మాదక ద్రవ్యాల నియంత్రణపై డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మాదకద్రవ్యాల నియంత్రణపై ఏపీలో 45 మంది పోలీస్ ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్షా సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నెల రోజులుగా గంజాయిపై లోతైన అధ్యయనం చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం. ఆంధ్రా-ఒడిశా మధ్య గంజాయి సమస్య దశాబ్దాలుగా ఉంది. దీనిపై ఎన్ఐఏ సహకారం తీసుకుని…
లైంగిక వేధింపుల ఘటనలపై మహిళా కమిషన్ ఫోన్ ద్వారా కేసు పూర్వ పరాలను తెలుసుకుని బాధితులకు న్యాయం జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లాలో వరుస ఘటనలపై పోలీసు అధికారులతో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వారికి పలు సూచనలు చేశారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలో వివాహితపై వాలంటీర్ దాష్టీకంపై సీరియస్ అయ్యారు. పోలీసు అధికారులతో మాట్లాడిన కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. కేసు పూర్వాపరాలు విచారించి…వాలంటీర్…
టీడీపీ నేత పట్టాబి వ్యాఖ్యలతో రేగిన రాజకీయ కాక.. ..క్షణక్షణానికి కొత్త మలుపులు తిరుగుతోంది. నాలుగు రోజులుగా రాష్ట్రంలో పతాకస్థాయికి చేరిన రాజకీయ ఉద్రిక్తతల సెగ.. ఇప్పుడు ఢిల్లీకి చేరింది. హస్తినలోనూ పైచేయి సాధించాలని ఇరుపక్షాలు.. వ్యూహాలకు తెరలేపాయి. ఇది ఇలా ఉండగా… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన పట్టాభి నిన్న రాత్రి బెయిల్పై రిలీజయ్యారు. గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్టైన పట్టాభికి 14 రోజుల జ్యుడీషియల్…
హుజురాబాద్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం వేడుక్కుతుంది. మాటల యుద్ధం కాస్త ఘర్షణల వరకు దారి తీస్తుంది. శుక్రవారం ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరపున ప్రచారం నిర్వహించారు. అటుగా ర్యాలీతో వస్తున్న టీఆర్ఎస్, బీజేపీ ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఘర్షణను శాంతింపజేసేందుకు ప్రయత్నించిన ట్రైనీ ఎస్సై రజినికాంత్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రవీణ్, చిన్నరాయుడు దాడికి పాల్పడ్డారు. దీనిపై…
తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో మహిళల భద్రత కోసం షీ టీంలు పనిచేస్తున్నాయి. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వేధింపులను నియంత్రించడానికి సైబర్ ల్యాబ్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీని ద్వారా సెల్ఫోన్ల ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్తో వేధించే వారిని ఈ సైబర్ల్యాబ్ పసిగడుతుంది. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లకు ఈ ల్యాబ్ సాంకేతిక సహాయాన్ని అందజేయనుంది.…
ఇప్పటి వరకు హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తే పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. బైక్ నడిపే వారితో పాటుగా వెనక కూర్చున్న వ్యక్తులు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. లేకపోతే జరిమానాలు విధిస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు నిఘాను పెంచి హెల్మెట్ ధరించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, నగరంలో చాలా మంది కోవిడ్ నిబంధనలు పాటించకుండా వాహానలు నడుపుతున్నారు. దీనిపై పోలీసులు దృష్టిసారించారు. హెల్మెట్తో పాటుగా మాస్క్ ధరించకుండా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధం…
గోశామహాల్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. హోంమంత్రి మహమ్మద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డి, సీపీ అంజనీకుమార్, మాజీ ఉన్నాతాధికారులు హాజరయ్యారు. హోంమంత్రి, డీజీపీ మహేందర్రెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడారు. దేశ భద్రతలో పోలీసుల సేవలు చిరస్మరణీయ నీయమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో 377మంది పోలీసులు అమరులయ్యారన్నారు. కరోనా సమయంలో 62 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, ఇందులో10మంది హోం…
గోశామహాల్లో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. హోంమంత్రి మహమ్మద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డి, సీపీ అంజనీకుమార్, మాజీ ఉన్నాతాధికారులు హాజరయ్యారు. హోంమంత్రి, డీజీపీ మహేందర్రెడ్డి, TSSP అభిలాష్బిస్తా, సీపీ అంజనీకుమార్పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ..1959 భారత్, చైనా సరిహద్దుల్లో దేశభద్రతలో ప్రాణాలు త్యాగం చేసిన వారికి గుర్తుగా అక్టోబర్21 ని పోలీసు అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీసులు నేరాలు చేధించడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా…
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న టీడీపీ బంద్ కార్యక్రమంలో పాల్గొన కుండా బుచ్చయ్యరు గృహ నిర్బంధం చేశారు పోలీస్ అధికారులు. వైసిపి నాయకులు తమనేతల దిష్టిబొమ్మలు దహనం చేస్తుంటే పోలీసులు పర్మిషన్ ఇస్తారని, మా మీద జరిగిన దాడులు ఖండించడానికి మేము బయటకు వెళ్లకూడదా అని బుచ్చయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులను…
ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించనున్నారు. పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులు, పోలీస్ శాఖను ఆధునీకరించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల నిషేధం వంటి వాటిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మాఫియా పెచ్చుమీరుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయాలు నిరోధించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్..…