హైదరాబాద్ పంజాగుట్టలో మృతి చెందిన చిన్నారి కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో మహిళతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కర్ణాటకలో అరెస్ట్ చేసినట్లు వారు వెల్లడించారు. బాలికను సొంత తల్లే హత్య చేసిందని, ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. బాలికను బెంగళూరులో చంపిన కసాయి తల్లి హైదరాబాద్కు తీసుకువచ్చి పంజాగుట్టలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. Read Also:…
కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ కుమారుడు వైభవ్ యాదవ్ (17) గురువారం సాయంత్రం సూసైడ్ నోట్ రాసి ఈ ఘటనకు పాల్పడ్డాడు. జబల్పూర్లోని గోరఖ్పూర్ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో బాత్రూంలో తలపై తుపాకీతో కాల్చుకుని వైభవ్ చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్లో తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని వైభవ్…
హర్యానాలోని పానిపట్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ బాలికపై పొరుగింట్లో ఉంటున్న తండ్రీకొడుకులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… పానిపట్లోని మోడల్ కాలనీలో నివసిస్తున్న బాలిక ఇంటి పక్కనే అజయ్ అనే యువకుడి ఇల్లు ఉంది. దీంతో అజయ్ తరచూ బాలికను ప్రేమిస్తున్నాని వెంటపడుతున్నాడు. కొన్నాళ్లకు అతడి మాయమాటలను నమ్మిన బాలిక అజయ్తో ప్రేమలో పడింది. ఈ నేపథ్యంలో ఓ రోజు అజయ్ బాలికను తన ఇంటికి…
జగిత్యాల పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీన్ఖని చౌరస్తా వద్ద ఓ టీ దుకాణంలో ఒక వర్గానికి చెందిన వారు… మరోవర్గంపై దాడికి పాల్పడ్డారు. ఓ విషయంలో ఇరు వర్గాలకు చెందిన వారు ఘర్షణకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వ్యక్తులను వెంటనే సమీపంలోని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. Read Also:…
హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులు పశ్చిమ బెంగాల్కు చెందిన విష్ణు (25), జగన్నాథ్ (30)గా పోలీసులు గుర్తించారు. అనంతరం క్లూస్ టీమ్ బృందం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. Read Also: దీపావళి వేడుకల్లో అపశృతి.. పలువురికి గాయాలు అయితే…
పంజాగుట్టలో బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకపురి కాలనీ నాలుగు సంవత్సరాల బాలిక మృతి చెందింది. ఓ షట్టర్ ముందు నాలుగు సంవత్సరాల అమ్మాయి అనుమానాస్పదంగా మరణించింది. ఆ అమ్మాయిని ఎవరైనా చంపేసి ఇక్కడ పెట్టారా లేక ఇంకేమైనా కారణాలు అనేది తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు క్లూస్ టీం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల అమ్మాయి బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా…
ఏపీలో రికార్డు స్థాయిలో గంజాయి పట్టుబడుతోంది. గంజాయి అక్రమ రవాణాపై తూర్పు గోదావరి జిల్లా పోలీసులు గురువారం నాడు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద మొత్తంలో గంజాయి గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రెండు వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. Read Also: 15 ఏళ్ల కుర్రాడి దారుణం.. యువతిని ఈడ్చుకెళ్లి, గొంతుకోసి…? సుకుమామిడి బ్రిడ్జి…
హైదరాబాద్ నగరంలో పోలీసులు గంజాయిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా సిటీ మొత్తం పోలీసులు జల్లెడ పడుతున్నారు. టూవీలర్పై వెళ్తున్న కొంతమంది యువకులను ఆపి తనిఖీలు చేస్తున్నారు. యువకుల మొబైల్ చాటింగులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. దీంతో తమ ప్రైవసీకి పోలీసులు భంగం కలిగిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ అంశంపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరణ ఇచ్చారు. నిందితుల కదలికలు, నేరస్థుల అనుచరులపై నిఘా పెట్టేందుకే పలువురి మొబైల్…
హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో పలువురు యువకులు మత్తుకు బానిసై దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజేఆర్ నగర్, మల్లికార్జునా నగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… స్థానికంగా నివాసం ఉండే నవీన్ అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆ యువతి వెంటపడ్డాడు. నవీన్ మత్తుకు బానిసై చిల్లరగా తిరుగుతూ తన కూతురు వెంటపడుతున్నాడని యువతి…
తెలుగు అకాడమీ నిధులు ఎక్కడి వెళ్లాయి.. ఎవరు దోచుకుపోయారు.. నాలుగు నెలల కాలంలో 63 కోట్ల రూపాయల నిధులు అదృశ్యమయ్యాయి.. ఈ నిధుల గోల్మాల్ వెనకాల ఉన్న అసలు సూత్రధారి ఎవరు.. ప్రైవేట్ కోపరేటివ్ బ్యాంకు పాత్ర ఎంత వరకు ఉంది.. యూనియన్ బ్యాంకు నుంచి డబ్బులు ఎలా డ్రా చేసుకున్నారు. ఉన్నతాధికారుల నకిలీ లెటర్స్ తో 63 కోట్ల రూపాయలు చీటర్ దోచుకున్నారు. అయితే కేసు వెనుక ఉన్న అసలు సూత్రధారి.. పాత్రధారి ఎవరు. కథను…