PM Modi: కాంగ్రెస్ తుప్పుపట్టిన ఇనుము లాంటింది.. మధ్యప్రదేశ్లో ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలించిన ప్రతి రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్లోని భోపాల్లోల బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ‘కార్యకర్త మహాకుంభ్’లో పాల్గొని ప్రసంగించారు. మధ్యప్రదేశ్లో సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ‘బీమారు రాజ్యం’గా మారుస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలించిన ప్రతి రాష్ట్రాన్ని నాశనం చేసిందని, మధ్యప్రదేశ్ను కూడా అదే చేస్తుందని కాంగ్రెస్పై ఆయన మండిపడ్డారు. మధ్యప్రదేశ్లో 20 ఏళ్లుగా బీజేపీ పాలిస్తోందని.. మధ్యప్రదేశ్లోని ప్రస్తుత యువత కాంగ్రెస్ ప్రభుత్వ దుష్పరిపాలనను చూడకపోవడం అదృష్టమన్నారు.
Also Read: Asian Games 2023: టీమిండియా ఉమెన్స్ క్రికెట్ జట్టును వరించిన పసిడి
Also Read
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
కాంగ్రెస్ పార్టీ మొత్తం నాశనం చేయబడిందని.. ఆ పార్టీ ఇప్పుడు దివాళా తీసిందన్న ప్రధాని మోడీ.. ఇప్పుడు కాంగ్రెస్ మరొకరు నియంత్రిస్తున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ను ‘అర్బన్ నక్సల్స్’ నియంత్రిస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. “అర్బన్ నక్సల్స్ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నారు!” అనే శీర్షికతో తన వీడియోతో పోస్ట్ చేసిన ట్వీట్తో ఆయన తన సోషల్ మీడియాలో అదే విషయాన్ని నొక్కి చెప్పారు. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవిశ్రాంతంగా పనిచేస్తోందని, అందువల్ల మధ్యప్రదేశ్ ప్రజలు మళ్లీ అలాంటి రోజులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్కు రాబోయే సంవత్సరాలు చాలా కీలకమని.. వంశపారంపర్య పార్టీ, అవినీతితో నిండిన పార్టీ అయిన కాంగ్రెస్కి అవకాశం వస్తే అది రాష్ట్రానికి తీరని నష్టమేనని ప్రధాని మోడీ చెప్పారు. కాంగ్రెస్కు భవిష్యత్తుపై విజన్ లేదని పేర్కొన్న ప్రధాని మోడీ.. ఆ పార్టీ తుప్పుపట్టిన ఇనుము లాంటిదని అన్నారు. దేశం గురించి మంచిగా ఆలోచించలేరని, దేశానికి మేలు చేసే ప్రతిదానిని వ్యతిరేకించారని ఆయన అన్నారు. దాదాపు 13.5 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించామని ప్రధాని పేర్కొన్నారు. బీజేపీ 13.5 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తం చేసిందని.. అది మధ్యప్రదేశ్ జనాభా కంటే ఎక్కువ అని పేర్కొన్నారు. మోడీ హామీలు ఎప్పటికీ ఖాళీ కావడమే ఇందుకు కారణమని ఆయన అన్నారు.
Also Read: Governor Tamilisai: తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై షాక్
“మేము మహిళల కోసం లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదించాము, అది కూడా వాగ్దానంలో భాగమే. ఈ బిల్లుతో భారతదేశం చరిత్రను లిఖించింది.” అని ఆయన అన్నారు. తమ పాలనలో ప్రతిహామీని నెరవేరుస్తున్నామని ఆయన చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్, ఇండియా కూటమి బలవంతం వల్లే మద్దతిచ్చాయని అన్నారు. ఈ కూటమిలోని ప్రజలు దశాబ్దాలుగా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
Also Read: DK ShivaKumar: బీజేపీ-జేడీఎస్ పొత్తుపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
కార్యకర్త మహాకుంభ్
జనసంఘ్ సహ వ్యవస్థాపకుడు దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా భోపాల్లోని జంబోరీ మైదాన్లో నిర్వహించిన ‘కార్యకర్త మహాకుంభ్’.. బీజేపీ జన్ ఆశీర్వాద యాత్రల అధికారిక ముగింపుగా నిలిచింది. గడిచిన ఆరు నెలల్లో మధ్యప్రదేశ్ ప్రధాని మోడీ పర్యటించడం ఇది ఏడోసారి. ‘మహాకుంభ్’లో ప్రసంగించే ముందు ప్రధాని మోదీ అర కిలోమీటరు మేర రోడ్షో నిర్వహించారు. ఈ ఊరేగింపు కోసం వేదిక వద్ద ప్రత్యేక రహదారిని నిర్మించారు. కార్యక్రమ షెడ్యూల్ ప్రకారం, ఉదయం 10:55 గంటలకు భోపాల్ విమానాశ్రయంలో దిగిన మోడీ, చాపర్లో జంబోరీ మైదాన్ హెలిప్యాడ్కు వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ ఎన్నికలకు ముందు నిర్వహించే అతిపెద్ద కార్యక్రమంగా అభివర్ణిస్తున్నారు. ఇది రాష్ట్రంలోని ఐదు వేర్వేరు ప్రదేశాల నుండి ప్రారంభమైన జన్ ఆశీర్వాద యాత్రల ముగింపును కూడా సూచిస్తుంది. మొత్తం 230 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. బీజేపీ కార్యకర్తలు జంబోరీ మైదానంలో ఐదు వాటర్ప్రూఫ్ పండళ్లను ఏర్పాటు చేశారు. 60,000 మంది సామర్థ్యం ఉన్న ప్రధాన పండల్ను నేరుగా ప్రధానమంత్రి వేదిక ముందు ఉంచారు.
తాజావార్తలు
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
-
China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
-
Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!