Puja Khedkar: ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం.. అరెస్ట్ నుంచి రక్షణ పొడిగింపు
- ఢిల్లీ హైకోర్టులో పూజా ఖేద్కర్కు ఉపశమనం
- అరెస్ట్ నుంచి రక్షణ పొడిగించిన న్యాయస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్కు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. అరెస్ట్ నుంచి ఆమెకు రక్షణను అక్టోబర్ 4 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఐఏఎస్ ఉద్యోగం సంపాదించేందుకు ఆమె అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో ఆమెపై యూపీఎస్సీ వేటు వేసింది. భవిష్యత్లో జరిగే ఏ పరీక్షలకు హాజరుకాకుండా నిషేధం విధించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా ఆమెను ఐఏఎస్ సర్వీస్ నుంచి డిశ్చార్జ్ చేసింది. అయితే ఆమె అక్రమాలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ధర్మాసనాన్ని కోరగా అంగీకరించింది. ఆ గడువు నేటితో ముగియడంతో.. గురువారం మరొకసారి జస్టిస్ చంద్ర ధారి సింగ్ పొడిగించారు. దీంతో ఆమెకు కోర్టులో ఉపశమనం లభించింది.
ఇది కూడా చదవండి: Godhra Train Burning Case: “గోద్రా రైలు దహనం”పై జనవరి 15న సుప్రీంకోర్టు విచారణ..
Also Read
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
పూణె ట్రైనీ ఐఏఎస్గా ఉన్నప్పుడు లేనిపోని అధికారాలు కావాలంటూ గొంతెమ్మ కోర్కెలు కోరి కష్టాలు తెచ్చుకుంది. ఆమె తీరుపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దివ్యాంగురాలు కాకపోయినా.. దొంగ మెడికల్ సర్టిఫికెట్ సంపాదించి వికలాంగ కోటాలో జాబ్ సంపాదించింది. అంతేకాకుండా ఓబీసీ సర్టిఫికెట్ను కూడా ఆమె దుర్వినియోగం చేసినట్లు తేలడంతో వేటు పడింది. ఈ పరిణామాలతో ఆమె క్రిమినల్ కేసు ఎదుర్కొంటుంది. బెయిల్ ఇవ్వాలని కోరగా అక్టోబర్ 4కు న్యాయస్థానం వాయిదా వేసింది. పూజా ఖేద్కర్ పెద్ద కుట్రకు తెరలేపారని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. అయితే ఖేద్కర్ న్యాయవాది అభ్యర్థన మేరకు జస్టిస్ చంద్ర ధారి సింగ్.. ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను వాయిదా వేశారు. అక్టోబర్ 4కు వాయిదా వేసి మధ్యంతర ఉత్తర్వులు కొనసాగించాలని జస్టిస్ చంద్ర ధారి సింగ్ ఆదేశించారు.
ఇది కూడా చదవండి: AP CM Chandrababu: మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి మళ్లీ ప్రోత్సాహం
తాజావార్తలు
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!