కడప జిల్లా బద్వేల్లో శనివారం పోలింగ్ జరగనుంది. ఇదిలా వుంటే బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలంలో భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడింది. దీంతో బద్వేల్ ఉపఎన్నిక చల్లటి వాతావరణంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు, ఇతర అధికార సిబ్బంది. వర్షం కురుస్తున్నా పోలీస్ వాళ్ళు విధుల్లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు మరికొద్ది గంటల్లో జరిగే బద్వేల్ ఉప ఎన్నికకు సర్వం సిద్దం చేసింది అధికారయంత్రాంగం. బద్వేల్ ఉపఎన్నిక లో మొత్తం 281…
హుజురాబాద్ ఎన్నికల్లో పోలీసులు వన్సైడ్గా చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేత జి. వివేక్.. ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.. వరంగల్లోని గాయత్రి గ్రాండ్ హోటల్లో మీడియా సమావేశానికి వచ్చిన హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను అడ్డుకున్నారు పోలీసులు.. ఇక, పోలీసులకు నచ్చజెప్పి హోటల్కు వెళ్లారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివేక్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ మంత్రులు ప్రెస్ మీట్ పెడితే అడ్డుకోని పోలీసులు.. బీజేపీ నేతల ప్రెస్మీట్ను ఎందుకు అడ్డుకుంటున్నారు?…
తూర్పుగోదావరి : కోనసీమలో కరోనా కలకలం రేపుతోంది.. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పై కరోనా పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలోనే అమలాపురం డివిజన్ పరిధిలో ఏకంగా 10 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇందులో ఒక సిఐ, ఐదుగురు ఎస్ ఐ లకు నలుగురు కానిస్టేబుల్ లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోనసీమలో దసరా ఉత్సవాలు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఆందోళనల బందోబస్తులో పాల్గొన్న పోలీసులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.. కరోనా…
హైదరాబాద్లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు… ప్రేమకు నిరాకరించిన యువతిపై విచక్షణారహితంగా దాడి చేసినట్టుగా చెబుతున్నారు.. యువతి ఇంట్లోకి చొరబడి.. అమ్మాయి గొంతు, చేతులు, వెళ్లు, కాళ్లు, మనికట్టు ఇలా.. చాలా చోట్ల గాయపరిచాడు.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వట్టి నాగులపల్లిలో యువతి పై యువకుడి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.. యువతి ఇంటికి వచ్చి దాడి చేశాడు ప్రేమ్ సింగ్ అనే యువకుడు.. గొంతు, చేతులు, వెళ్లు, కాళ్లు..…
ఆంధ్రప్రదేశ్లో బూతుల పర్వం కాస్త.. కేసుల నమోదుకు దారితీసింది.. అయితే, బాధితుల మీదే కేసులు నమోదు చేస్తున్నారు.. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు.. తనపై గుంటూరులో కేసు నమోదు చేయడంపై స్పందించిన ఆయన.. బాధితుల మీదే కేసులు పెడుతున్నారు.. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.. చంపుతామన్న మైదుకూరు ఎమ్మెల్యే మీద ఏం కేసులు పెట్టారు..? అంటూ ఈ సందర్భంగా నిలదీసిన ఆయన.. చంద్రబాబు మీద బాంబులేస్తామన్న కుప్పం…
మాదక ద్రవ్యాల నియంత్రణపై డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మాదకద్రవ్యాల నియంత్రణపై ఏపీలో 45 మంది పోలీస్ ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్షా సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నెల రోజులుగా గంజాయిపై లోతైన అధ్యయనం చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం. ఆంధ్రా-ఒడిశా మధ్య గంజాయి సమస్య దశాబ్దాలుగా ఉంది. దీనిపై ఎన్ఐఏ సహకారం తీసుకుని…
లైంగిక వేధింపుల ఘటనలపై మహిళా కమిషన్ ఫోన్ ద్వారా కేసు పూర్వ పరాలను తెలుసుకుని బాధితులకు న్యాయం జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లాలో వరుస ఘటనలపై పోలీసు అధికారులతో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వారికి పలు సూచనలు చేశారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలో వివాహితపై వాలంటీర్ దాష్టీకంపై సీరియస్ అయ్యారు. పోలీసు అధికారులతో మాట్లాడిన కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. కేసు పూర్వాపరాలు విచారించి…వాలంటీర్…
టీడీపీ నేత పట్టాబి వ్యాఖ్యలతో రేగిన రాజకీయ కాక.. ..క్షణక్షణానికి కొత్త మలుపులు తిరుగుతోంది. నాలుగు రోజులుగా రాష్ట్రంలో పతాకస్థాయికి చేరిన రాజకీయ ఉద్రిక్తతల సెగ.. ఇప్పుడు ఢిల్లీకి చేరింది. హస్తినలోనూ పైచేయి సాధించాలని ఇరుపక్షాలు.. వ్యూహాలకు తెరలేపాయి. ఇది ఇలా ఉండగా… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన పట్టాభి నిన్న రాత్రి బెయిల్పై రిలీజయ్యారు. గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్టైన పట్టాభికి 14 రోజుల జ్యుడీషియల్…
హుజురాబాద్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం వేడుక్కుతుంది. మాటల యుద్ధం కాస్త ఘర్షణల వరకు దారి తీస్తుంది. శుక్రవారం ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరపున ప్రచారం నిర్వహించారు. అటుగా ర్యాలీతో వస్తున్న టీఆర్ఎస్, బీజేపీ ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఘర్షణను శాంతింపజేసేందుకు ప్రయత్నించిన ట్రైనీ ఎస్సై రజినికాంత్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రవీణ్, చిన్నరాయుడు దాడికి పాల్పడ్డారు. దీనిపై…
తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో మహిళల భద్రత కోసం షీ టీంలు పనిచేస్తున్నాయి. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వేధింపులను నియంత్రించడానికి సైబర్ ల్యాబ్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీని ద్వారా సెల్ఫోన్ల ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్తో వేధించే వారిని ఈ సైబర్ల్యాబ్ పసిగడుతుంది. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లకు ఈ ల్యాబ్ సాంకేతిక సహాయాన్ని అందజేయనుంది.…