Yashobhoomi: తన పుట్టిన రోజున దేశానికి పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్న ప్రధాని మోడీ.. ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashobhoomi: తన 73వ పుట్టిన రోజు సందర్భంగా మోడీ దేశ ప్రజలకు ఓ కానుక ఇవ్వబోతున్నారు. సెప్టెంబర్ 17న ఢిల్లీలోని ద్వారకలో ‘యశోభూమి’ పేరుతో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అధికారికంగా దీని పేరు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ (IICC). ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు 221 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆధునిక సాంకేతికతలు, ఫీచర్లతో కూడిన ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ హాళ్లలో ఒకటి. ఐసిసి-ద్వారకా సెక్టార్ 25 స్టేషన్ లోపల కొత్త మెట్రో స్టేషన్ కూడా ప్రారంభించబడుతుంది. ఈ కొత్త మెట్రో స్టేషన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ లైన్కు అనుసంధానించబడుతుంది. ఇది న్యూఢిల్లీ మెట్రో స్టేషన్, ఐఐసిసి మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
Also Read
- Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
ప్రస్తుతం ఢిల్లీ మెట్రో ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్లో మెట్రో రైళ్లు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. అయితే ఈ లైన్లోని రైళ్లు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయడం విశేషం. ఇప్పటి వరకు ఇదే గరిష్ట వేగం. దీని కారణంగా న్యూ ఢిల్లీ నుండి యశోభూమి ద్వారకా సెక్టార్ 25 వరకు మొత్తం ప్రయాణం కేవలం 21 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఫిబ్రవరి 2011లో ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్ ప్రారంభమైనప్పటి నుంచి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుస్తున్నాయని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. అయితే ఇప్పుడు మెట్రో గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.
Read Also:Tiger Vs Pathan: ప్రీప్రొడక్షన్ స్టార్ట్… మార్చ్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ రెగ్యులర్ షూటింగ్…
అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే మెట్రో రైళ్లను ఎక్కువ వేగంతో నడిపేందుకు టెస్టింగ్స్ ప్రారంభించారు. గత కొన్ని నెలలుగా గంటకు 110 కి.మీ వేగంతో రైళ్లు నడుస్తున్నాయని మెట్రో అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ 2018 సెప్టెంబర్ 19న యశోభూమి అంటే ఐఐసీసీకి శంకుస్థాపన చేశారు. 25,700 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు 221 ఎకరాల్లో విస్తరించి ఉంది. దాని లోపల ఒక పెద్ద ఎగ్జిబిషన్ హాల్ ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద హాళ్లలో ఒకటి. యశోభూమి ఎగ్జిబిషన్ హాలులో ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. 73,000 చదరపు మీటర్లలో విస్తరించి ఉన్న ఈ హాల్లో ప్రధాన ఆడిటోరియం, గ్రాండ్ బాల్రూమ్,13 మీటింగ్ హాళ్లు ఉన్నాయి. ఇది 11,000 మంది అతిథులకు వసతి కల్పిస్తుంది. కన్వెన్షన్ సెంటర్లో దాదాపు 6,000 మంది అతిథులు కూర్చునే సామర్థ్యం ఉంది. ఇక్కడ సీటింగ్ ఏర్పాట్లు ఆధునికంగా రూపొందించబడ్డాయి. ఇక్కడ బాల్రూమ్ సామర్థ్యం 2,500 మంది అతిథులు, అవసరమైతే మరో 500 మంది అతిథులకు పెంచవచ్చు.
తాజావార్తలు
-
Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్’పై స్టార్ యాక్టర్ సంచలనం!
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!