G20: జీ20 సమావేశానికి వస్తున్న ప్రపంచ నేతలకు స్వాగతం పలికేందుకు ఢిల్లీ సిద్ధమైంది. వీధులు, చౌరస్తాలు, పార్కుల నుంచి ప్రధాన వేదికైన భారత మండపం వరకు దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది.
దాదాపు 80 శాతం మంది భారతీయులు ప్రధాని నరేంద్ర మోడీ పట్ల అనుకూలమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని ప్యూ రీసెర్చి సెంటర్ చేసిన సర్వే ప్రకారం వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
BJP: 2024 లోక్సభ ఎన్నికలకు మరెంతో కాలం లేదు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావాలని అనుకుంటుంటే.. ప్రధాని మోడీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ తో పాటు 26 పార్టీలు ఇండియా పేరుతో కొత్త కూటమి కట్టాయి.
Congress: చంద్రయాన్-3 విజయం తర్వాత నేరుగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గ్రీస్ పర్యటన నుంచి బెంగళూర్ చేరుకుని శాస్త్రవేత్తలను అభినందించారు. అయితే ఈ పర్యటన ప్రోటోకాల్ వివాదానికి కారణమైంది. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తోంది.
Narendra Modi: ప్రజాకవి గద్దర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. కాగా గద్దర్ మృతిపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి తానెంతో బాధపడ్డానని ఆయన భార్య విమలకు మోడీ లేఖ రాశారు. తీవ్ర దు:ఖంలో ఉన్న గద్దర్ కుటుంబానికి మోడీ సానుభూతిని తెలియజేశారు. గద్దర్ పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయని మోడీ లేఖలో తెలిపారు. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన…
మోడీ సర్కారుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ స్పందించడంతో ప్రతిపక్షాలు లోక్సభ నుంచి వాకౌట్ చేశాయి. వాకౌట్పై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ప్రశ్నలు లేవనెత్తే వారికి సమాధానాలు వినే ధైర్యం లేదంటూ ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ గురువారం కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. భారతదేశాన్ని అవమానించడంలో ఆ పార్టీ ఆనందం పొందుతుందని అన్నారు. ఆ పార్టీ ఏ చిన్న సమస్యనైనా తీసుకుంటుందని, భారతదేశాన్ని పరువు తీయడానికి విలేకరుల సమావేశాలు నిర్వహిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్పై విరుచుకుపడిన ప్రధాని మోదీ.. ఆ పార్టీపై భారత ప్రజలకు విశ్వాసం లేదని అన్నారు.
అవిశ్వాసం పెట్టిన విపక్షాలకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రధాని మోడీ ప్రసంగించారు. దేవుడే అవిశ్వాసం పెట్టాలని విపక్షాలకు చెప్పారని ఆయన అన్నారు. మూడు రోజులుగా చాలామంది మాట్లాడారని.. 2018లో కూడా అవిశ్వాసం పెట్టారు.
మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లపై కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి లోక్ సభలో అవిశ్వాన తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.