Puja khedhkar: పూజా ఖేద్కర్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు
- పూజా ఖేద్కర్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు
- ముందస్తు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్ పూజా ఖేద్కర్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ను న్యాయస్థానం తిరస్కరించింది. శారీరక, మానసిక వైకల్యం ఉందంటూ తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి ఐఏఎస్ ఉద్యోగం సంపాదించినట్లు రుజువు కావడంతో యూపీఎస్పీ ఆమెపై వేటు వేసింది. ట్రైనీ ఐఏఎస్గా ఆమె ఎంపికను రద్దు చేయడంతో పాటు జీవితంలో మళ్లీ ఎలాంటి ప్రవేశ పరీక్షలు/యూపీఎస్సీ సెలెక్షన్స్లో పాల్గొనకుండా శాశ్వతంగా నిషేధం విధించింది. యూపీఎస్సీకి పూజా ఖేద్కర్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్టు రుజువు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Mohan Babu: మోహన్ బాబుకు హైకోర్టు షాక్
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
సోమవారం ముందస్తు బెయిల్పై ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె ఉద్దేశాలు, ప్రాథమికంగా అధికారులను మోసగించడమేనని కోర్టు పేర్కొంది. పెద్ద కుట్రలో భాగంగానే ఆమె విధంగా చేసిందని.. ఇది చాలా బలమైన కేసుగా ఉందని జస్టిస్ చంద్ర ధరి సింగ్ పేర్కొన్నారు. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పించలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ముందస్తు బెయిల్కు కూడా ఆమె అనర్హులని తెలిపింది. ఆమె దేశం మొత్తాన్ని మోసం చేసిందని కోర్టు అభిప్రాయపడింది. యూపీఎస్సీని మోసం చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేసినట్లుగా గుర్తించామని తెలిపింది. ముందస్తు బెయిల్పై గత నెలలో ఉత్తర్వులను రిజర్వ్ చేయగా.. తాజాగా సోమవారం ముందస్తు బెయిల్ను ధర్మాసనం నిరాకరించింది.
ఇది కూడా చదవండి: High Court: డెడ్ బాడీని రేప్ చేయడం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు
పూజా ఖేద్కర్… పూణెలో ఐఏఎస్ ట్రైనీగా విధులు నిర్వహిస్తుండగా హద్దు మీరి ప్రవర్తించారు. గొంతెమ్మ కోర్కెలు కోరి.. తన ఉద్యోగానికి ఎసరు తెచ్చుకుంది. వాస్తవంగా ట్రైనీగా ఎలాంటి సౌకర్యాలు ఉండవు. కానీ తనకు ప్రత్యేకమైన ఛాంబర్, టేబుల్, అలాగే కారు ఏర్పాటు చేయాలని అధికారులను డిమాండ్ చేసింది. వాళ్లపై తండ్రితో కలిసి తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఈ విషయం కాస్త ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఆమెను మరో చోటికి బదిలీ చేశారు. అంతలోనే ఆమె అసలు బాగోతం బయటపడింది. ఆమె తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించిందని.. అలాగే పేర్లు కూడా మార్చుకుందని ఆరోపణలు వచ్చాయి. దీంతో యూపీఎస్సీ విచారణ చేపట్టగా.. ఆమె అక్రమాలకు పాల్పడినట్లుగా తేలింది. ఆమె సమర్పించిన సర్టిఫికెట్లు దొంగ పత్రాలుగా అధికారులు గుర్తించారు. దీంతో ఆమెపై శాశ్వతంగా వేటు వేశారు. భవిష్యత్లో ఎలాంటి పరీక్షలు రాయకుండా యూపీఎస్సీ వేటు వేసింది.
ఇది కూడా చదవండి: Hyderabad: వాహనంలో గంజాయి సరఫరాపై ఖండించిన ఐకియా..
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?