Phone Tapping Case: సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు బెయిల్.. కానీ..!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట
- మధ్యంతర బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మార్చిన ధర్మాసనం
- విచారణకు సహకరించాలన్న కోర్టు ఆదేశాలు
- కఠిన నిబంధనలతో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గత కొంతకాలంగా ఈ కేసు విచారణలో భాగంగా ఆయనకు ఉన్న మధ్యంతర బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మారుస్తూ జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ మహాదేవన్ల ధర్మాసనం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణ దాదాపు ముగింపు దశకు చేరుకుందని, మరో రెండు వారాల్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టుకు వివరించడంతో, ధర్మాసనం ప్రభాకర్ రావుకు నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Special Report : గ్రానైట్ పరిశ్రమకు యుద్ధ సెగ.. సంక్షోభంలో వేలాది మంది కార్మికులు..
Also Read
- OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
- Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
కేసు నమోదైన ప్రారంభ దశలో ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లడం, ఆ తర్వాత ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ అవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే, తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అరెస్ట్ నుండి రక్షణ కల్పిస్తే విచారణకు సహకరిస్తానని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు ఆయన భారత్కు తిరిగి వచ్చి సిట్ (SIT) అధికారుల ముందు హాజరయ్యారు. విచారణలో భాగంగా ఆయన తన పాత సెల్ ఫోన్లు, కంప్యూటర్లలోని డేటా విషయంలో సరిగ్గా సహకరించడం లేదని ప్రభుత్వం గతంలో వాదించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని భావించిన ఉన్నత న్యాయస్థానం ఈ ఊరటనిచ్చింది.
అయితే, ఈ బెయిల్ మంజూరు చేస్తూనే సుప్రీంకోర్టు అత్యంత కఠినమైన షరతులను విధించింది. ప్రభాకర్ రావు తన పాస్పోర్ట్ను వెంటనే కోర్టులో సరెండర్ చేయాలని, ట్రయల్ కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, కేసులోని సాక్షులను ప్రభావితం చేయడం కానీ, కీలకమైన డిజిటల్ ఆధారాలను టాంపర్ చేయడం కానీ చేయకూడదని హెచ్చరించింది. ఒకవేళ ఈ నిబంధనల్లో దేనినైనా ఉల్లంఘించినట్లు తేలితే, మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాల్సి ఉంటుందని ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దాఖలు చేయబోయే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఈ కేసులో ప్రభాకర్ రావు పాత్రను మరింత స్పష్టం చేయనుంది.
UN-India: ఆప్ఘనిస్థాన్లో పాక్ దాడులు అన్యాయం.. ఖండించిన భారత్
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..