పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు, ప్రాణ నష్టంపై మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే భారతీయుల భద్రత, ఇంధన సరఫరాపై కీలకంగా మోడీ చర్చించారు.
LPG Crisis: ఇరాన్ యుద్ధం కారణంగా, దేశంలో గ్యాస్, పెట్రోల్ సంక్షోభంపై కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు. దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత లేదని స్పష్టం చేశారు. గృహ వినియోగదారులకు ఎలాంటి సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతున్నా.. ట్రంప్ మాత్రం తనకేమీ పట్టనట్టు ‘‘తగ్గేదేలే’’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే గ్లోబల్ టారిఫ్లను అమెరికా సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ పరిణామం ట్రంప్ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బగానే మిగిలింది.
PM Modi: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో సుమారు ₹33,500 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తూ, పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వం అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ప్రోటోకాల్ను ఉల్లంఘించిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. టీఎంసీ రాష్ట్రపతిని అవమానించిందని ప్రధాని ఆరోపించారు.
సైనిక సంఘర్షణతో సమస్యకు పరిష్కారం దొరకదని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో ఫిన్నిష్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు.
సోషల్ మీడియా ప్రపంచంలో ప్రధాని మోడీ దూసుకుపోతున్నారు. తాజాగా మరో ఘనత సాధించారు. యూట్యూబ్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ఫాలోవర్లను కలిగిన నాయకుడిగా మోడీ సరికొత్త చరిత్ర సృష్టించారు.
Breaking News: పశ్చిమాసియా పరిణామాలు, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఆదివారం రాత్రి అత్యున్నత సమావేశం జరగబోతోంది. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమావేశం కానుంది. తమిళనాడు పర్యటన తర్వాత ఆదివారం రాత్రి మోడీ ఢిల్లీకి చేరుకున్న తర్వాత సేవాతీర్థ్లో ఈ సమావేశంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులు, గల్ఫ్ దేశాల్లోని భారతీయుల రక్షణ గురించి చర్చించే అవకాశం ఉంది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో సహా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో సీబీఐ సమర్పించిన సాక్ష్యాలు బలంగా లేవని రౌస్ ఎవెన్యూ కోర్టు పేర్కొంది. ఈ తీర్పు తర్వాత, కేజ్రీవాల్ ప్రధాని మోడీ, అమిత్ షాలపై విరుచుకుపడ్డారు. వీరిద్దరే తనపై కుట్ర చేశారని, ఆప్ లేకుండా చేయాలని తనను జైలుకు పంపారని సంచలన ఆరోపణలు చేశారు.
Benjamin Netanyahu: ప్రధాని నరేంద్రమోడీపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇజ్రాయిల్ పార్లమెంట్లో ప్రధాని మోడీ ప్రసంగం ఇజ్రాయిల్ ప్రజల్ని భావోద్వేగానికి గురిచేసిందని అన్నారు. మోడీ ప్రసంగంతో ప్రతీ ఇజ్రాయిలీ కళ్లు చెమ్మగిల్లాయని నెతన్యాహూ భావోద్వేగానికి గురయ్యారు. మోడీ రెండు రోజుల ఇజ్రాయిల్ పర్యటన చిన్నదే కానీ అసాధారణంగా హృదయపూర్వకంగా ఉందని చెప్పారు. Read Also: Vamsi Nandipati : నంది అవార్డుల వివాదంపై స్పందించిన వంశీ నందిపాటి! “ఇది అద్భుతమైన పర్యటన,…