Puja Khedkar: కనుమ రోజున పూజా ఖేద్కర్కు గుడ్న్యూస్.. అరెస్ట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- కనుమ రోజున పూజా ఖేద్కర్కు గుడ్న్యూస్
- అరెస్ట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కనుమ పండుగ రోజున మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఫిబ్రవరి 14 వరకు పూజా ఖేద్కర్ను అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్లు బీవీ నాగరత్న, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వానికి, యూపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Gautam Gambhir: టీమిండియా బౌలింగ్ కోచ్తో గౌతమ్ గంభీర్కు విభేదాలు?
Also Read
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
- Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
గతేడాది పూజా ఖేద్కర్ ఉద్యోగం పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ్న్నారు. పూణెలో ట్రైనీ ఐఏఎస్గా పని చేస్తున్నారు. ట్రైనీగా ఉన్నప్పుడు సౌకర్యాలు ఏమీ ఉండవు. కానీ ఆమె మాత్రం తన తండ్రితో కలిసి అధికారుల్ని బెదిరించి.. గొంతెమ్మ కోర్కెలు కోరింది. సకల మర్యాదలు, సౌకర్యాలు కల్పించాలంటూ సిబ్బందికి హుకుం జారీ చేసింది. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. అనంతరం పూణె నుంచి ట్రాన్స్పర్ అయింది. అప్పుడే ఆమె బండారం బయటపడింది. తప్పుడు పత్రాలు సృష్టించి ఉద్యోగాన్ని సంపాదించినట్లుగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో యూపీఎస్సీ విచారణ చేపట్టగా నిజమని తేలింది. దీంతో ఆమెపై ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Daaku Maharaaj : డాకు నిలువు దోపిడీ.. 3 రోజుల్లో ఎన్ని కోట్లు అంటే?
రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడానికి 2022 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ దరఖాస్తులో తప్పుడు సమాచారాన్ని నమోదు చేసినట్లుగా తేలింది. ఓబీసీ, దివ్యాంగుల కోటాను దుర్వినియోగం చేసినట్లుగా బయటపడింది. తప్పుడు పత్రాలతో ఉద్యోగం సంపాదించడంతో ఆమె సర్వీసును యూపీఎస్సీ రద్దు చేసింది. భవిష్యత్లో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా వేటు వేసింది. ఇక ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడంతో.. అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును పూజా ఖేద్కర్ ఆశ్రయించింది. కానీ కోర్టు మాత్రం చీవాట్లు పెట్టింది. దేశం మొత్తాన్ని మోసం చేశారంటూ న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసి బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. దీంతో ఆమె మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఫిబ్రవరి 14 వరకు అరెస్ట్ చేయొద్దంటూ ఢిల్లీ ప్రభుత్వానికి, యూపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Man Shoots Daughter: పెళ్లికి 4 రోజుల ముందు కూతురిని కాల్చి చంపిన తండ్రి.. కారణం ఏంటంటే..
తాజావార్తలు
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
-
Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!