China: బీజింగ్లో భారీ వర్షాలు.. 11 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: వర్షాలు భారత దేశంలోనే కాదు.. ప్రపంచంలోని పలు దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. నైరుతు రుతుపవనాల నేపథ్యంలో భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతోపాటు.. వరదల మూలంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. వేల సంఖ్యలో నిరాశ్రయులు అయ్యారు. ఇండియాతోపాటు అమెరికా, చైనాలోనూ భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చైనా రాజధాని బీజింగ్లో భారీవర్షాల కారణంగా వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 11 మంది మృతి చెందినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. భారీ వర్షాలు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. రాజధాని నగరం బీజింగ్లో వరదల కారణంగా 11 మంది మృతి చెందగా.. 27 మంది వరదనీటిలో గల్లంతయ్యారు. నగరాన్ని వరద ముంచెత్తడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ మేరకు మంగళవారం స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.
Read also: Kane Williamson: న్యూజిలాండ్ జట్టుకు గుడ్ న్యూస్.. కేన్ మామ వచ్చేస్తున్నాడు
Also Read
- Hormuz Strait Crisis: పాక్ విఫలం.. 'హార్మూజ్' కోసం రంగంలోకి ఖతార్..!
- China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
- Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
- US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
చైనా దేశంలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో బాధితులను పాఠశాలలు, రైల్వే స్టేషన్లు వంటి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బీజింగ్ కొంతవరకు పొడి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇంతటి భారీ వర్షపాతం నమోదవ్వడం అసాధారణం. ఉత్తర చైనాలోని చాలా ప్రాంతాల్లో వరదలు చాలా అరుదు. ఈ అసాధారణ పరిస్థితి కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 50 ఏళ్లలో ఎన్నడు లేనంతగా ఉత్తర ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. గత నెలలో వరదల కారణంగా చాంగ్ కింగ్లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో 15 మంది మరణించారు. లియానింగ్లోని వాయువ్య ప్రావిన్స్లో దాదాపు 5,590 మందిని ఖాళీ చేయించాల్సి వచ్చింది. హుబేలో తుపాను కారణంగా కొందరు వాహనాల్లో చిక్కుకుపోయారు. చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. 1998లో చైనాలో భారీ వరదలు సంభవించాయి. దీని వల్ల 4,150 మంది మృతి చెందారు. ఎక్కువగా యాంగ్జీ నది పరివాహక ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. 2021లో హెనాన్ రాష్ట్రంలో వరదల కారణంగా 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు.
తాజావార్తలు
-
Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
-
Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్తో వస్తున్న నిఖిల్ మూవీ
-
Google AI Studio: డెవలపర్లకు గుడ్ న్యూస్.. మొబైల్ నుంచే AI డెవలప్మెంట్.. గూగుల్ AI స్టూడియో ఇప్పుడు ఆండ్రాయిడ్లో
-
Hormuz Strait Crisis: పాక్ విఫలం.. ‘హార్మూజ్’ కోసం రంగంలోకి ఖతార్..!
-
Lenin: అఖిల్ కంబ్యాక్ ఫిక్స్?.. “మనోడు వస్తున్నాడు” టీజర్ వైరల్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!