Online Trading: ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. ముఠా గుట్టురట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వెబ్ సైట్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా అమాయకులను నిందితులు ఆకర్షిస్తున్నారు. నిందితుల దగ్గర నుంచి ల్యాప్ టాప్లు, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 140 మంది నుంచి దాదాపు కోటికి పైగా డబ్బును నిందితులు వసూలు చేసినట్లు సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహ మెహ్రా వెల్లడించారు.
Read Also: Banjarahills Care Hospital: అవయవదానం చేసిన కుటుంబసభ్యులకు సత్కారం
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
డీసీపీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ.. ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో మోసం చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్ చేశాము అని వెల్లడించారు. నకిలీ వెబ్ సైట్స్, కాల్ సెంటర్ ఏర్పాటు చేసి అమాయకులకు మోసం చేస్తున్నారు. ఈ ఫేక్ కాల్ సెంటర్ ను చిత్తూరు జిల్లా పీలేరు కేంద్రంగా నడుస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశాము అని ఆమె తెలిపారు. ఈ కేసులో సాయి శరన్ కుమార్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు.. ఆన్ లైన్ లో ట్రేడింగ్ పేరుతో కాల్స్ చేయించి మోసం చేస్తున్నాడు అని సైబర్ క్రైమ్ డీసీపీ పేర్కొన్నారు. డీ మ్యాట్ అకౌంట్ యూజర్, పాస్ వర్డ్ తీసుకొని సాయి గ్యాంగ్ ఆపరేట్ చేస్తుంది అని ఆమె వెల్లడించారు.
Read Also: Lokesh Kanagaraj: నేను షర్ట్ బటన్ పెట్టను… నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ బాసు…
రోజు వారి ట్రేడింగ్ లో లాభాలు వస్తాయని చెప్పి కాల్ సెంటర్ ద్వారా కాల్ చేసి అమాయక ప్రజలను నమ్మిస్తున్నారు అని డీసీపీ స్నేహ మెహ్రా తెలిపారు. డీ మ్యాట్ అకౌంట్ వివరాలు తీసుకుని నిందితుల బ్యాంక్ అకౌంట్లు వివరాలు ఇచ్చి అమౌంట్ ను వీరి అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు.. దాదాపు 140 మంది బాధితుల నుంచి కోటి ఎనిమిది లక్షల రూపాయల మోసం జరిగింది.. ఎనిమిది నెలలుగా ఈ మోసానికి పాల్పడుతున్నారు అని స్నేహ మెహ్రా పేర్కొన్నారు. ఐదుగురు సభ్యుల మూఠా సభ్యులను అరెస్ట్ చేశాము.. 31ల్యాప్ టాప్స్, 6 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితుడు బ్యాంక్ అకౌంట్ సీజ్ కోసం అధికారులని కోరాము.. డేటా ఎక్కడ నుంచి తీసుకున్నారు అనేది విచారణ చేస్తున్నాం.. మొత్తం 5 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశామని సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహ మెహ్రా వెల్లడించారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?