Puja khedhkar: పూజా ఖేద్కర్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు
- పూజా ఖేద్కర్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు
- ముందస్తు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్ పూజా ఖేద్కర్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ను న్యాయస్థానం తిరస్కరించింది. శారీరక, మానసిక వైకల్యం ఉందంటూ తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి ఐఏఎస్ ఉద్యోగం సంపాదించినట్లు రుజువు కావడంతో యూపీఎస్పీ ఆమెపై వేటు వేసింది. ట్రైనీ ఐఏఎస్గా ఆమె ఎంపికను రద్దు చేయడంతో పాటు జీవితంలో మళ్లీ ఎలాంటి ప్రవేశ పరీక్షలు/యూపీఎస్సీ సెలెక్షన్స్లో పాల్గొనకుండా శాశ్వతంగా నిషేధం విధించింది. యూపీఎస్సీకి పూజా ఖేద్కర్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్టు రుజువు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Mohan Babu: మోహన్ బాబుకు హైకోర్టు షాక్
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
సోమవారం ముందస్తు బెయిల్పై ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె ఉద్దేశాలు, ప్రాథమికంగా అధికారులను మోసగించడమేనని కోర్టు పేర్కొంది. పెద్ద కుట్రలో భాగంగానే ఆమె విధంగా చేసిందని.. ఇది చాలా బలమైన కేసుగా ఉందని జస్టిస్ చంద్ర ధరి సింగ్ పేర్కొన్నారు. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పించలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ముందస్తు బెయిల్కు కూడా ఆమె అనర్హులని తెలిపింది. ఆమె దేశం మొత్తాన్ని మోసం చేసిందని కోర్టు అభిప్రాయపడింది. యూపీఎస్సీని మోసం చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేసినట్లుగా గుర్తించామని తెలిపింది. ముందస్తు బెయిల్పై గత నెలలో ఉత్తర్వులను రిజర్వ్ చేయగా.. తాజాగా సోమవారం ముందస్తు బెయిల్ను ధర్మాసనం నిరాకరించింది.
ఇది కూడా చదవండి: High Court: డెడ్ బాడీని రేప్ చేయడం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు
పూజా ఖేద్కర్… పూణెలో ఐఏఎస్ ట్రైనీగా విధులు నిర్వహిస్తుండగా హద్దు మీరి ప్రవర్తించారు. గొంతెమ్మ కోర్కెలు కోరి.. తన ఉద్యోగానికి ఎసరు తెచ్చుకుంది. వాస్తవంగా ట్రైనీగా ఎలాంటి సౌకర్యాలు ఉండవు. కానీ తనకు ప్రత్యేకమైన ఛాంబర్, టేబుల్, అలాగే కారు ఏర్పాటు చేయాలని అధికారులను డిమాండ్ చేసింది. వాళ్లపై తండ్రితో కలిసి తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఈ విషయం కాస్త ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఆమెను మరో చోటికి బదిలీ చేశారు. అంతలోనే ఆమె అసలు బాగోతం బయటపడింది. ఆమె తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించిందని.. అలాగే పేర్లు కూడా మార్చుకుందని ఆరోపణలు వచ్చాయి. దీంతో యూపీఎస్సీ విచారణ చేపట్టగా.. ఆమె అక్రమాలకు పాల్పడినట్లుగా తేలింది. ఆమె సమర్పించిన సర్టిఫికెట్లు దొంగ పత్రాలుగా అధికారులు గుర్తించారు. దీంతో ఆమెపై శాశ్వతంగా వేటు వేశారు. భవిష్యత్లో ఎలాంటి పరీక్షలు రాయకుండా యూపీఎస్సీ వేటు వేసింది.
ఇది కూడా చదవండి: Hyderabad: వాహనంలో గంజాయి సరఫరాపై ఖండించిన ఐకియా..
తాజావార్తలు
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!