TS Police: సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులపై పోలీసుల నజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం సర్వసాధారణమైపోయింది. కొన్ని సందర్భాల్లో ఇది శృతికి మించి వివాదాలకు దారితీస్తోంది. లేని వాటిని ఉన్నట్లు, ఉన్నవాటిని లేనట్లు చిత్రీకరించి.. ఎదుటివారి భావోద్వేగాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతుండటంతో పార్టీల మధ్యే కాదు, సాధారణ ప్రజల మధ్య కూడా చిచ్చు పెడుతున్నాయి. ఇలాంటి వాటిని నివారించేందుకు తాండూరు పోలీసు శాఖ అధికారులు నజర్ పెట్టారు.
Read Also: Shocking: సోషల్ మీడియాలో హీరోయిన్ ప్రైవేట్ వీడియోలు లీక్.. అతని పనేనంటూ కేసు నమోదు!
Also Read
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
ఇవాళ (బుధవారం) తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వివాదాస్పద పోస్టులపై దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఫేస్ బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా ఫ్లాట్ ఫారాలపై నిఘా ఉంచినట్లు డీఎస్పీ పేర్కొన్నాడు. సోషల్ మీడియాను మంచికే ఉపయోగించుకోవాలన్నారు. రాజకీయ పార్టీలు అభివృద్ధికి వాడుకోవాలని డీఎస్పీ శేఖర్ గౌడ్ చెప్పాడు. లేనిపోని వివాదాస్పదమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వివాదాలకు, విఘాదాలకు కారణమయ్యే పోస్టులు పెడితే సుమోటోగా కేసును స్వీకరించి కేసులు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ప్రజలు, వినియోగ దారులు సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ సూచించారు.
Read Also: AP High Court: రుషికొండపై నిర్మాణాలు.. హైకోర్టు కీలక ఆదేశాలు
సోషల్ మీడియాలో, వాట్సప్ గ్రూపులలో మీ ప్రాంతం అభివృద్ధి కోసం జరిగే చర్చలు ఉండాలని నియోజకవర్గంలో ఉన్న అన్ని వాట్సప్ గ్రూపులపై సోషల్ మీడియాపై తమ ప్రత్యేక దృష్టి ఉంచమని తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యకర పదజాలం వాడిన, పోస్టులు పెట్టిన తమకు ఫిర్యాదు చేయాలని లేకపోతే తామే సుమోటోగా స్వీకరించి వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టిన కొందరు వ్యక్తులను కూడా బైండోవర్ చేయనున్నట్లు డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు.
తాజావార్తలు
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!