Udhyanidhi: పీఎం కేర్స్ ఫండ్, కాగ్ రిపోర్ట్, మణిపూర్… ఈ సమస్యలపై తొమ్మిదేళ్ల లెక్కలు చెప్పండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udhyanidhi: సనాతన్ సమస్యపై గందరగోళం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ పీఎం కేర్స్ ఫండ్, కాగ్ నివేదిక, మణిపూర్ హింస, తొమ్మిదేళ్ల పనిపై ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకున్నారు. సనాతన్ సమస్య మణిపూర్, రూ. 7.5 కోట్ల అవినీతి అంశం నుంచి దృష్టి మరల్చేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పన్నిన ఎత్తుగడ అని ఆరోపించారు. ఈ మేరకు ఉదయనిధి ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
Read Also:Vivek Ramaswamy: నేను ప్రెసిడెంట్ అయితే.. వారందరికి క్షమాభిక్ష ప్రసాదిస్తా..
Also Read
- Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
- Sugar Prices: చక్కెర ధరలపై గుడ్న్యూస్.. దిగిరానున్న ధరలు
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- IND vs SL 2nd Test: కొలంబో టెస్ట్లో భారత్ డిక్లేర్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్..
ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాని మోడీ, ఆయన మిత్రపక్షాలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మణిపూర్లో జరిగిన మరణాలు, రూ.7.5 కోట్ల అవినీతిని దాచిపెట్టేందుకే సనాతన్ అంశాన్ని లేవనెత్తారని స్టాలిన్ అన్నారు. పీఎం కేర్స్ ద్వారా కరోనా మహమ్మారి కోసం డబ్బు వసూలు చేసినట్లు ప్రధాని మోడీచెబుతున్నారని, అయితే రూ.7.5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న కాగ్ నివేదికపై ఆయన ఎప్పుడూ స్పందించలేదని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. మణిపూర్ సమస్యపై స్పందించకుండా తన స్నేహితుడు గౌతమ్ అదానీతో కలిసి మోడీ ప్రపంచ యాత్ర చేస్తున్నాడంటూ ఆరోపించాడు.
Read Also:Ambati Rambabu: రాష్ట్రంలో ముగ్గురు రాక్షసులు.. అంబటి తీవ్ర వ్యాఖ్యలు..
కేంద్ర మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తప్పుడు వార్తల ఆధారంగా తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంలో ఆశ్చర్యం లేదని స్టాలిన్ అన్నారు. అన్ని మతాలను గౌరవిస్తున్నామని, ప్రజలందరూ సమానమేనని అన్నారు. 9 ఏళ్ల పాలనలో ప్రధాని మోడీ చేసిన పని ఏంటని ఉదయనిధి స్టాలిన్ తన లేఖలో ప్రశ్నించారు. ప్రధాని మోడీ నోట్ల రద్దును మాత్రమే చేశారని, మురికివాడలను దాచిపెట్టేందుకు గోడలు కట్టారని, కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించారని, కొత్త పార్లమెంట్లో సింగోల్ను ఏర్పాటు చేశారని, ఇప్పుడు దేశం పేరు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టాలిన్ అన్నారు.
తాజావార్తలు
-
FEFSI : కోలీవుడ్లో సమ్మె సైరన్పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
-
Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
-
Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!