Puja Khedkar: ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం.. అరెస్ట్ నుంచి రక్షణ పొడిగింపు
- ఢిల్లీ హైకోర్టులో పూజా ఖేద్కర్కు ఉపశమనం
- అరెస్ట్ నుంచి రక్షణ పొడిగించిన న్యాయస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్కు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. అరెస్ట్ నుంచి ఆమెకు రక్షణను అక్టోబర్ 4 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఐఏఎస్ ఉద్యోగం సంపాదించేందుకు ఆమె అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో ఆమెపై యూపీఎస్సీ వేటు వేసింది. భవిష్యత్లో జరిగే ఏ పరీక్షలకు హాజరుకాకుండా నిషేధం విధించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా ఆమెను ఐఏఎస్ సర్వీస్ నుంచి డిశ్చార్జ్ చేసింది. అయితే ఆమె అక్రమాలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ధర్మాసనాన్ని కోరగా అంగీకరించింది. ఆ గడువు నేటితో ముగియడంతో.. గురువారం మరొకసారి జస్టిస్ చంద్ర ధారి సింగ్ పొడిగించారు. దీంతో ఆమెకు కోర్టులో ఉపశమనం లభించింది.
ఇది కూడా చదవండి: Godhra Train Burning Case: “గోద్రా రైలు దహనం”పై జనవరి 15న సుప్రీంకోర్టు విచారణ..
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
పూణె ట్రైనీ ఐఏఎస్గా ఉన్నప్పుడు లేనిపోని అధికారాలు కావాలంటూ గొంతెమ్మ కోర్కెలు కోరి కష్టాలు తెచ్చుకుంది. ఆమె తీరుపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దివ్యాంగురాలు కాకపోయినా.. దొంగ మెడికల్ సర్టిఫికెట్ సంపాదించి వికలాంగ కోటాలో జాబ్ సంపాదించింది. అంతేకాకుండా ఓబీసీ సర్టిఫికెట్ను కూడా ఆమె దుర్వినియోగం చేసినట్లు తేలడంతో వేటు పడింది. ఈ పరిణామాలతో ఆమె క్రిమినల్ కేసు ఎదుర్కొంటుంది. బెయిల్ ఇవ్వాలని కోరగా అక్టోబర్ 4కు న్యాయస్థానం వాయిదా వేసింది. పూజా ఖేద్కర్ పెద్ద కుట్రకు తెరలేపారని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. అయితే ఖేద్కర్ న్యాయవాది అభ్యర్థన మేరకు జస్టిస్ చంద్ర ధారి సింగ్.. ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను వాయిదా వేశారు. అక్టోబర్ 4కు వాయిదా వేసి మధ్యంతర ఉత్తర్వులు కొనసాగించాలని జస్టిస్ చంద్ర ధారి సింగ్ ఆదేశించారు.
ఇది కూడా చదవండి: AP CM Chandrababu: మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి మళ్లీ ప్రోత్సాహం
తాజావార్తలు
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!