ట్రక్కు డ్రైవర్ కిడ్నాప్ కేసులో మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లిదండ్రులకు బెయిల్ లభించింది. గత నెలలో నవీ ముంబైలో కారును ట్రక్కు డ్రైవర్ ఢీకొట్టాడని కిడ్నాప్ తీసుకుని వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు తనిఖీలు చేయగా పూణెలోని పూజా ఖేద్కర్ నివాసంలో కారు దొరికింది.
మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కుటుంబం అదృశ్యమైంది. గత నాలుగు రోజులుగా ఆమె కుటుంబం కనిపించడం లేదు. మహారాష్ట్ర అంతటా పోలీసులు గాలిస్తున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు.
మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ ఫ్యామిలీని మళ్లీ కొత్త కేసులు వెంటాడుతున్నాయి. గతేడాదంతా పూజా ఖేద్కర్ను కేసులు వెంటాడాయి. ట్రైనింగ్ సమయంలో లేనిపోని గొంతెమ్మ కోర్కెలు కోరి పూజా ఖేద్కర్ ఇరాకటంలో పడింది.
కనుమ పండుగ రోజున మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఫిబ్రవరి 14 వరకు పూజా ఖేద్కర్ను అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్లు బీవీ నాగరత్న, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వానికి, యూపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది.
మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజ ఖేద్కర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. యూపీఎస్సీ మోసం కేసులో ఇటీవల బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. తాజాగా దీన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
వివాదాస్పద మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్కు సంబంధించిన వార్త మరోసారి హల్చల్ చేస్తోంది. ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. అహ్మద్నగర్లోని షెవ్గావ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్కు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. అరెస్ట్ నుంచి ఆమెకు రక్షణను అక్టోబర్ 4 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఐఏఎస్ ఉద్యోగం సంపాదించేందుకు ఆమె అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో ఆమెపై యూపీఎస్సీ వేటు వేసింది.
మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆమెపై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది. తాత్కాలికంగా ఆమె సర్వీస్ను నిలిపివేయడంతో పటు భవిష్యత్లో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా నిషేధించింది. తాజాగా కేంద్రం కూడా ఆమెపై యాక్షన్ తీసుకుంది. ఐఏఎస్ సర్వీస్ నుంచి డిశ్చార్జ్ చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ యూపీఎస్సీకి సమర్పించిన దివ్యాంగ సర్టిఫికేట్ నకిలీదేనని పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చిన స్టేటస్ రిపోర్టులో పేర్కొన్నారు. పూజా ఖేద్కర్ తన పేరును సర్టిఫికేట్లో మార్చుకుని మూడు వేర్వేరు పేర్లు ఉపయోగించి 12 సార్లు సివిల్స్ పరీక్షలు రాసినట్లుగా పోలీసులు తెలిపారు.