India-Canada Dispute: మహీంద్రా తర్వాత కెనడాకు షాక్ ఇచ్చిన మరో భారతీయ కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada Dispute: కెనడా- భారత్ మధ్య ఉద్రిక్తత తగ్గడం లేదు. ఈ గొడవ కారణంగా వ్యాపార ప్రపంచం ప్రభావితం అవుతుంది. ఆనంద్ మహీంద్రా కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కెనడియన్ సంస్థ రేసన్ ఏరోస్పేస్ కార్పొరేషన్తో తన భాగస్వామ్యాన్ని ముగించుకుంది. ఇప్పుడు అలాంటి వార్త మరొక కంపెనీ గురించి వెలుగులోకి వచ్చింది. కెనడాకు చెందిన టెక్ రిసోర్సెస్కు చెందిన స్టీల్మేకింగ్ కోల్ యూనిట్లో వాటా కొనుగోలు ప్రక్రియను జేఎస్ డబ్ల్యూ స్టీల్ నెమ్మదిగా తగ్గించే ప్రయత్నం చేస్తోంది. భారతదేశపు అతిపెద్ద ఉక్కు కంపెనీ జేఎస్ డబ్ల్యూ స్టీల్, టెక్ రిసోర్సెస్ మధ్య వాటా విక్రయ ప్రక్రియపై చర్చ మందగించిందని, అయితే పత్రాల ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది.
Read Also:Laddu Chori: చార్మినార్ వద్ద వినాయకుని లడ్డూ మిస్సింగ్.. స్కూల్ కెళ్ళాల్సినోళ్ళు ఏం పనుల్రా అవి?
Also Read
ఈ ఒప్పందం కోసం రెండు కంపెనీల మధ్య ఉన్న సమస్య పరిష్కారానికి వేచి ఉందని నివేదిక పేర్కొంది. సమస్య పరిష్కారం అయిన వెంటనే విక్రయ ప్రక్రియ మళ్లీ వేగం పుంజుకోవచ్చు. ఈ ఒప్పందం పూర్తిగా ఆగిపోతుందని కూడా చెప్పలేం. ఎందుకంటే రెండు కంపెనీల మధ్య పేపర్ వర్క్ ఇంకా కొనసాగుతోంది. ఈ విషయంపై ఇద్దరూ ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. మరోవైపు, లావాదేవీ కోసం జేఎస్ డబ్ల్యూ బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బొగ్గు వ్యాపారంలో దేశంలోనే అతిపెద్ద కంపెనీల్లో జేఎస్డబ్ల్యూ టెక్ ఒకటి కావడం గమనార్హం.
Read Also:Guntur Kaaram: సాంగ్ వస్తుంది అనే వార్త వినిపిస్తూనే ఉంది… కానీ ఎప్పుడో తెలియదు
సిక్కు వేర్పాటువాద నేత హత్య తర్వాత కెనడాలో వివాదం పెరిగింది. తనను భారత ఏజెంట్లే హత్య చేశారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ కెనడియన్ ఆరోపణను భారత్ అసంబద్ధం అని పేర్కొంది.. దానిని తిరస్కరించింది. అయితే, దీని తర్వాత కెనడా ఒక భారతీయ అధికారిని బహిష్కరించింది. దీని తరువాత, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి భద్రతను పేర్కొంటూ కెనడియన్ పౌరులకు వీసాలను సస్పెండ్ చేశారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!