లక్ష్యాలెప్పుడూ సులభంగా ఉండకూడదని ప్రధాని మోడీ సూచించారు. ‘పరీక్షా పే చర్చ’’ 9వ సీజన్లో భాగంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో మోడీ ముచ్చటించారు. గుజరాత్, కోయంబత్తూర్, రాయ్పూర్, గౌహతి, ఢిల్లీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం నింపారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ రాజ్యసభలో ప్రతపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. గురువారం ఆయన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడారు. రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ రావనీత్ బిట్టునుపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మోడీ ప్రస్తావించారు. బిట్టుని రాహుల్ గాంధీ ‘‘ద్రోహి’’ అంటూ కామెంట్స్ చేశారు. ఇటీవల పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ నిరసన తెలుపుతూ.. ‘‘ద్రోహి వెళ్తున్నాడు, అతడి ముఖం చూడండి. ద్రోహి మిత్రమా, నువ్వు కాంగ్రెస్లోకి తిరిగి వస్తావు’’ అని అన్నారు.…
PM Modi: ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రక్షాళన కార్యక్రమం ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’పై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే, ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ రాజ్యసభలో లేవనెత్తారు. రాష్ట్రతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ..
PM Modi: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ, ఇటీవల పలు దేశాలతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్స్ గురించి సభకు వివరించారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య సభలో ప్రధాని ప్రసంగించారు. ఆయన ప్రసంగానికి నిరసనగా విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
పార్లమెంట్ ఉభయ సభల్లో అధికార-ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల-తూటాలు పేలుతున్నాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన దగ్గర నుంచి ప్రతిపక్ష సభ్యులంతా ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
PM Modi: ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కటే టెన్షన్.. ట్రంప్ కు ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు టారిఫ్లు బాధుతారన్న భయం. ట్రంప్ చేస్తున్న టారిఫ్ యుద్ధానికి అన్ని దేశాలు వణకిపోతున్నాయి. ఒకవైపు అగ్రరాజ్యాల అంక్షలు, మరోవైపు గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న అనిచ్చితి. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ భారత్ మాత్రం తన దౌత్య వ్యూహాన్ని ప్రదర్శించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే అటు యూరోపియన్, యూనియన్ ఇటు అమెరికాతో భారత్ కుదుర్చుకున్న రెండు మెగా ట్రేడ్ డీల్స్ ఇప్పుడు…
2026 సంవత్సరం భారతదేశానికి కలిసొచ్చినట్లు అనిపిస్తోంది. గతేడాది అంతా గందరగోళంగా ఉంటే.. ఈ ఏడాది మాత్రం ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపడుతున్నాయి. మొన్నటికి మొన్న యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది.
దేశీయ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల పంట పండింది. గంటల వ్యవధిలోనే కోట్ల సంపాదన జేబుల్లో పడ్డాయి. దీంతో ఇన్వెస్టర్లు ఫుల్జోష్లో ఉన్నారు. అన్ని పండుగలన్నీ ఒకేసారి వచ్చినట్లైంది.
భారత్-అమెరికా మధ్య చారిత్రాత్మకమైన వాణిజ్య ఒప్పందం జరిగింది. సోమవారం రాత్రి ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ సంభాషణ చేశారు. అనంతరం భారత్పై సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో భారతీయ ఉత్పత్తులకు భారీ ఊరట లభించినట్లైంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్కు కూడా మంచి ఊపునిచ్చింది. భారీ స్థాయిలో లాభాల్లో దూసుకుపోతుంది.
ఓ.. పుస్తకం పార్లమెంట్ను స్తంభింపజేసింది. అధికార-ప్రతిపక్షాల మధ్య రగడ రాజేసింది. గంటల తరబడి సభ గందరగోళంగా మారింది. ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ప్రస్తావించిన పుస్తకంలో అసలు ఏముంది? ఎందుకు కేంద్రం అడ్డుపడింది. ఈ వివరాలు తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.