రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. సయ్యద్ షాహిద్, పేదిరిపాటి శేఖర్ గౌడ్ అనే ఇద్దరు నిందితులు నకిలీ అగ్రిమెంట్ పేపర్లతో నగరంలోని ముసాపేట్లో 1500 గజాల విలువైన భూమిని అమ్మకానికి యత్నించారన్నారు. బంజారాహిల్స్కు చెందిన ఓ వ్యాపార వేత్తకి రూ.11 కోట్ల 25లక్షలకు బేరం మాట్లాడుకున్నారని తెలిపారు. అడ్వాన్స్గా రూ. 1 కోటి 10 లక్షలను వ్యాపారవేత్త…
దిశ నిందితుల ఎన్కౌంటర్ తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఎన్కౌంటర్ పై హక్కుల సంఘాల దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు ఈ కమిషన్ను నియమించింది.ఈ కమిషన్ సభ్యులు ఆదివారం నిందితుల ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సిర్పూర్కర్ కమిషన్ ఈ ఎన్కౌంటర్ పై విచారణ చేస్తుంది. కరోనా కారణంగా కమిషన్ విచారణ ఆలస్యమైంది. దీంతో కమిషన్కు సుప్రీం కోర్టు గడువును పెంచింది. దిశ నిందితులు ఎన్కౌంటర్కు గురైన షాద్నగర్కు సమీపంలోని చటాన్పల్లి ప్రాంతాన్ని సిర్పూర్కర్…
ములుగు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఏటూరునాగారం మండలం రొయ్యూరు దగ్గర తారు రోడ్డు వేస్తున్న రెండు వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసిరారు. ఘటనా స్థలంలో PLGA వారోత్సవాలు విజయవంతం చేయాలని కరపత్రం వదిలి వెళ్ళారు మావోయిస్టులు. మావోయిస్టుల PLGA వారోత్సవాల సందర్భంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటూరునాగారం పీఎస్ కు 15 కిమీ దూరంలో వాహనాలు ధ్వంసం చేసి పోలీసులకు సవాల్ విసిరారు మావోయిస్టులు. ఇటీవల భారీ ఎన్ కౌంటర్కు…
గుంటూరు జిల్లాలోని నగర పాలెం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ ను అమ్ముతున్న నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్తో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మాట్లాడుతూ .. మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితుడు రేవంత్గా గుర్తించామని, రేవంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పట్టుబడ్డ నిందితులు ఇంజనీరింగ్ విద్యార్థులుగా విచారణలో తేలిందన్నారు. నిందితుల దగ్గరనుంచి 150 గ్రాముల గంజాయి. మూడు సెల్ ఫోన్స్ స్వాధీనం…
శిల్పా చౌదరి కేసులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా కొకపేట ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్ లో 36 వేలు , ఆక్సిస్ బ్యాంకు అకౌంట్ లో 14 వేలు గుర్తించారు పోలీసులు. అయితే పోలీసులతో 2 సంవత్సరాలు అమెరికా లో ఉన్నానని పోలీస్ లకు చెప్పిన శిల్పా… తనను అరెస్ట్ చేశాక.. నా మైండ్ బ్లాంక్ అయింది..నాకు డబ్బుల లావాదేవీలు ఏవీ గుర్తుకు రావడం లేదు. జైల్ కు వెళ్లినాక నా మతిస్థిమితం బాగోలేదు…
ప్రస్తుతం శిల్పా చౌదరి కేసు సంచలనంగా మారుతోంది. అధిక వడ్డీ పేరుచెప్పి ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కొల్లగొట్టిన ఈమెను ఇటీవల్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో ఆమెకు కోర్టు బెయిల్ కూడా నిరాకరించింది. ఇక తాజాగా శిల్పా చౌదరి కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఎట్టకేలకు పోలీసులు ముందు నోరూ విప్పింది శిల్పా. రాధికా రెడ్డి అనే రియాల్టర్ తనను మోసం చేసినట్టు పోలిసులకు స్టేట్మెంట్ ఇచ్చింది శిల్పా.…
తెలంగాణలో ఓమిక్రాన్ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం మాస్కులు వాడని వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా జరిమానాల జాతర మొదలైంది. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకున్నా, డ్రంక్ డ్రైవ్లో పట్టుబడ్డా చలానాలు రాస్తున్నారు. ఇప్పుడేమో కోవిడ్ తీవ్రత పెరగడంతో మళ్ళీ జరిమానాలు మొదలయ్యాయి. భద్రాచలంలో మాస్కుల జరిమానాలు షురూ అయ్యాయి. భద్రాచలంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 10 మందికి 10 వేలు జరిమానా విధించారు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీపతి తిరుపతి. దేశంలో ఓమిక్రాన్ అలజడి రేగడంతో తెలంగాణ…
కెమిస్ర్టీ పబ్లో పని చేసే ఓ మహిళ పై లైంగిక దాడి జరిగిందన్న విషయం మాకు తెలియదని పబ్ ఎండీ సంతోష్ మీడియాకు తెలిపారు. దీనికి సంబంధించిన పలు విషయాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలీసులు వచ్చి చెప్పేంతవరకు లైంగిక దాడి ఘటన విషయం మాకు తెలియదని ఆయన అన్నారు. లైంగిక దాడి ఘటనకు పబ్కు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. పబ్లో పనిచేసే సిబ్బంది డ్యూటీ ముగించుకుని వెళ్లాక బయట…
అసలే కోతి.. కల్లు తాగిందంటారు. దీనికి ప్రతిరూపమే ఈ వ్యక్తి. అసలే తిక్క చేష్టలు చేసే వ్యక్తి పైగా మందు తాగాడు, మెడలో పాముతో బయటకు వచ్చాడు. డబ్బులివ్వాలని, లేదంటే పాముతో కరిపించేస్తానని ఒకటే గొడవ. సంగారెడ్డి జిల్లా గ్రేటర్ పరిధిలోని భారతీనగర్ డివిజన్లో తాగుబోతు హల్చల్ చేశాడు. మెడలో ఆరడుగుల పాము వేసుకుని ప్రతి ఒక్కరిని డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. డబ్బులు ఇవ్వని వారి పైన పాము వదులుతానని భయభ్రాంతులకు గురిచేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం…
అత్త ఇంటికి కన్నం వేసిన అల్లుడిని పట్టుకున్నారు పోలీసులు. దీని పై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసు 24 గంటల్లో ఛేదించాము. 12 లక్షల నగదు తో పాటు, 1.5 కేజీ గోల్డ్.. మొత్తం విలువ 65 లక్షల విలువ అయిన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. జోగిని రంగమ్మ అనే 60 ఏళ్ల మహిళ ఇంట్లో వరుసకు అల్లుడు లక్ష్మన్ చోరీ చేసినట్టు ఫిర్యాదు…