PM Modi: కాంగ్రెస్ తుప్పుపట్టిన ఇనుము లాంటింది.. మధ్యప్రదేశ్లో ప్రధాని మోడీ
PM Modi: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలించిన ప్రతి రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్లోని భోపాల్లోల బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ‘కార్యకర్త మహాకుంభ్’లో పాల్గొని ప్రసంగించారు. మధ్యప్రదేశ్లో సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ‘బీమారు రాజ్యం’గా మారుస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలించిన ప్రతి రాష్ట్రాన్ని నాశనం చేసిందని, మధ్యప్రదేశ్ను కూడా అదే చేస్తుందని కాంగ్రెస్పై ఆయన మండిపడ్డారు. మధ్యప్రదేశ్లో 20 ఏళ్లుగా బీజేపీ పాలిస్తోందని.. మధ్యప్రదేశ్లోని ప్రస్తుత యువత కాంగ్రెస్ ప్రభుత్వ దుష్పరిపాలనను చూడకపోవడం అదృష్టమన్నారు.
Also Read: Asian Games 2023: టీమిండియా ఉమెన్స్ క్రికెట్ జట్టును వరించిన పసిడి
Also Read
- Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
- GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- Vaibhav Sooryavanshi: నా బలం, శక్తికి కారణం అదే.. అందుకే ఈ దూకుడు.. మనసులో మాట చెప్పిన వైభవ్..
- MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?
కాంగ్రెస్ పార్టీ మొత్తం నాశనం చేయబడిందని.. ఆ పార్టీ ఇప్పుడు దివాళా తీసిందన్న ప్రధాని మోడీ.. ఇప్పుడు కాంగ్రెస్ మరొకరు నియంత్రిస్తున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ను ‘అర్బన్ నక్సల్స్’ నియంత్రిస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. “అర్బన్ నక్సల్స్ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నారు!” అనే శీర్షికతో తన వీడియోతో పోస్ట్ చేసిన ట్వీట్తో ఆయన తన సోషల్ మీడియాలో అదే విషయాన్ని నొక్కి చెప్పారు. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవిశ్రాంతంగా పనిచేస్తోందని, అందువల్ల మధ్యప్రదేశ్ ప్రజలు మళ్లీ అలాంటి రోజులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్కు రాబోయే సంవత్సరాలు చాలా కీలకమని.. వంశపారంపర్య పార్టీ, అవినీతితో నిండిన పార్టీ అయిన కాంగ్రెస్కి అవకాశం వస్తే అది రాష్ట్రానికి తీరని నష్టమేనని ప్రధాని మోడీ చెప్పారు. కాంగ్రెస్కు భవిష్యత్తుపై విజన్ లేదని పేర్కొన్న ప్రధాని మోడీ.. ఆ పార్టీ తుప్పుపట్టిన ఇనుము లాంటిదని అన్నారు. దేశం గురించి మంచిగా ఆలోచించలేరని, దేశానికి మేలు చేసే ప్రతిదానిని వ్యతిరేకించారని ఆయన అన్నారు. దాదాపు 13.5 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించామని ప్రధాని పేర్కొన్నారు. బీజేపీ 13.5 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తం చేసిందని.. అది మధ్యప్రదేశ్ జనాభా కంటే ఎక్కువ అని పేర్కొన్నారు. మోడీ హామీలు ఎప్పటికీ ఖాళీ కావడమే ఇందుకు కారణమని ఆయన అన్నారు.
Also Read: Governor Tamilisai: తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై షాక్
“మేము మహిళల కోసం లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదించాము, అది కూడా వాగ్దానంలో భాగమే. ఈ బిల్లుతో భారతదేశం చరిత్రను లిఖించింది.” అని ఆయన అన్నారు. తమ పాలనలో ప్రతిహామీని నెరవేరుస్తున్నామని ఆయన చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్, ఇండియా కూటమి బలవంతం వల్లే మద్దతిచ్చాయని అన్నారు. ఈ కూటమిలోని ప్రజలు దశాబ్దాలుగా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
Also Read: DK ShivaKumar: బీజేపీ-జేడీఎస్ పొత్తుపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
కార్యకర్త మహాకుంభ్
జనసంఘ్ సహ వ్యవస్థాపకుడు దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా భోపాల్లోని జంబోరీ మైదాన్లో నిర్వహించిన ‘కార్యకర్త మహాకుంభ్’.. బీజేపీ జన్ ఆశీర్వాద యాత్రల అధికారిక ముగింపుగా నిలిచింది. గడిచిన ఆరు నెలల్లో మధ్యప్రదేశ్ ప్రధాని మోడీ పర్యటించడం ఇది ఏడోసారి. ‘మహాకుంభ్’లో ప్రసంగించే ముందు ప్రధాని మోదీ అర కిలోమీటరు మేర రోడ్షో నిర్వహించారు. ఈ ఊరేగింపు కోసం వేదిక వద్ద ప్రత్యేక రహదారిని నిర్మించారు. కార్యక్రమ షెడ్యూల్ ప్రకారం, ఉదయం 10:55 గంటలకు భోపాల్ విమానాశ్రయంలో దిగిన మోడీ, చాపర్లో జంబోరీ మైదాన్ హెలిప్యాడ్కు వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ ఎన్నికలకు ముందు నిర్వహించే అతిపెద్ద కార్యక్రమంగా అభివర్ణిస్తున్నారు. ఇది రాష్ట్రంలోని ఐదు వేర్వేరు ప్రదేశాల నుండి ప్రారంభమైన జన్ ఆశీర్వాద యాత్రల ముగింపును కూడా సూచిస్తుంది. మొత్తం 230 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. బీజేపీ కార్యకర్తలు జంబోరీ మైదానంలో ఐదు వాటర్ప్రూఫ్ పండళ్లను ఏర్పాటు చేశారు. 60,000 మంది సామర్థ్యం ఉన్న ప్రధాన పండల్ను నేరుగా ప్రధానమంత్రి వేదిక ముందు ఉంచారు.
తాజావార్తలు
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
-
GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
-
Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో