Phone Tapping Case: సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు బెయిల్.. కానీ..!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట
- మధ్యంతర బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మార్చిన ధర్మాసనం
- విచారణకు సహకరించాలన్న కోర్టు ఆదేశాలు
- కఠిన నిబంధనలతో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గత కొంతకాలంగా ఈ కేసు విచారణలో భాగంగా ఆయనకు ఉన్న మధ్యంతర బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మారుస్తూ జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ మహాదేవన్ల ధర్మాసనం మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణ దాదాపు ముగింపు దశకు చేరుకుందని, మరో రెండు వారాల్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టుకు వివరించడంతో, ధర్మాసనం ప్రభాకర్ రావుకు నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Special Report : గ్రానైట్ పరిశ్రమకు యుద్ధ సెగ.. సంక్షోభంలో వేలాది మంది కార్మికులు..
Also Read
- Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
- Telangana Public School: ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్' ప్రారంభించనున్న సీఎం.!
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
కేసు నమోదైన ప్రారంభ దశలో ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లడం, ఆ తర్వాత ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ అవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే, తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అరెస్ట్ నుండి రక్షణ కల్పిస్తే విచారణకు సహకరిస్తానని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు ఆయన భారత్కు తిరిగి వచ్చి సిట్ (SIT) అధికారుల ముందు హాజరయ్యారు. విచారణలో భాగంగా ఆయన తన పాత సెల్ ఫోన్లు, కంప్యూటర్లలోని డేటా విషయంలో సరిగ్గా సహకరించడం లేదని ప్రభుత్వం గతంలో వాదించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని భావించిన ఉన్నత న్యాయస్థానం ఈ ఊరటనిచ్చింది.
అయితే, ఈ బెయిల్ మంజూరు చేస్తూనే సుప్రీంకోర్టు అత్యంత కఠినమైన షరతులను విధించింది. ప్రభాకర్ రావు తన పాస్పోర్ట్ను వెంటనే కోర్టులో సరెండర్ చేయాలని, ట్రయల్ కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, కేసులోని సాక్షులను ప్రభావితం చేయడం కానీ, కీలకమైన డిజిటల్ ఆధారాలను టాంపర్ చేయడం కానీ చేయకూడదని హెచ్చరించింది. ఒకవేళ ఈ నిబంధనల్లో దేనినైనా ఉల్లంఘించినట్లు తేలితే, మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాల్సి ఉంటుందని ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దాఖలు చేయబోయే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఈ కేసులో ప్రభాకర్ రావు పాత్రను మరింత స్పష్టం చేయనుంది.
UN-India: ఆప్ఘనిస్థాన్లో పాక్ దాడులు అన్యాయం.. ఖండించిన భారత్
తాజావార్తలు
-
FIFA World Cup: సెనెగల్పై ‘కిలియన్ ఎంబాపే’ డబుల్ ట్రీట్.. 3-1 తేడాతో విజయం.!
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’ మూవీ స్టోరీ లీక్
-
Explained: యుద్ధంలో ట్రంప్ ఘోర పరాజయం.. ప్రపంచం ముందు నవ్వులపాలైన అమెరికా!
-
Fake Currency Scam: రూపాయి ఇస్తే మూడు రూపాయలు.. నకిలీ నోట్ల ఆశతో 14 లక్షలు పోగొట్టుకున్న అన్నదమ్ములు!
-
Crime News: రహస్యంగా పెళ్లి.. చివరకి భార్యకు విషం తాగించి, గొంతు నులిమి చంపాడు.. భర్తను పట్టించిన ఇన్స్టా స్టోరీ!
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!