Manipur Landslide: 14 మంది మృతి..60 మంది చిక్కుకున్నట్లుగా అనుమానం
మణిపూర్ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 14 మంది మరణించారు. మరో 60 మంది దాకా చిక్కుపోయినట్లు అదికారులు అనుమానిస్తున్నారు. చాలా మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. మణిపూర్ డీజీపీ పి డౌంగెల్ మాట్లాడుతూ.. 23 మందిని కొండచరియల కింద నుంచి బయటకు తీయగా 14 మంది మరణించారని వెల్లడించారు. ఇండియన్ ఆర్మీతో పాటు అస్సాం రైఫిల్స్, టెరిటోరియల్ ఆర్మీ దళాలు ఘటన జరిగినప్పటి నుంచి రెస్క్యూ చర్యలు కొనసాగిస్తున్నారు. సైన్యం, రైల్వే సిబ్బంది, సమీప గ్రామాల్లోని కూలీలు కొండచరియల కింద చిక్కుకున్నారు. అననుకూల పరిస్థితులు ఎదురవుతున్నా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Read Also:Manipur: విరిగిపడిన కొండచరియలు.. 7గురు జవాన్లు మృతి, 45మంది గల్లంతు
Also Read
మణిపూర్ లోని నోని జిల్లాలోని టుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం అర్థరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. భారీగా వర్షాలు కురుస్తుండటంతో సమీపంలో మోహరించిన 107 టెరిటోరియల్ ఆర్మీకి చెందిన స్థావరాలపై కొండచరియలు విరుచుకుపడ్డాయి. జిరిబామ్ నుంచి ఇంఫాల్ వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ రక్షణ కోసం ఆర్మీ అక్కడ ఉంది. ప్రధాని మోదీ స్వయంగా సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తో ప్రధాని మోదీ మాట్లాడారు. కేంద్ర నుంచి ఎలాంటి సాయాన్ని అయినా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
#UPDATE Noney, Manipur | 23 people were brought out from debris of which 14 dead. More are being searched. Not confirmed how many are buried but as of now 60 people including villagers, army & railway personnel, labourers (buried): DGP P Doungel (30.06) https://t.co/xTIYrRVP4I pic.twitter.com/4d8jbVZGHy
— ANI (@ANI) June 30, 2022
తాజావార్తలు
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో