Udhyanidhi: పీఎం కేర్స్ ఫండ్, కాగ్ రిపోర్ట్, మణిపూర్… ఈ సమస్యలపై తొమ్మిదేళ్ల లెక్కలు చెప్పండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhyanidhi: సనాతన్ సమస్యపై గందరగోళం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ పీఎం కేర్స్ ఫండ్, కాగ్ నివేదిక, మణిపూర్ హింస, తొమ్మిదేళ్ల పనిపై ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకున్నారు. సనాతన్ సమస్య మణిపూర్, రూ. 7.5 కోట్ల అవినీతి అంశం నుంచి దృష్టి మరల్చేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పన్నిన ఎత్తుగడ అని ఆరోపించారు. ఈ మేరకు ఉదయనిధి ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
Read Also:Vivek Ramaswamy: నేను ప్రెసిడెంట్ అయితే.. వారందరికి క్షమాభిక్ష ప్రసాదిస్తా..
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాని మోడీ, ఆయన మిత్రపక్షాలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మణిపూర్లో జరిగిన మరణాలు, రూ.7.5 కోట్ల అవినీతిని దాచిపెట్టేందుకే సనాతన్ అంశాన్ని లేవనెత్తారని స్టాలిన్ అన్నారు. పీఎం కేర్స్ ద్వారా కరోనా మహమ్మారి కోసం డబ్బు వసూలు చేసినట్లు ప్రధాని మోడీచెబుతున్నారని, అయితే రూ.7.5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న కాగ్ నివేదికపై ఆయన ఎప్పుడూ స్పందించలేదని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. మణిపూర్ సమస్యపై స్పందించకుండా తన స్నేహితుడు గౌతమ్ అదానీతో కలిసి మోడీ ప్రపంచ యాత్ర చేస్తున్నాడంటూ ఆరోపించాడు.
Read Also:Ambati Rambabu: రాష్ట్రంలో ముగ్గురు రాక్షసులు.. అంబటి తీవ్ర వ్యాఖ్యలు..
కేంద్ర మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తప్పుడు వార్తల ఆధారంగా తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంలో ఆశ్చర్యం లేదని స్టాలిన్ అన్నారు. అన్ని మతాలను గౌరవిస్తున్నామని, ప్రజలందరూ సమానమేనని అన్నారు. 9 ఏళ్ల పాలనలో ప్రధాని మోడీ చేసిన పని ఏంటని ఉదయనిధి స్టాలిన్ తన లేఖలో ప్రశ్నించారు. ప్రధాని మోడీ నోట్ల రద్దును మాత్రమే చేశారని, మురికివాడలను దాచిపెట్టేందుకు గోడలు కట్టారని, కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించారని, కొత్త పార్లమెంట్లో సింగోల్ను ఏర్పాటు చేశారని, ఇప్పుడు దేశం పేరు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టాలిన్ అన్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!