TS Police: సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులపై పోలీసుల నజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం సర్వసాధారణమైపోయింది. కొన్ని సందర్భాల్లో ఇది శృతికి మించి వివాదాలకు దారితీస్తోంది. లేని వాటిని ఉన్నట్లు, ఉన్నవాటిని లేనట్లు చిత్రీకరించి.. ఎదుటివారి భావోద్వేగాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతుండటంతో పార్టీల మధ్యే కాదు, సాధారణ ప్రజల మధ్య కూడా చిచ్చు పెడుతున్నాయి. ఇలాంటి వాటిని నివారించేందుకు తాండూరు పోలీసు శాఖ అధికారులు నజర్ పెట్టారు.
Read Also: Shocking: సోషల్ మీడియాలో హీరోయిన్ ప్రైవేట్ వీడియోలు లీక్.. అతని పనేనంటూ కేసు నమోదు!
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ఇవాళ (బుధవారం) తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వివాదాస్పద పోస్టులపై దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఫేస్ బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా ఫ్లాట్ ఫారాలపై నిఘా ఉంచినట్లు డీఎస్పీ పేర్కొన్నాడు. సోషల్ మీడియాను మంచికే ఉపయోగించుకోవాలన్నారు. రాజకీయ పార్టీలు అభివృద్ధికి వాడుకోవాలని డీఎస్పీ శేఖర్ గౌడ్ చెప్పాడు. లేనిపోని వివాదాస్పదమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వివాదాలకు, విఘాదాలకు కారణమయ్యే పోస్టులు పెడితే సుమోటోగా కేసును స్వీకరించి కేసులు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ప్రజలు, వినియోగ దారులు సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ సూచించారు.
Read Also: AP High Court: రుషికొండపై నిర్మాణాలు.. హైకోర్టు కీలక ఆదేశాలు
సోషల్ మీడియాలో, వాట్సప్ గ్రూపులలో మీ ప్రాంతం అభివృద్ధి కోసం జరిగే చర్చలు ఉండాలని నియోజకవర్గంలో ఉన్న అన్ని వాట్సప్ గ్రూపులపై సోషల్ మీడియాపై తమ ప్రత్యేక దృష్టి ఉంచమని తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యకర పదజాలం వాడిన, పోస్టులు పెట్టిన తమకు ఫిర్యాదు చేయాలని లేకపోతే తామే సుమోటోగా స్వీకరించి వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టిన కొందరు వ్యక్తులను కూడా బైండోవర్ చేయనున్నట్లు డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!