సాలే (31), వికాస్ సీతారామ్ షిండే (28), అతిష్ జాదవ్లను పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించారు. మొత్తానికి భార్య పన్నాగానికి భర్త బలైపోయాడు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!