Udhyanidhi: పీఎం కేర్స్ ఫండ్, కాగ్ రిపోర్ట్, మణిపూర్… ఈ సమస్యలపై తొమ్మిదేళ్ల లెక్కలు చెప్పండి
Udhyanidhi: సనాతన్ సమస్యపై గందరగోళం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ పీఎం కేర్స్ ఫండ్, కాగ్ నివేదిక, మణిపూర్ హింస, తొమ్మిదేళ్ల పనిపై ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకున్నారు. సనాతన్ సమస్య మణిపూర్, రూ. 7.5 కోట్ల అవినీతి అంశం నుంచి దృష్టి మరల్చేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పన్నిన ఎత్తుగడ అని ఆరోపించారు. ఈ మేరకు ఉదయనిధి ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
Read Also:Vivek Ramaswamy: నేను ప్రెసిడెంట్ అయితే.. వారందరికి క్షమాభిక్ష ప్రసాదిస్తా..
ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాని మోడీ, ఆయన మిత్రపక్షాలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మణిపూర్లో జరిగిన మరణాలు, రూ.7.5 కోట్ల అవినీతిని దాచిపెట్టేందుకే సనాతన్ అంశాన్ని లేవనెత్తారని స్టాలిన్ అన్నారు. పీఎం కేర్స్ ద్వారా కరోనా మహమ్మారి కోసం డబ్బు వసూలు చేసినట్లు ప్రధాని మోడీచెబుతున్నారని, అయితే రూ.7.5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న కాగ్ నివేదికపై ఆయన ఎప్పుడూ స్పందించలేదని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. మణిపూర్ సమస్యపై స్పందించకుండా తన స్నేహితుడు గౌతమ్ అదానీతో కలిసి మోడీ ప్రపంచ యాత్ర చేస్తున్నాడంటూ ఆరోపించాడు.
Read Also:Ambati Rambabu: రాష్ట్రంలో ముగ్గురు రాక్షసులు.. అంబటి తీవ్ర వ్యాఖ్యలు..
కేంద్ర మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తప్పుడు వార్తల ఆధారంగా తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంలో ఆశ్చర్యం లేదని స్టాలిన్ అన్నారు. అన్ని మతాలను గౌరవిస్తున్నామని, ప్రజలందరూ సమానమేనని అన్నారు. 9 ఏళ్ల పాలనలో ప్రధాని మోడీ చేసిన పని ఏంటని ఉదయనిధి స్టాలిన్ తన లేఖలో ప్రశ్నించారు. ప్రధాని మోడీ నోట్ల రద్దును మాత్రమే చేశారని, మురికివాడలను దాచిపెట్టేందుకు గోడలు కట్టారని, కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించారని, కొత్త పార్లమెంట్లో సింగోల్ను ఏర్పాటు చేశారని, ఇప్పుడు దేశం పేరు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టాలిన్ అన్నారు.
తాజావార్తలు
-
India – Russia: కష్టకాలంలో కదిలొచ్చిన ‘మిత్రుడు’.. చమురు సంక్షోభంలో భారత్ను ఆదుకున్న రష్యా!
-
Ganja: గంజాయి మాయలో సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఉద్యోగం వదిలి.. ఇంటిపైనే సాగు..
-
Lucky Zodiac Signs : మీన రాశిలోకి శని.. రేపటి నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!
-
SRH vs DC: ఉప్పల్లో ‘ఆరెంజ్’ ఆర్మీ వర్సెస్ ‘ఢిల్లీ’ వార్ షురూ.. టాస్ ఎవరు గెలిచారంటే!
-
Japan: 50 ఏళ్ల తర్వాత ప్రపంచ ఆయుధ మార్కెట్లోకి ‘జపాన్’ ఎంట్రీ.. డ్రాగన్కు చెక్ పెట్టేందుకేనా ?
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!