Yashobhoomi: తన పుట్టిన రోజున దేశానికి పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్న ప్రధాని మోడీ.. ఏంటంటే?
Yashobhoomi: తన 73వ పుట్టిన రోజు సందర్భంగా మోడీ దేశ ప్రజలకు ఓ కానుక ఇవ్వబోతున్నారు. సెప్టెంబర్ 17న ఢిల్లీలోని ద్వారకలో ‘యశోభూమి’ పేరుతో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అధికారికంగా దీని పేరు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ (IICC). ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు 221 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆధునిక సాంకేతికతలు, ఫీచర్లతో కూడిన ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ హాళ్లలో ఒకటి. ఐసిసి-ద్వారకా సెక్టార్ 25 స్టేషన్ లోపల కొత్త మెట్రో స్టేషన్ కూడా ప్రారంభించబడుతుంది. ఈ కొత్త మెట్రో స్టేషన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ లైన్కు అనుసంధానించబడుతుంది. ఇది న్యూఢిల్లీ మెట్రో స్టేషన్, ఐఐసిసి మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
ప్రస్తుతం ఢిల్లీ మెట్రో ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్లో మెట్రో రైళ్లు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. అయితే ఈ లైన్లోని రైళ్లు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయడం విశేషం. ఇప్పటి వరకు ఇదే గరిష్ట వేగం. దీని కారణంగా న్యూ ఢిల్లీ నుండి యశోభూమి ద్వారకా సెక్టార్ 25 వరకు మొత్తం ప్రయాణం కేవలం 21 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఫిబ్రవరి 2011లో ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్ ప్రారంభమైనప్పటి నుంచి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుస్తున్నాయని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. అయితే ఇప్పుడు మెట్రో గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.
Read Also:Tiger Vs Pathan: ప్రీప్రొడక్షన్ స్టార్ట్… మార్చ్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ రెగ్యులర్ షూటింగ్…
అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే మెట్రో రైళ్లను ఎక్కువ వేగంతో నడిపేందుకు టెస్టింగ్స్ ప్రారంభించారు. గత కొన్ని నెలలుగా గంటకు 110 కి.మీ వేగంతో రైళ్లు నడుస్తున్నాయని మెట్రో అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ 2018 సెప్టెంబర్ 19న యశోభూమి అంటే ఐఐసీసీకి శంకుస్థాపన చేశారు. 25,700 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు 221 ఎకరాల్లో విస్తరించి ఉంది. దాని లోపల ఒక పెద్ద ఎగ్జిబిషన్ హాల్ ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద హాళ్లలో ఒకటి. యశోభూమి ఎగ్జిబిషన్ హాలులో ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. 73,000 చదరపు మీటర్లలో విస్తరించి ఉన్న ఈ హాల్లో ప్రధాన ఆడిటోరియం, గ్రాండ్ బాల్రూమ్,13 మీటింగ్ హాళ్లు ఉన్నాయి. ఇది 11,000 మంది అతిథులకు వసతి కల్పిస్తుంది. కన్వెన్షన్ సెంటర్లో దాదాపు 6,000 మంది అతిథులు కూర్చునే సామర్థ్యం ఉంది. ఇక్కడ సీటింగ్ ఏర్పాట్లు ఆధునికంగా రూపొందించబడ్డాయి. ఇక్కడ బాల్రూమ్ సామర్థ్యం 2,500 మంది అతిథులు, అవసరమైతే మరో 500 మంది అతిథులకు పెంచవచ్చు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?